Japan: ప్రపంచం మొత్తం కొత్త సంవత్సర వేడుకలలో నిమ్మగ్నమై ఉండగా జపాన్ లో భూకంపం సంభవించటం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది. రిక్టార్ స్కేలు పై 7కి పైగా నమోదు కావడం జరిగింది. కొత్త ఏడాది తొలి రోజున జపాన్ పశ్చిమ తీరాన వరుస ప్రకంపనాలు ఆ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీంతో చంటి పిల్లలతో సహా జపాన్ పశ్చిమ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తారు. ఇదే సమయంలో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో.. పాటు సుమారు లక్ష మందిని భూకంపా తీవ్రత కలిగిన ప్రాంతాలను ఖాళీ చేయించారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 4.0 కంటే అధిక తీవ్రత మొత్తం 21 ప్రకంపనలు సంభవించాయి.
వీటిలో ఒక దాన్ని తీవ్రత రీక్టార్ స్కేలు పై 7.6గా నమోదయింది అని జపాన్ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో ఇషికావాలోని వాజిమా నౌకాశ్రయంలో ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. చాలా చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం కారణంగా 62,000 మందికి పైగా నిరాశ్రులయ్యారు. 50 వేలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. అయితే ఈ పరిణామాలపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. గతవారం కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడే నూతన సంవత్సర వేడుకలు వారం రోజులపాటు చేసుకున్నారు.
జపాన్ టూర్ ముగించుకుని సోమవారం రాత్రి.. హైదరాబాద్ చేరుకున్నారు. ఇంతలోనే అక్కడ వరుస భూకంపాలు సంభవించాయని తెలుసుకున్న ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జపాన్ నుండి ఇవ్వాలే ఇంటికి తిరిగి రావటం జరిగింది. గత వారం అంతా అక్కడే గడిపాను. జపాన్ లో భూకంపం వార్త విని షాక్ అయ్యాను. ఆ ప్రాంతంలో భూకంపం రావటం నా హృదయాన్ని కలిచివేసింది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని.. ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంటులో.. పోస్ట్ పెట్టడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!