Brahmamudi December 13 2023 Episode 278: కావ్య నువ్వు చేసింది ఏంటి కావాలని ఇదంతా చేస్తున్నావు నీకు కాస్త కూడా జాగ్రత్తలే తెలియదు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. రాజ్ కావాలని ఏం చేయలేదు, అని మాట్లాడుతూ ఉండగా నీకేం తెలీదు నువ్వు ఊరుకో అని కావ్య ని తిడుతూ ఉంటుంది అక్కడే ఉన్న, అనామిక పేరెంట్స్ కూడా కావ్యని తిడుతూ ఉంటారు. అనామిక తల్లి ఇదంతా చూస్తుంటే నాకు మీ వదిన కావాలని పెళ్లి ఆవాలనుకుంటుంది మీ వదినకి పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారంటే అని అంటాడు అవును బాబు ఒక కూతురు, పెళ్లి జరగకుండా ఉంటే ఆ తల్లి ఎంత బాధ పడుతుందో నీకు తెలియదు, ఇందాక కుంకం భరణి కింద పడిపోయింది. ఇప్పుడు ఇలా శుభలేఖ తగలబడింది. ఇదంతా నా కూతురు జాతకం వల్లే జరిగిందని మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. ఇదంతా చేసింది మీ వదిన అని అంటూ ఉంటుంది.
ఆ మాటలకి కోపం వచ్చి కళ్యాణ్ ఏంటి అనామిక ఇప్పటివరకు మన ఇద్దరి పెళ్లి చేయాలని మా వదిన ఎంత తాపత్రయపడిందో నీకు తెలీదా అంటూ అనామికని అరుస్తాడు. ఇక రాజ్ ఏది ఏం జరిగినా కూడా ఈ పెళ్లి తప్పక జరిగి తీరుతుంది కావ్య ఎప్పటికీ ఇలాంటి పనిచేయదు తను తన మరిది పెళ్లి విషయంలో ఏ చిన్న పని చేసిన ఒకటికి వందసార్లు ఆలోచిస్తుంది. అలాంటిది కావ్య ఇప్పుడు ఇలా చేసిందంటే ఇక్కడ నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. పైగా ఒకవేళ ఇది జరిగినా కూడా ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద విషయాన్ని ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కళ్యాణ్ అనామికుల పెళ్లి జరిగి తీరుతుంది. ఒక ఆడపిల్లకు అన్యా యం ఈ కుటుంబం ఎప్పటికీ చెయ్యదు అని రాజ్ అనామిక పేరెంట్స్ కి భరోసా ఇస్తాడు ఆ తరువాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అపర్ణ రాజ్ ని పొగుడుతుంది. నువ్వు చాలా మంచి పని చేశావు నాన్న అని అంటుంది అంతలో రాజ్ కి శ్వేత దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అమ్మ నేను ఇప్పుడే వస్తాను చాలా ఇంపార్టెంట్ కాల్ అని చెప్పి శ్వేతకి చెప్పిన లొకేషన్ కి వస్తున్నాను అని చెబుతాడు.
కనకం, కావ్యతో గొప్పింటి పిల్లలందరికీ వేరే అమ్మాయితో సంబంధం ఉంటుంది కానీ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు మంచి భర్త దొరికాడు అని అంటుంది. అవును అమ్మ, మా ఆయన శ్రీరామచంద్రుడు అని అంటూ ఉంటుంది కావ్య, కానీ రాజ్ కావ్యకు తెలియకుండా శ్వేతను కలుస్తాడు. శ్వేతని చూసి చాలా సంతోషపడతాడు. ఇద్దరూ ఒకరికొకరు హగ్ చేసుకుని మాట్లాడుకుంటూ, సరదాగా ఉంటారు. చూస్తుంటే రాజ్ శ్వేత ఇద్దరూ చాలా క్లోజ్ గా కనిపిస్తారు. కానీ ఇవేమీ తెలియని కావ్య మాత్రం తన భర్త చాలా మంచివాడు అని అనుకుంటుంది.కళ్యాణ్ ముభావంగా ఉన్నాడని.. అపర్ణ తన దగ్గరకి వెళ్లి రేపు కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండి కోనేటిలో దీపాలు వదిలితే మీ ఇద్దరి పెళ్లి చాలా చక్కగా జరుగుతుంది అని అంటుంది. అంతేకాకుండా నీతో పాటు రేపు కార్తీక పౌర్ణమికి ఇంట్లో అందరం ఉపవాసం ఉంటాము అని చెబుతుంది. ఆ మాటకు కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు తప్పకుండా ఉపవాసం ఉంటాను అని అంటాడు.
