వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పీడ్ కు బ్రేకులు పడనున్నాయా.. అంటే పరిస్థితులు అక్కడికే దారి తీసేలా ఉన్నాయి. తన మేకింగ్ తో దేన్నైనా కాంట్రవర్శీ చేయగల వర్మ రీసెంట్ గా తెరకెక్కించేవన్నీ అడల్ట్ కంటెంట్ బేస్డ్ మూవీసే. తెరపై చేయలేనివి వర్మ వెబ్ సిరీస్ రూపంలో చేసేస్తున్నాడు. పైగా వెబ్ కంటెంట్లకు సెన్సార్ కూడా లేదు. దీంతో వర్మ తాను అనుకున్న కంటెంట్ ను ప్రజెంట్ చేసి తాను కొత్తగా స్థాపించిన ఏటీటీలో వదిల్తున్నాడు. ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ మూవీస్ ఆ తరహాలోనివే.
వర్మ మాత్రమే కాకుండా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్.. ల్లో విదేశీ కంటెంట్ లు యధేచ్చగా వచ్చస్తున్నాయి. దీంతో వీటన్నింటిపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. ‘ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వెబ్ సిరీస్ కంటెంట్లకు హద్దులు లేకుండా పోతోంది. కుటుంబ ప్రేక్షకులు విదేశీ కంటెంట్ తో ఇబ్బందులు పడుతున్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా అనువాదాలు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు.
మంత్రి వ్యాఖ్యలతో కేంద్రం వెబ్ కంటెంట్ లపై కూడా రూల్స్, సెన్సార్ పెట్టే ఆలోచన చేస్తుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే వెబ్ కంటెంట్లు తెరకెక్కించే వారికి బ్రేకులు పడ్డట్టే. ముఖ్యంగా మన రామ్ గోపాల్ వర్మకు ఇది సంకట స్థితే అవుతుంది. మరి.. కేంద్రం నిర్ణయమేంటో రాబోయే రోజుల్లో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!