పద్మావతి ,అలమేలు మంగమ్మ :
మన ప్రత్యక్ష దైవం అయినా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పవలిసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే అయన భార్యలు అయినా పద్మావతి ,అలమేలు మంగమ్మ గురించి కూడా తెలుసు. అలాగే చాలామంది కి బీబీ నాంచారమ్మ పేరు తెలుసు కానీ ఆమె గురించిన వివరాలు తెలియవు. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగా నే ముస్లిం స్త్రీ ? ఆమె అసలు దైవస్వరూపం ఎలా అయ్యారు? వివరాలు తెలుసుకుందాం.
ముస్లిం మతాన్ని:
తమిళ పదం అయినా నాచియార్` అనే పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని అంటారు. అంటే భక్తురాలు అని దాని అర్థమట. ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం వస్తుంది. బీబీ నాంచారమ్మ గాథ కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి జనపదంలో నిలిచి ఉంది. పురాతన కధ తెలిపినదాని ప్రకారం బీబీ నాంచారమ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని యొక్క కుమార్తె. ఆమె పేరు సురతాని.మాలిక్ కాఫిర్ స్వతహాగా హిందువు.. అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని తీసుకున్నాడు.అప్పుడు ఖిల్జీ తన రాజ్యాన్ని విస్తరింప చేసే బాధ్యతను, మాలిక్ కాఫిర్ మీద ఉంచడం జరిగింది. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగ మెరిసిపోతుంది. పంచలోహాలతో చేయబడిన రంగనాథుని ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు మెరిసాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది అని భావించాడు.
రంగనాథుని ఉత్సవ :
అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తిన కి వెళ్ళాడు.
హస్తిన కి వెళ్లిన తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్య దివ్యం గా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కుమార్తె తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని కోరింది.