కళ్యాణ్ వెంటనే అనామికకు ఫోన్ చేసి రేపు కార్తీక పౌర్ణమి నేను మన ఇద్దరి పెళ్లి జరగాలని ఉపవాసం ఉండి గుడి లో కోనేట్లో దీపాలు వదులుతాను అని చెబుతాడు. అంతేకాకుండా ఇప్పుడు పెళ్లి కార్డు విషయంలో ఇలా జరిగిందని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి రేపు గుడికి వస్తున్నారు అని కళ్యాణ్ అనామికతో చెబుతాడు. కానీ నాకు నిన్ను కలవాలని ఉంది అని అనామిక అంటుంది. రేపు అస్సలు కుదరదు ఉపవాసం ఉంటున్నాను కదా పైగా సాయంత్రం గుడికి రావాలి ఆ తర్వాత రోజు కలుద్దాం అని అంటాడు. కళ్యాణ్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు అని చెప్పాక నా మనసు కాస్త కుదుటపడింది అని అనామిక అంటుంది. ఆ తరువాత అనామిక వాళ్ళ నాన్న కళ్యాణ్ వాళ్ళింట్లో వాళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు అని చెబుతుంది. కళ్యాణ్ నువ్వు రేపు కలుద్దాం అన్నా కూడా తను రావడానికి ఇష్టపడలేదు వాళ్ళ ఇంట్లో వాళ్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. నువ్వు కూడా కళ్యాణ్ నీ వైపుకి తిప్పుకోవాలి. నీకు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చేసుకోవాలి. నువ్వు కూడా రేపు ఉపవాసం ఉండి వాళ్లతో పాటే అదే గుడికి వెళ్లి కోనేటిలో దీపాలు వదులు అని అనామిక వాళ్ళ నాన్న చెబుతాడు. కానీ నాన్న నేను అంత సేపు ఉపవాసం ఉండలేను అని అనామిక అంటుంది . ఉపవాసం ఉండనవసరం లేదు ఉన్నాను అని వాళ్లతో చెప్పు ఆ దీపాలు వదులు అని తను చెబుతాడు సరే అని అనామిక అంటుంది. అనామిక చేసేది దొంగ ఉపవాసం అని కనకం తెలుసుకుంటుందా తెలిస్తే ఇక ఈ విషయాన్ని ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.
కనకం అప్పు కి ఫోన్ చేసి ఎలాగైనా రేపు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి గుడిలో దీపం వెలిగించమని చెప్పాలని అనుకుంటుంది. ఇక అప్పు కి ఫోన్ చేస్తుంది కనకం. ఎలా ఉన్నావ్ తిన్నావా అని అడుగుతుంది. హా తిన్నాను ఇంకా ఫోన్ పెట్టేస్తావా అని అంటుంది అప్పు. రేపు కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని కనకం అంటుంది. నాకు ఉన్న ఒక్క కోరిక నెరవేరదు అని నాకు తెలుసు నాకు ఇప్పుడేం కోరికలు లేవు. నేను ఉపవాసం ఉండను అని అప్పు కరాకండిగా కనకంతో చెబుతుంది.ఒక అమ్మగా నీ జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను కదా అని కనకం అంటుంది. అయినా నువ్వు ఎప్పుడు మా మాట విన్నావు, ఇప్పుడు ఎలాగూ నువ్వు అనుకున్నది జరగడం లేదు జీవితంలోనైనా ఒక మంచి వ్యక్తిని జీవితంలోకి రావాలి కదా, సంతోషంగా ఉండాలి అని అనుకున్నాను ఆ కోరిక కూడా నువ్వు తీర్చమని నాకు అర్థమైంది అంటూ కనకం కన్నీరు పెట్టుకుంటుంది. అయినా నేను తల్లిగా నీకు ఏం చేశాను.
నువ్వు కోరుకున్నది ఏవి నీకు చేయలేకపోయాను. అలాంటప్పుడు నువ్వు నా మాట ఎందుకు వినాలి అని బాధపడుతుంది. అప్పు అప్పుడు కోపంగా ఏంటి నీ మాట వినలేదని ఇప్పుడు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటుంది. నేను బ్లాక్ మెయిల్ చేసిన గాని నువ్వు వినాలని రూల్ లేదు కదా అని కనకం అంటుంది. అయితే ఇప్పుడు ఏంటి రేపు ఉపవాసం ఉండాలి అంతేనా అని అంటుంది. ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వచ్చే కోనేట్లో దీపం వదలాలి అని కనకం అంటుంది. ఇక చేసేది ఏమీ లేక అప్పు ఒప్పుకుంటుంది కానీ, ఒక కండిషన్ నువ్వు చీర కట్టుకో, పట్టు పావడా కట్టుకో అంటే నేను కట్టుకోను నేను నాకు లాగానే వస్తాను. సరే నువ్వు ఒప్పుకున్నావు కదా నాకు అది చాలు అని కనకం అంటుంది. ఇక నన్ను వదిలేస్తావా నేను పడుకుంటాను అని అప్పు విసురుగ్గా ఫోన్ పెట్టేస్తుంది.ఇక రేపటి ఎపిసోడ్ లో రాజ్ ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి వెళ్తారు. సరే అందరం దర్శనానికి వెళ్దాం పదండి అని అపర్ణ అనగానే మమ్మీ మీరు గుడిలోకి వెళ్ళండి కావ్య ఇప్పుడప్పుడే గుడిలోకి రాదు తను కళ్యాణ్ పెళ్లి జరగాలని ఆ మొక్క పచ్చగా ఉంటే ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కుకుంది నాన్నమ్మ అని రాజ్ అంటాడు. ఆ మాట విని కావ్య రాజు వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇక రాజ్ కావ్యను గుడిలోకి తీసుకువెళ్తాడు తనని ఎత్తుకొని గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. అలా ఒకరి కళ్లలోకి ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకుంటారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!