Naa Saami Ranga: అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “నా సామిరంగ” జనవరి 14వ తారీకు విడుదల కాబోతోంది. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ రివేంజ్ నేపథ్యంలో చిత్రీకరించారు. సినిమా మొత్తం 72 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో 60 రోజులు మాత్రమే నాగార్జున షూటింగ్ లో పాల్గొన్నారు. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా కీలక పాత్రలు పోషించడం జరిగింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.
ఇంకా విడుదలకు ఒక రోజు ఉందనగా తాజాగా ఈ సినిమా నుండి సీసా మూత ఇప్పు అంటూ సాగే లిరికల్ సాంగ్ను మేకర్స్ నేడు విడుదల చేశారు. పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే ప్రేమ బండి చలో అంటే.. రైస్ మిల్లు నెల జీతం రయి రయి మని పెరిగిందంటే ఫేవరేట్ హీరో బొమ్మ హౌస్ ఫుల్ పడిందంటే.. ఇండియా కప్పు కొట్టుకొస్తే ఇల్లాలే రాజీకొస్తే.. పక్కింటోడికి లాస్ వస్తే.. వాడిని ఓదార్చే ఛాన్స్ వస్తే.. ఎం సెయ్యాలి సెప్పు.. సీసా మూత ఇప్పు.. ఎం సెయ్యాలి సెప్పు.. సీసా మూత ఇప్పు అంటూ ఫుల్ సాంగ్ ఉంది. మొత్తం 3 నిమిషాల 16 సెకండ్స్ నిడివి కలిగిన..ఈ సాంగ్ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ..నాగార్జునతో స్టెప్ లు వేయడం జరిగింది. మంచి మసాలా ఐటెం సాంగ్ ల ఉంది.
ఈ పాటను ఆస్కార్ అవార్డు విన్నారు చంద్రబోస్ రాయగా.. మల్లికార్జున్, రేవంత్, సాయి చరణ్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండియా కలసి ఆలపించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తారీకు “నా సామిరంగ” విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధించాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ హిట్ అందుకుని చాలా కాలం అయిపోయింది. నాగార్జున కూడా హిట్టు చూసి చాలా సంవత్సరాలు అయ్యాయి. దీంతో సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!