Ennenno Janmala Bandham ఆగస్టు 18 ఎపిసోడ్ 480: మా ఖుషి తల్లి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని వేద అంటుంది.కట్ చేస్తే అమ్మ బాబోయ్ నీ ప్లాను బలే ఉంది బ్రో అని కైలాష్ అంటాడు. నీకు ఒక రోజు చెప్పాను గుర్తుందా టైం రాక ఉన్నాను గానీ చేతులు ముడుచుకొని కాదు కొడితే దిమ్మ తిరిగి పోవాలని అనుకున్నాను అని అభి అంటాడు. నీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది బ్రో అని కైలాష్ అంటాడు. అలాగే వేద యశ్ నా టార్గెట్ రీచ్ అయ్యే రోజు వచ్చింది మాళవిక ను ఇంట్లో నుంచి గెంటేశారన్న విషయం నాకు తెలిసింది ఇది కదా మంచి ఛాన్స్ అని అనుకున్నాను దానినే నేను అవకాశంగా తీసుకున్నాను యశ్ వెళ్లగానే మాళవికకి స్కెచ్ ఏంటో చెప్పాను మాళవిక లాంటి దాని లొంగ తీసుకోవడం నా లాంటి వాడికి పెద్ద కష్టమేమీ కాదు మాళవికను దాచిపెట్టి మర్డర్ కేసులో ఆ యష్ ని ఇరికించాను అని అభి అంటాడు.
నీ ఆలోచన చాలా బాగుంది బ్రో నీ దగ్గర శిష్యరికం చేయడం చాలా మంచిది బ్రో అని కైలాష్ అంటాడు. వాళ్ళ మాటలు చాటుగా విన్న నీలాంబరి వేద కి ఫోన్ చేస్తుంది వేద నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఇంతకు మీరు ఎవరు అని వేద అడిగింది నేను ఎవరనేది ముఖ్యం కాదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరందరూ మాళవిక చనిపోయిందని అనుకుంటున్నారు కానీ ఆ మాళవిక చనిపోలేదు మాళవిక బ్రతికే ఉంది మాళవిక చనిపోయినట్టు ఆ కేసు యశ్ మీద కి వచ్చేలా చేసింది అభి మీరేంటో నాకు తెలుసు మీ మంచితనం గురించి తెలుసు నేను ఎవరన్నది సందర్భం వచ్చినప్పుడు చెబుతాను ఆ మాళవిక బ్రతికే ఉంది తను ఎక్కడ ఉందో పూర్తి వివరాలు మీకు త్వరలోనే చెబుతాను అని నీలాంబరి అంటుంది.
కట్ చేస్తే యష్ నీ పోలీసులు కోర్టుకు తీసుకువస్తారు. వాళ్ళ అమ్మ అత్తయ్య వాళ్ళ మామగారు కూడా కోర్టుకు వస్తారు. వీళ్ళందరూ వచ్చారు కానీ వేద ఎక్కడ ఏదైనా చేయాలి అంటే వేద వల్లనే అవుతుంది అని యష్ అనుకుంటాడు. జడ్జిగారు వచ్చి ముద్దాయిని ప్రవేశపెట్టండి అని అంటుంది. ఈ కేసులో కీలకమైన వ్యక్తి స్టేషన్ ఇన్చార్జి అయిన ఇన్స్పెక్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి కోర్టు వారు అనుమతించాలి అని యాష్ అంటాడు. సరే అనుమతిస్తున్నాను అని జడ్జి గారు అంటుంది.సార్ ఎస్సై గారు బ్రహ్మ రాసిన తలరాతను ఎవరు మార్చలేరు అని అంటారు మీరు రాసిన ఎఫ్ఐఆర్ నీ ఎవరు మార్చలేరు ఒక్కసారి ఎఫ్ఐఆర్ మీద సంతకం చేశారంటే ఇక దానికి తిరుగులేదు ఇది నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్పింది కరెక్టేనా సార్ అని యశ్ అంటాడు.
