Guntur Kaaram Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” ట్రైలర్ ఆదివారం విడుదల కావడం జరిగింది. విడుదలైన ట్రైలర్ లో మహేష్ డైలాగ్ డెలివరీ.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ ఏపీరియన్స్ లో మహేష్ లుక్.. చూస్తుంటే ఒకప్పుడు “ఒక్కడు”, “పోకిరి” సినిమాలు గుర్తొస్తున్నాయి. ఈ క్రమంలో “గుంటూరు కారం” ట్రైలర్ పై టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. “ఇది మ…మ…మ మహేశుని ఆట. జనవరి 12వ తారీకు మరో సూపర్ స్టార్ సంక్రాంతి కానుంది. రమణ గాడి షోతో ట్రైలర్ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్, థమన్, శ్రీలీల, మీనాక్షి చౌదరి మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
2020వ సంవత్సరంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవరు” సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కించటం జరిగింది. 2018వ సంవత్సరం “భరత్ అనే నేను” సినిమా నుండి 2022లో వచ్చిన “సర్కారు వారి పాట” వరకు మహేష్ బాబు వరుస పెట్టి హిట్లు అందుకుంటున్నారు. దీంతో ఇప్పుడు “గుంటూరు కారం” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా విడుదల కావాలి. కానీ సినిమా షూటింగ్ లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. హీరోయిన్ పూజ హెగ్డే ప్రాజెక్టు నుండి తప్పుకోవటం ఇంకా రకరకాల కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మహేష్ తల్లిదండ్రులు మరణించారు. ఈ పరిణామాలతో చాలాకాలం షూటింగ్ ఆగిపోయింది.
ఆ తర్వాత గత ఏడాది వరుస పెట్టి షెడ్యూల్ లతో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో సినిమాగా “గుంటూరు కారం” విడుదల కాబోతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఆసక్తి నెలకొంది. మరో నాలుగు రోజులలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నుండి విడుదలైన మూడు పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అదే రకంగా “గుంటూరు కారం” ట్రైలర్ ఉండటంతో.. సినిమా విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.