బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావటం సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ లీగల్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముంచికొస్తున్నాయి. ఇంకా ఏడాది కూడా టైం లేకపోవడంతో… చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ వైసీపీ పార్టీపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో సినీ నటుడు నాగార్జున ఏపీ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ తో నాగార్జునకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
జగన్ జైలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాలలో నాగార్జున వ్యక్తిగతంగా కలవడం కూడా జరిగింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో 175 నియోజకవర్గాలకు 175 గెలవాలని టార్గెట్ పెట్టుకున్న జగన్ ప్రత్యేకంగా విజయవాడ పార్లమెంటు స్థానంపై ఫోకస్ పెట్టడం జరిగిందట. 2014, 2019 ఎన్నికలలో విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని నాని గెలిచారు.
అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఎంపీ స్థానం కైవసం చేసుకోవాలని నాగార్జునని బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారట. వైసీపీ పార్టీకి సినీ గ్లామర్ అవసరమని.. భావించి ఒకవేళ లోకసభ ఒప్పుకోకపోతే… రాజ్యసభ సీటు నాగార్జునకి కేటాయించాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల సమయంలో సినీ గ్లామర్ పార్టీకి అవసరం అని జగన్ డిసైడ్ అయ్యారట. దీంతో ఇండస్ట్రీలో నాగార్జునతో తనకి మంచి బాండింగ్ ఉండటంతో.. పాటు వైఎస్ హయాంలో నాగార్జున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. దీంతో నాగార్జుననీ వచ్చే ఎన్నికలలో పోటీకి దింపాలని జగన్ డిసైడ్ కావటం జరిగింది అంట.