కరెక్టే అని ఎస్సై అంటాడు. థాంక్యూ సార్ ఎఫ్ఐఆర్ రాసేముందు ఎవరైనా మీకు కంప్లీట్ ఇచ్చి ఉండాలి కానీ మాళవిక చనిపోయింది అని విషయం మీకు ఎవరు చెప్పారు. అభిమన్యు ఫోన్ చేసి చెప్పాడు అని ఎస్సై అంటాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఫోన్ చేసి చెప్పగానే మీరు అలర్ట్ అవడం తప్పుకాదు కానీ మాళవిక చనిపోయిందని అభిమన్యు చూశాడా మరి అతను అక్కడే ఉన్నాడా ఆ హత్యను చూశాడా అని యశ్ SI గారిని అడుగుతాడు .
హత్య జరిగిన చోట అభిమన్యు లేడు కానీ మాళవిక అనే వ్యక్తి నన్ను యశ్ చంపుతున్నాడు నన్ను రక్షించు అని మెసేజ్ పెట్టింది అని SI అంటాడు. మాళవిక ఎందుకు అభి కి మెసేజ్ పెట్టింది అని యష్ అంటాడు. వాళ్లు ఎప్పటి నుండో సహజీవనం గడుపుతున్నారు అని SI అంటాడు. మాళవిక అభిమన్యు ఎప్పుడో విడిపోయారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అభిమన్యు మాళవిక ని వెళ్ళగొట్టాడు SI గారు మీ సహకారానికి నా కృతజ్ఞతలు చనిపోయిన మృతదేహాన్ని వాళ్ళ అమ్మానాన్నలకి అప్పగించాలి నగలు ఏమైనా దొరికాయా అని యాష్ అంటాడు.
మాళవిక ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు హంతకుడు నగలు ఏమి దొరకలేదు ఆమె ఒంటి మీద నగలు ఉంటే మెల్ట్ అయిపోయి ఉంటాయి ఆ విశేషాలను ల్యాబ్ కి పంపించాం ఈ విషయాన్ని అభిమన్యు కి తెలియజేశాం మాళవిక అభిమన్యుల మధ్య అగ్రిమెంట్ ఉంది మాకు చూపించాడు అగ్రిమెంట్ కాపీ మా దగ్గర ఉంది అని SI అంటాడు. హంతకుడు మృతదేహాన్ని తగలబెట్టినట్టు ఏమైనా సాక్ష్యం ఉందా అని జడ్జి అడుగుతుంది. ఉంది యువరానర్ అని లాయర్ గారు అంటారు .
కట్ చేస్తే ఖుషి గణపతికి పూజ చేస్తూ మా నాన్న కావాలి అమ్మతోపాటు నాన్నను తీసుకురా దేవుడా మా అమ్మానాన్న నాకు ఇచ్చిన డబ్బులు నీకు కానుకగా ఇస్తున్నాను అని ఖుషి వినాయకుని ప్రార్థిస్తుంది. కట్ చేస్తే వదిన గారు వేద మనకంటే ముందే బయలుదేరిందిగా ఇంకా కోర్టుకు రాలేదేంటి అని మాలిని అంటుంది. యశ్ వేద కోసం వెతుకుతున్నాడని వాడి చూపుల్లోనే తెలుస్తుంది అని వాళ్ళ నాన్న అంటాడు. రత్నం ఒకసారి వేద కి ఫోన్ చెయ్ అని మాలిని అంటుంది. ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది మాలిని అని వాళ్ళ ఆయన అంటాడు. కట్ చేస్తే అభి మాలవిక దగ్గరికి వస్తాడు. ఏమైంది ఎంతవరకు వచ్చింది కేసు అని మాళవిక అడుగుతుంది. అన్ని పకడ్బందీ చేశాను ఈరోజుతో జడ్జిమెంట్ అయిపోతుంది యశ్ కి ఉరిశిక్ష లేదంటే జీవితఖైదీ అని అభిమన్యు అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?