దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడూ బీజీగా ఉండే సినీ నటులకు విశ్రాంతి తీసుకునే సమయం చాలానే దొరికింది. కాస్తా సమయం దొరికితే చాలు కొందరు సినీ స్టార్స్ వారి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి ఔటింగ్స్ వెళ్లినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు భలే విచిత్రంగానూ.. ఒక్కొసారి భయానకంగానూ.. ఉంటాయని ఇది వరకూ పలువురు నటీనటులు వెల్లడిస్తే తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో నటిగా, బుల్లితెర యాంకర్ గా, నిర్మతగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మీ.. ఇటీవలీ తన ప్రయాణంలో ఎదురైన ఆనందకరమైన క్షణాలు, భయానక పరిస్థితుల గురించి చెప్పింది. తన 41వ పుట్టిన రోజు వేడుకలను తన మిత్రులతో జరుపుకోవాలనే ఉద్దేశంతో గోవాకు వెళ్లింది. తనతో పాటు కూతురు విద్యా నిర్వాణను కూడా తీసుకెళ్లింది. దీనిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
కరోనా వ్యాప్తికి ముందు తనకు సంబంధించిన వేడుకలన్నీ ఏయిర్ పోర్ట్ నుంచే ప్రారంభమయ్యేవనీ, ఈ సారి కరోనా కారణంగా అలా జరగడం లేదని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వెళ్తున్న ఈ విహార యాత్ర తనను ఎంతగానో భయపెట్టిందని తెలిపింది. అలాగే, సంతోషాన్ని కూడా అందించిందని వివరించింది.
ఈ పర్యటనలో నిత్యం తన ఆలోచనలన్నీ నిర్వాణ చూట్టే తిరిగాయని తెలిపింది. ఈ ప్రయాణం మొత్తం మాస్కులు ధరించడం, శానిటైజర్లను వాడటంతో చాలా జాగ్రత్తల మధ్య కొనసాగిందని తెలిపింది. తన కూతురు దేనినీ తాకకుండా చూసుకోవడంపైనే దృష్టి సారించానని చెప్పింది. అయితే, ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం భయానకంగా అనిపించినప్పటికీ.. గోవా బీచ్ చేరగానే అన్ని దూరమయ్యాయని తెలిపింది. ఈ ప్రయాణం మరిన్ని కొంత అనుభూతులను పంచిందని చెప్పింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!