టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, టిఆర్ఎస్ బాస్ కెసిఆర్ కు ఉన్న ఒక తేడా ఇప్పుడు స్పష్టమైంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ లో ఓటమి చవి చూశారు.
అంతముందు ఎన్నికల్లో ఆమె నిజామాబాద్లోనే ఎంపిగా మంచి మెజార్టీతో గెలుపొందారు.అయితే రకరకాల సమీకరణాలు, పసుపు రైతుల ఆందోళనలు తదితర కారణాలతో మొన్నటి ఎన్నికల్లో కవిత ఓడిపోయారు.ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కేసీఆర్ అనుకుంటే కవితను నామినేటెడ్ కోటాలోనే ఎమ్మెల్సీ చేసేవారు.కానీ ఆయన ఇందుకు భిన్నంగా నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను అభ్యర్థిగా నిలబెట్టారు.ఎన్ని ఓట్లు అన్నది ముఖ్యం కాదు… అసలు ఓట్లు ఉన్న ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధానమని కెసిఆర్ చెప్పకనే చెబుతున్నారు .
అంతేకాదు కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కూడా వరుసబెట్టి ఎన్నికల్లో గెలిచి వచ్చి మంత్రి పదవి అందుకుంటున్నాడు మరి మన చంద్రబాబు నాయుడు ఏం చేశారు? తన ఏకైక కుమారుడు లోకేష్ బాబును మంత్రిగా చేయటం కోసం దొడ్డిదారిన ఎమ్మెల్యేల ఓట్లతో ఎమ్మెల్సీని చేశారు. ప్రజా క్షేత్రంలో నుంచి లోకేష్ బాబును శాసనసభ్యుడిగా చేయటం పక్కనబెట్టి చంద్రబాబు అడ్డదారిన కుమారుడిని ఎమ్మెల్సీ చేయుట ఇక గమనార్హం.సరే… ఎట్టికేలకు మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుండి లోకేష్ బాబును అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు అయిష్టంగా అభ్యర్థిగా నిలబడితే ఆయన దారుణంగా ఓడిపోవటం వేరే విషయం.
తన కుమారుడి విషయంలో ఎమ్మెల్సీతో ఆయనను మంత్రిని చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలైన నందమూరి సుహాసినిని మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూకట్పల్లి నుండి నిలబెట్టి బలిపశువును చేశారు.నందమూరి హరికృష్ణ కుమార్తెయైన నందమూరి సుహాసిని చంద్రబాబు ఆటలో సమిధగా మిగిలిపోయారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న నిజామాబాద్ శాసనమండలి ఎన్నికల్లో కవిత గెలుపు ఏకపక్షమే.అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కుమార్తెను కూడా ఎన్నికల బరిలో నిలిపి గెలిచి రమ్మంటున్న కెసిఆర్ ని అభినందించక తప్పదు.ఏదేమైనప్పటికీ కెసిఆర్ సాహసి అని చెప్పవచ్చు.మరి చంద్రబాబును ఏమనాలో మీరే చెప్పండి!