Upasana: స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు అయిన ఉపాసన 2012లో చరణ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం అనంతరం మెగా కోడలిగా కంటే తన సొంత టాలెంట్తోనే గుర్తింపు సంపాదించుకుంది.
అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను దగ్గరుండి చూసుకునే ఉపాసన.. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఎందరికో సాయపడుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఉపాసన తన గ్యారేజ్లోకి ఓ కొత్త కారును ఆహ్వానించింది. ఆడి ఈ ట్రాన్ కారును కొనుగోలు చేసుకున్నట్టుగా మెగా కోడలు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ కారు ఫీచర్స్ గురించి చెబుతూ ఉపాసన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. తన దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు ప్రగతి శీలమైన లగ్జరీ కూడా కలిసి ఉంటుందని.. ఆడి ఇ-ట్రాన్ ఆ రెండింటినీ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆడి ఇ-ట్రాన్ తో అత్యాధునిక ఆవిష్కరణలు, స్థిరత్వం, సౌకర్యాన్ని అనుభవించండి అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.
అలాగే ఈ కారు ధర విషయానికి వస్తే.. అత్యంత విలాసంగా ఉండే ఈ లగ్జరీ కారు ధర కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఉపాసన కొన్న ఆడి కారును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మెగా అభిమానులు, నెటిజన్లు విషెస్ తెలుపుతున్నారు.
https://www.instagram.com/tv/Cd5FRp9hMpX/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!