Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చంచల్ గూడా జైలు నుండి శనివారం విడుదల కావడం తెలిసిందే. డిసెంబర్ 17 ఆదివారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట దాడుల కేసుల్లో ప్రశాంత్ ప్రధాన నిందితుడు గా పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు నాలుగు రోజులపాటు జైల్లో ఉండటం జరిగింది. పోలీసులు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ర్యాలీ చేయడం ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు మరియు పోలీసు వాహనాలు ధ్వంసం కావడంతో.. కేసు నమోదు అయింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ ని అతని ఇంటి వద్ద అరెస్టు చేశారు.
దీంతో న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తరుపున లాయర్లు.. హైదరాబాదు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో పల్లవి ప్రశాంత్ కి 48 గంటల్లో బెయిల్ వచ్చేలా కోర్టులో.. పేరుగాంచిన లాయర్లు వాదించారు. ఈ విషయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ బోలె చొరవ తీసుకోవడం జరిగింది. దాదాపు 15 వేల రూపాయల పూచీకత్తుతో ఈ బెయిల్ను ఇచ్చింది. రెండు షూరిటీలతో ఈ బెయిల్ లభించింది. శనివారం రిలీజ్ అయిన వెంటనే నేరుగా హైదరాబాదు నుండి ఇంటికి వెళ్లిపోయిన ప్రశాంత్ తర్వాత సోషల్ మీడియాలో “రైతు బిడ్డ” అనే ట్యాగ్ లైన్ తీసేయడం జరిగింది.
“రైతు బిడ్డ” అనే డైలాగ్ ద్వారానే ప్రశాంత్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో అరెస్టు తర్వాత జైలు నుండి విడుదల కావడం ఇంస్టాగ్రామ్ తన పేరు మార్చడం సంచలనంగా మారింది. ఇక ఆదివారం నాడు శివాజీతో పాటు యావర్ లతో ప్రశాంత్ సోషల్ మీడియాలో లైవ్ లో పాల్గొన్నారు. అనంతరం బోలే ఇంటిలో..పార్టీ చేసుకోవడం జరిగింది. ఈ పార్టీలో శివాజీ, యావర్, టేస్టీ తేజాలతో పాటు ప్రశాంత్ కి బెయిల్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన లాయర్లు కూడా పాల్గొని అందరు కలిసి ఆనందంగా భోజనం చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!