YS Jagan Rajamouli: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త జీవో పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సీఎం జగన్ ని అందరం కలిసి.. సన్మానిస్తామని కూడా మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి తరుణంలో టాప్ డైరెక్టర్ రాజమౌళి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అదేవిధంగా మంత్రి పేర్ని నాని కి కృతజ్ఞతలు అంటూ… కొత్త జీవో లో సవరించిన టికెట్ ధర ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంతో మేలు చేసినట్లు సహాయం చేసినట్లు ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు రాజమౌళి ట్వీట్ చేశారు. అనంతరం అం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరియు ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ధన్యవాదాలు అని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇది సినీ వర్గానికి ఎంతో ఊరటనిస్తుంది అని.. రాజమౌళి స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తో.. సినిమా ఇండస్ట్రీ పెద్దలు రెండుసార్లు భేటీ అయిన సమయంలో రాజమౌళి భేటీ కావడం జరిగింది. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మంచి స్పందన వస్తుందని సినిమా ఇండస్ట్రీ పట్ల అన్ని రకాలుగా సీఎం జగన్ కి మంచి అవగాహన ఉందని… సరైన నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో మీడియా ముందు తెలియజేశారు. కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.. అద్భుతంగా ఉంది అన్నట్టు సోషల్ మీడియా వేదికగా.. రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!