Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఏ కుర్ర హీరో చేయని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి విడుదల చేస్తున్నారు. కరోనా తర్వాత నాలుగు సినిమాలు విడుదల చేయగా.. అందులో రెండు విజయాలు సాధించగా… మరో రెండు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇటీవలే కొద్ది నెలల క్రితం మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళ శంకర్” అనే సినిమా చేసి.. దారుణమైన అట్టర్ ఫ్లాప్.. అందుకున్నారు. ఈ సినిమా పరాజయం తర్వాత షూటింగులకు చిరంజీవి లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. మధ్యలో కాలుకి కూడా సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత వరుణ్ తేజ్ పెళ్లికి ఇటలీలో సందడి చేయడం జరిగింది. అనంతరం నవంబర్ నెలలో వశిష్ట దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ రాజమహేంద్రవరం మారేడిమిల్లి అడవులలో.. జరిగింది. అయితే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని అనుకుంటున్నా సమయంలో.. చిరంజీవి మళ్ళీ గ్యాస్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తెలియజేశారు. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో పడిపోవడం తెలిసిందే. దీంతో తుంటి ఎముక విరగడంతో… యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయడం జరిగింది. హిప్ రీప్లేస్ మెంట్ లో జరగటంతో దాదాపు 6 నుండి 8 నెలలపాటు కేసీఆర్ కి వైద్యులు బెడ్ రెస్ట్ విధించారు.
ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు కేసీఆర్ నీ పరామర్శిస్తున్నారు. ఇదే రీతిలో సోమవారం మెగాస్టార్ చిరంజీవి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ సినిమా షూటింగ్స్.. ఇండస్ట్రీ గురించి ప్రస్తావించగా.. అంతా బాగానే ఉంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. జనవరి 15 వరకు సినిమా షూటింగ్లకు గ్యాప్ ఇవ్వటం జరిగింది.. అని చిరంజీవి బదులిచ్చారు. దీంతో సంక్రాంతి అయ్యేవరకు చిరంజీవి.. షూటింగ్లకు వెళ్లరని తెలుస్తోంది.