Liger: ఈ ఏడాది ఆగస్టు 25వ తారీకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన “లైగర్” భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడిన సంగతి తెలిసిందే. వరస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండకి “లైగర్” అతి పెద్ద దెబ్బ వేసింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా సినిమా విడుదల అవ్వకముందు ఇండియా షేక్ చేస్తాం అంటూ పెద్ద పెద్ద డైలాగులు సినిమా యూనిట్ వేయడం జరిగింది.
కానీ “లైగర్” విడుదలైన మొదటి షోకే అట్టర్ ఫ్లాప్ అవడం.. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో పూరి జగన్నాథ్ తో పాటు హీరో విజయ్ దేవరకొండ చాలా వరకు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం జరిగింది. హీరోగా విజయ్ దేవరకొండ కష్టం సినిమాలో కనబడిన గాని దర్శకుడు పూరి మార్క్ లేకపోవడం ఎంతో నిరాశ కలిగించింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో.. తాజాగా సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు.
మెయిల్ యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా సినిమా సైమా అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ..”లైగర్” సినిమా నిరాశ పరచటం పట్ల మాట్లాడుతూ గొప్ప సినిమాలతో.. ఈ ఏడాది చిత్ర పరిశ్రమను చాలా ముందుకు తీసుకెళ్లారు. నేను అలానే ప్రయత్నించా. కష్టపడి పనిచేశా. కానీ అది సరిపోలేదు. అందరికీ మంచి రోజులు చెడ్డ రోజులు ఉంటాయి. అభిమానులు కుటుంబ సభ్యుల్ని ఇంకా స్నేహితులని అలరించడానికి రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడి పనిచేస్తా.. ఈ అవార్డు నా చేతిలోకి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!