Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మూడో వారం ఆట సాగుతోంది. హౌస్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మూడోవారానికి సంబంధించి ఎలిమినేషన్ లో ఏడుగురు ఉన్నారు. మొదట ఇద్దరు ఎలిమినేట్ అయిన వాళ్ళు లేడీ కాంటస్టెంట్ లే.
మూడో వారం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే బుధవారం ఎపిసోడ్ లో హౌస్ లో నాలుగు వారాల పవరస్త్రం సంపాదించిన శివాజీది.. అమర్దీప్ దయచేసి బాత్రూం పైన పెట్టేయడం జరిగింది.
ఈ విషయాన్ని బిగ్ బాస్ కెమెరాలకు కూడా తెలియజేయడం జరిగింది. తన పవరస్త్రం కనిపించకపోవడంతో శివాజీ ఇంటి సభ్యులపై మండిపడ్డాడు. గెలుచుకునేంతవరకు దానికి విలువ ఉంటుంది. తర్వాత పెద్దగా పట్టించుకో అక్కర్లేదని బిగ్ బాస్ చెప్పినట్లు అందువల్లే తన పవరస్త్రం గురించి పెద్దగా పట్టించుకోలేదని అయినా సరే దయచేసి ఇచ్చేయండి. అది మీ దగ్గర ఉన్న ఎలాంటి ఉపయోగం ఉండదు. అయినా సరే ఏ నా చిల్లర నాకొడుకు.. అది తీశాడు వెంటనే ఇచ్చేయండి.
తరవాత దొరికితే మామూలుగా ఉండదు. ఆఖరికి ఒంటిమీద బట్టలు వేసుకోవడానికి కూడా ఏమీ లేకుండా చేసేస్తా… అంటూ ఆగ్రహంతో శివాజీ ఊగిపోయారు. ఈ పని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చారే నా చేతులో.. తీసిన వాడిని నేను ఏమీ అనను కానీ వెనక ఉన్న మాస్టర్ మైండ్ కు మాత్రం తోలు తీసేస్తా…అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
ఈ క్రమంలో తొక్క తీస్తా తోలు తీస్తా అంటే శివాజీ చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక కాస్త గట్టిగా రియాక్ట్ అయింది. ఎవరు ఎక్కడ చిల్లర వేషాలు వేయటం లేదు.. అనేసరికి నేను నిన్ను అనలేదమ… తీసిన వాళ్ళని అంటున్నారు అంటూ ప్రియాంక కి చెప్పడం జరిగింది. అయినా సరే అటువంటి మాటలు నచ్చలేదు అని ప్రియాంక తేల్చి చెప్పింది. దీంతో శివాజీ తన మాట తీరు అంతేనని.. ఓవరాక్షన్ మాత్రం పర్లేదు అంటూ తనదైన శైలిలో ప్రియాంకకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?