Nayantara: తెలుగు చలనచిత్ర రంగంలో ఇటీవల మైత్రి మూవీస్ బ్యానర్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతూ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా టాప్ మోస్ట్ సినిమాలు ఈ బ్యానర్ నుండే.. తెరకెక్కుతున్నాయి. ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో లేకపోయినా గాని నైజాం ప్రాంతంలో హక్కులు దక్కించుకొని సినిమా విడుదల చేసి భారీ లాభాలు అందుకుంది. ఇండియాలోనే మోస్ట్ వెయిటింగ్ సినిమా పుష్ప సెకండ్ పార్ట్ ఈ బ్యానర్ నుండి రూపొందుతుంది. అదేవిధంగా హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఈ బ్యానర్ నుండే.. నిర్మాణం జరుపుకుంటుంది.
ఈ రెండు భారీ సినిమాలు పూర్తయిన తర్వాత.. హీరోయిన్ నయనతారతో తమిళంలో ఓ భారీ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఉన్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ నైనతారాకి వినిపించినట్లు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి గాను ఇంతవరకు నయనతార… అందుకొని పారితోషకాన్ని మైత్రి గారు ఆఫర్ చేసినట్టుగా కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాత్రం “పుష్ప 2” పైనే నిర్మాతలు దృష్టి పెట్టడం జరిగిందట.
ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా కంప్లీట్ అయిందట. ఆల్రెడీ ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు.. అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సో ఆ దిశగా సినిమా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవలే అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నయనతార ఎంట్రన్స్ తో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ అదే తరహా క్యారెక్టర్ తో కూడిన లేడీ ఓరియంటెడ్ సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!