Vamshi Paidipally: మన సౌత్ స్టార్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, అగ్ర దర్శకులతో, నిర్మాతలతో పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్తో నిర్మించే పాన్ ఇండియన్ సినిమాలతో వచ్చే క్రేజ్ ఎంత ఉంటుందో తేడా కొడితే మళ్ళీ సినిమా ఛాన్స్ కోసం ఏ హీరో అయినా ఊగిసలాడాల్సి వస్తుంది. అందుకు ఉదాహరణ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించగా ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ సినిమానే.
ఇక ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తుంటే.. కోలీవుడ్ స్టార్స్ మాత్రం తెలుగు మార్కెట్ మీద పట్టు సాధించుకునేందుకు అన్నీ రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టాలీవుడ్లో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, సూర్య, కార్తి మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మిగతా హీరోలు కూడా రెడీ అవుతున్నారు. కొత్తగా విజయ్, శివ కార్తికేయన్, ధనుష్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.
Vamshi Paidipally: కథ బావుంటే మహేశ్ అస్సలు వదలడని టాక్ ఉంది.
జాతి రత్నాలు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కెవి అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ తెలుగు, తమిళ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అలాగే, త్వరలో విజయ్, వంశీ పైడిపల్లి సినిమా మొదలవబోతోంది. దీనిని పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే, ఈ కథ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాల్సింది. కానీ, మహేశ్ రిజెక్ట్ చేయడంతో అదే కథను వంశీ, విజయ్తో
చేస్తున్నాడు. కథ బావుంటే మహేశ్ అస్సలు వదలడని టాక్ ఉంది. మరి ఆయన రిజెక్ట్ చేసిన కథతో విజయ్ తెలుగు డెబ్యూకి హిట్ ఇస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!