Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం”తో ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మూడు సాంగ్స్ కొన్ని స్టిల్స్ విడుదలయ్యాయి. దీంతో విడుదలైన సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయి. ముఖ్యంగా “కుర్చీ మడతపెట్టి” సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పాటలో మహేష్ మాస్ స్టెప్స్.. చూసి ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రీలీల అని అందరికీ తెలుసు.
సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తూ ఉంది. అయితే సినిమా నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన అప్డేట్ లలో చాలావరకు శ్రీలీల మాత్రమే హైలెట్ గా కనిపిస్తూ ఉంది. మీనాక్షి చౌదరి పాత్రకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ సినిమా యూనిట్ నుండి రావడం లేదని అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. అసలు ఈ సినిమాలో ఆమె పాత్రకు గుర్తింపు ఉందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. కేవలం గ్లామర్ పాత్రనే చేస్తుందా అనే అనుమానాలు.. వ్యక్తమవుతున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలలో ఎవరో ఒకరిని సెకండ్ హీరోయిన్ గా తీసుకొని గ్లామర్ బ్యూటీగా… చూపిస్తూ హైలెట్ చేయడం జరిగింది.
ఇక “గుంటూరు కారం”లో కూడా మీనాక్షి చౌదరి.. అలాంటి పాత్రలో కనిపిస్తుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2022లో ఈ సినిమా స్టార్ట్ చేసిన సమయంలో మొదట మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అనుకున్నారు. సెకండ్ హీరోయిన్ శ్రీలీల పేరు వినబడింది. ఆ రకంగానే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కానీ మధ్యలోనే మెయిన్ హీరోయిన్ అనుకున్న పూజ హెగ్డే ప్రాజెక్టు నుండి అర్ధాంతరంగా వెళ్లిపోవడం జరిగింది. దీంతో సెకండ్ హీరోయిన్ అనుకున్నా శ్రీలీల..మెయిన్ హీరోయిన్ గా పెట్టి త్రివిక్రమ్ సినిమా చేశారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరినీ తీసుకున్నారు. అయితే మీనాక్షి చౌదరి పాత్రకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ మరియు శ్రీలీల మధ్య వచ్చే.. రొమాన్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉంటాయని టాక్. జనవరి 6వ తారీకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు టాక్. అదే రోజు ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.