రామాయణంలో హనుమంతుడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువ. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ పవనపుత్రుడు శ్రీ రాముడునే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిరానంత ఎదిగాడు. ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడను రాముడికి చేరవేశాడు. శ్రీ రాముడు.. రావణుడిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు.. యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడు ప్రాణాలు నిలిపిని మాహా ధీశాలి.
ఇక రామాయణంలో హనుమంతుడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అసలు హనుమ లేని రామాయణం పరిపూర్ణం కాదు. హనుమంతుడి కి భక్తులు చాలా ఎక్కువే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆంజనేయుడి ని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం.. ఆయన నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, నిజమైన భక్తిని కలిగి ఉండటమే.
ఇవన్నీ పక్కన పెడితే.. హనుమంతుని విగ్రహాలు ఎరుపు రంగులో ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఇందుకు కారణంగా ఏంటి..? అన్నది ఎప్పుడైనా ఆలోచించారా..? నిజానికి హనుమంతుని విగ్రహం ఎక్కువగా పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు ఆయనకు సహజంగా వచ్చినదే. అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. ఓ రోజు సీతమ్మ తల్లి తన తలపై సిందూరం పెట్టుకుంటుంటే వీరంజనేయుడు చూస్తాడు. సిందూరం ఎందుకు పెట్టుకున్నారని సీత దేవిని అడుగగా.. శ్రీ రాముడికి ఎలాంటి ఆపద కలగకుండా దీర్ఘకాలం జీవించేందుకు గాను ఇలా చేస్తున్నానని సీత దేవి బదులిచ్చింది. అప్పటి నుంచి ఆంజనేయుడు కూడా శ్రీ రాముడిపై అపారమైన భక్తితో తాను కూడా దేహమంతా సిందూరం ధరించడం మొదలుపెట్టాడు. శనీశ్వరుడికి పూజించేవారు తప్పనిసరిగా హనుమంతుడును కొలుస్తారు. అంతేకాదు హనుమాన్ చాలీసా రోజూ పఠిస్తే శని చెడు ప్రభావం సోకదు.