సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఇటీవల లాంఛంగా ప్రారంభమైన ఈ చిత్రం జూన్ చివరన సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటించనుంది. 13 ఏళ్ల తర్వాత తాను సినిమాల్లో రావడంపై చాలా మందికి అనుమానాలు రావచ్చునని విజయశాంతి తెలిపారు. ఈ అనుమానాలకు ఆమె వివరణను తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు.
“నేను 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తుంది. నేను మరలా సినీరంగ ప్రవేశం చేయడం పై కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో నటిస్తే ఇక రాజకీయాలను పట్టించుకోరా? అనే అనుమానం కొందరికి రావచ్చు .ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ తరఫున నన్ను స్టార్ క్యాంపెయినర్గా, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా నియమించి, నాకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. నాకు అప్పగించిన పని పూర్తయ్యేవరకు నేను సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. అది రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్. నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఇదే విధంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తె వాళ్లు కూడా ఉన్నారు.2014-2018 వరకు కాంగ్రెస్ లో రాములమ్మ ఆక్టివ్గా లేరని కొందరు చేసే కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. దీనికి కూడా నా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. పార్టీ అప్పగించిన పని ఏదైనా నేను చిత్తశుద్ధితో చేశాను. ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు నేను పార్టీ చెప్పిన పనులను తూచా తప్పకుండా చేయడం వల్లే నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు అనే విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చు అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు“ అన్నారు విజయశాంతి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!