Rajamouli Mahesh Babu: ఎస్ ఎస్ రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “RRR”, “బాహుబలి 2” సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. దీంతో మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ తరహాలో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఈ సినిమాని దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారట. “RRR” 2022లో మార్చి నెలలో విడుదలయ్యింది. ఈ సినిమా దాదాపు ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు అనేక అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకి రావడం జరిగింది.
ఈ క్రమంలో ఏడాదిన్నర పాటు మహేష్ తో చేయబోయే సినిమా ప్రాజెక్ట్ పనులపై రాజమౌళి టైం కేటాయించారు. ఇటీవలే దర్శకుడు విజయేంప్రసాద్.. స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగిందంట. మార్చి నెలలో ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కంప్లీట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్. విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ స్టోరీలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు. దీంతో మహేష్ బాబు సరసన అడ్వెంచర్ తరహా నటనతో పాటు గ్లామర్ ఉట్టి పడేలా హీరోయిన్స్ వెతుకులాటలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరిని సంప్రదించారట.
ఆ ఇద్దరు మరెవరో కాదు దీపికా పదుకొనే అదేవిధంగా ప్రియాంక చోప్రా. వీరిద్దరిలో ఎక్కువగా ప్రియాంక చోప్రాకి జక్కన్న ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇప్పటికీ ఆమెకు రెండుసార్లు స్క్రిప్ట్ మొత్తం వినిపించినట్లు టాక్. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ కానున్నారని మహేష్ బాబుతో నటించనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ దుబాయ్ టూర్ లో ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. జనవరి 5వ తారీఖు ఇండియాలో అడుగుపెట్టనున్నారు. జనవరి 6వ తారీకు “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇంకా పూర్తిగా రాజమౌళి ప్రాజెక్టుపై మహేష్ ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.