Avatar 3: ప్రపంచ సినిమా రంగంలో టాప్ మోస్ట్ దర్శకుడు జేమ్స్ కామరూన్. ఆయన తీసిన టైటానిక్, అవతార్, అవతార్ 2.. సినిమాలు ఆయనకు ఎంతగానో మంచి పేరు తీసుకొచ్చాయి. తన సినిమాలలో ఓ అద్భుతమైన ప్రపంచాలను విజువల్ రూపంలో చూపిస్తూ… సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. టెర్మినేటర్, ఏలియన్స్, ఏలియన్స్ ఆఫ్ ది డీప్, టెర్మినేటర్, అవతార్ రెండు భాగాలతో ప్రపంచ సినిమా రంగాన్ని తనవైపు ఆకర్షించుకున్నారు. ప్రస్తుతం అవతార్ సినిమాలతో… ఫుల్ బిజీగా ఉన్నారు. మొదటి భాగం 2009వ సంవత్సరంలో విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. 22వ శతాబ్దం మధ్యకాలంలో జరిగిన స్టోరీగా.. చిత్రీకరించారు. మానవులు మరియు పండోరా గ్రహంలో ఉండే వేరే జాతి ప్రజలతో.. వైరాన్ని ప్రధానం చేసుకొని అద్భుతంగా అవతార్ మొదటి భాగం తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.
ఆ తర్వాత అవతార్ సెకండ్ పార్ట్ గత ఏడాది విడుదల చేయడం జరిగింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్… అనే టైటిల్ తో విడుదలైన ఈ చిత్రం… వ్యాప్తంగా 160 భాషలలో విడుదలై.. రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. సముద్రం అంతర్భాగంలో మరో కొత్త ప్రపంచాన్ని విజువల్ ట్రీట్ గా.. చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 16,500 కోట్లకు దగ్గరలో… వసూలు చేసింది. “అవతార్ 2” థియేటర్ లో మరో లోకంలోకి తీసుకెళ్ళింది. ఒక్క ఇండియాలోనే ఆరు భాషలలో విడుదల చేయడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదలయ్యింది. ఇండియాలో అవతార్ సెకండ్ పార్ట్.. 473 కోట్లకు పైగా గ్రాస్, 391 కోట్ల షేర్ రాబట్టడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా జేమ్స్ కామెరూన్ అవతార్ మూడో భాగం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “అవతార్ 3” 2025 డిసెంబర్ 19వ తారీకు విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు 2029లో “అవతార్ 4”, 2031లో “అవతార్ 5” విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. త్వరలోనే అవతారం మూడో భాగానికి సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. “అవతార్ 3″లో కూడా మరో కొత్త ప్రపంచం, విభిన్న కథనం లైవ్ యాక్షన్స్ సన్నివేశాలు చూపించబోతున్నట్లు జేమ్స్ కామెరూన్ స్పష్టం చేయడం జరిగింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!