Chiranjeevi: తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు వెయ్యికి పైగా సినిమాలు చేయడం జరిగినది. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. బ్రహ్మానందం లేనిదే ఒకప్పుడు సినిమాలు ఉండేవి కావు. ఒకప్పుడు టాప్ హీరోలు ఇప్పుడు సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ విల సినిమాలలో చాలా వరకు బ్రహ్మానందం ఉండటం జరిగింది. ఒకప్పుడు బ్రహ్మానందం ఇండస్ట్రీలో పీజీ ఆర్టిస్ట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా ప్రస్తుతం చలామణి అవుతున్న కొంతమంది బ్రహ్మానందంతో సెకండాఫ్ కామెడీ ట్రాక్ నడిపించుకుని సినిమాని ఎలాగో అలాగా హిట్ చేసుకునేవాళ్లు. శ్రీను వైట్ల ఇంకా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా చాలామంది ఈ రకంగానే హిట్లు ఒకప్పుడు సాధించారు.
కాగా గత కొన్ని సంవత్సరాల నుండి గతంలో మాదిరిగా బ్రహ్మానందం సినిమాలు చేయడం లేదు. చాలావరకు కుటుంబానికి టైం ఎక్కువ కేటాయిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని బొమ్మలు చిత్రీకరిస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా “నేను” అనే పుస్తకాన్ని బ్రహ్మానందం రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆవిష్కరించడం జరిగింది. బ్రహ్మానందంతో చిరంజీవి అనేక సినిమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం రాసిన పుస్తకం పై సోషల్ మీడియాలో చిరంజీవి సంచలన పోస్ట్ పెట్టారు. “నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిoచటం ఎంతో ఆనందదాయకం.
తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను!” అంటూ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!