Pawan kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఊహించని అప్డేట్ వచ్చింది..ఫ్యాన్స్ ఇక నేలమీద నిలబడేరేమో. అవును..గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు. 1970ల నాటి కథాంశంతో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగానికి పైగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు.
ఆ తర్వాత నుంచి కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. దీనికంటే తర్వాత మొదలైన మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 25న మహా శివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే భీమ్లా నాయక్ తర్వాత వీరమల్లు సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏవీ మేకర్స్ నుంచి రాలేదు. నిర్మాత వద్ద బడ్జెట్ లేదనే టాక్ వినిపించింది.
Pawan kalyan: అవన్నీ గాలి వార్తలని తాజాగా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు.
కానీ, అవన్నీ గాలి వార్తలని తాజాగా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ప్రస్తుతం భారీ సెట్స్ను నిర్మిస్తున్నట్టు. తాజాగా హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నం కలిసి ఉన్న ఫొటోను రివీల్ చేశారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ను తలపించేలా భారీ సెట్ తయారవుతోంది. నిధి అగర్వాల్
హీరోయిన్గా..బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ మొఘల్ సామ్రాజ్య రాకుమారిగా కనిపించనుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక వీరమల్లు చిత్రాన్ని ఇదే ఏడాది పాన్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!