Bibi Nancharamma : ఊయల లో వేసి
తన తండ్రి దండయాత్ర చేసి తీసుకు వచ్చిన విగ్రహం తనచేతికి రావడమే ఆలస్యం దాన్ని తన తోడుగా అనుకుంది. ఇక అప్పటి నుండి విగ్రహానికి అభిషేకం చేయడం తో పాటు పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల లో వేసి ఊపడం… అలా తనకు తెలియకుండానే, ఒక ఉత్సవ మూర్తికి జరిగే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి చేసేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ విగ్రహం మీదే సురతాని మనసు లగ్నం అయిపోతుండేది. మరో పక్క చుస్తే రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం కళ తప్పింది .
Bibi Nancharamma : మాలిక్ కాఫిర్
దండయాత్రలో చనిపోయిన వారి కోసం కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు.ఇక చేసేది లేక వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తిన కి వెళ్లారు.
రంగనాథుని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల యొక్క విన్నపాలు విన్న మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషం గా ఒప్పుకున్నాడు. అప్పటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం తన దగ్గర ఉన్న విగ్రహం ఇవ్వటానికి అస్సలు ఇష్టపడలేదు. అప్పుడు అర్చకులు, ఆమె ఆదమరిచి నిద్ర పోతున్న సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించి తీసుకువెళ్లిపోయారు. ఉదయాన్నే లేచిన సురతాని విగ్రహం చూసుకుంటే ఎక్కడ కనబడలేదు.
సురతాని ఆ రంగనాథ స్వామి
ఆ విగ్రహం కోసం ఆమె విపరీతం గా బాధ పడసాగింది. ఎవరు ఎంత ఒదార్చినా సురతాని మనసు మాత్రం శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని తెగేసి చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెదుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి వెళ్ళింది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథ స్వామి లో ఐక్యమైందని అంటారు.దానికి నిదర్శనం గా ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు విగ్రహ రూపం మనకు దర్శనమిస్తుంది.