Sai Pallavi: కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సెలెక్టివ్ గా పాత్రలను ఎంపిక చేసుకునే అది కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి మొదటి స్థానంలో ఉంటుంది. ఫిదా తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీ తోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఎంత పెద్ద హీరో సినిమా అయినా కూడా పాత నచ్చితేనే సైన్ చేసే స్వభావం సాయి పల్లవి సొంతం. క్యారెక్టర్ నచ్చక లేదా ఇతరితర రీజన్స్ తో మెగాస్టార్ చిరంజీవితో సహా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. అయితే ఫర్ ది ఫస్ట్ టైమ్ టాలీవుడ్ హీరో సాయి పల్లవిని రిజెక్ట్ చేశాడు. నా సినిమాలో ఆ పిల్ల వద్దంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. గత ఏడాది ఖుషి మూవీ తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన విజయ్.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో బిజీగా ఉన్నాడు.
గీతా గోవిందం తర్వాత మళ్లీ విజయ్ పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ మృణాల్ ఠాకూర్ కాదని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దిల్ రాజు మరియు డైరెక్టర్ పరశురామ్ మొదట హీరోయిన్గా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తీసుకోవాలని అనుకున్నారట.
కానీ వారి ప్రపోజల్ ను విజయ్ దేవరకొండ తిరస్కరించాడు. ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఫ్యామిలీ స్టార్ మూవీలో కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. వాటికి సాయి పల్లవి సెట్ అవ్వదని విజయ్ అభిప్రాయపడ్డారట. ఆ కారణంగానే సాయి పల్లవిని తన సినిమాలో హీరోయిన్ గా వద్దని విజయ్ సూచించాడట. దాంతో పరశురామ్ సాయి పల్లవిని పక్కన పెట్టేసి సీతారామం మూవీ తో ఫుల్ ఫేమస్ అయిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఎంపిక చేశారట.