పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, హేమ మాలిని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే గత కొంత కాలంగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్ర టీమ్పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు మేకర్స్ ఈ సినిమా టీజర్ను విడుదల చేయడానికి ముహూర్తం పెట్టారు.
అక్టోబర్ 2న అయోధ్య సరయు నది ఒడ్డున ఆదిపురుష్ టీజర్ను భారీ ఎత్తున లాంఛ్ చేయబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై నయా అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. టీజర్ విడుదల కంట ముందే మేకర్స్ ప్రభాస్ ఫాన్స్ కు ఓ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు.
అవును, సెప్టెంబర్ 30న అంటే రేపు ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు టీజర్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఓ రకంగా ఇది ఫస్ట్ లుక్ మాదిరి ఉండబోతోందట. మొత్తానికి రేపు రాబోయే టీజర్ పోస్టర్తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!