Guppedantha Mnasu October 18Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 583వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 18న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఈ రోజు ఎపిసోడ్ లో రిషి, వసుధారలు మాట్లాడుకుంటూ ఉంటారు. వసు అన్ని బాగానే ఆలోచిస్తావు కదా, ఎందుకు ఈ ఒక్క విషయంలో అంత పట్టు పడుతున్నావు, ఆ గురుదక్షిణ గురించి మర్చిపోవచ్చు కదా అని అంటాడు రిషి.మీరు నన్ను మర్చిపోతారా సార్, అయినా మనిద్దరి మధ్య ఉన్నది గొడవలు కాదు సార్ అభిప్రాయ బేధాలు అంతే అని అంటుంది.
వసు మీద కోప్పడ్డ రిషి :
రెండు మనసులు రెండు ఆలోచనలు ఉండడం కరెక్ట్ కాదు ఆలోచించుకో అని చెప్తాడు. అయినా ఎందుకు నీకు అంత పట్టుదల, నీకు అంత పట్టుదల ఉంటే మనం జీవితంలో కలిసి ప్రయాణం చేయలేం అని అంటాడు.నేను మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తిగా చూడాలని అనుకుంటున్నాను. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక మెట్టు దిగితే సరిపోతుంది కదా అని అంటాడు. ఆ మెట్టు మీరే దిగవచ్చు కదా జగతి మేడంని అమ్మ అని పిలవచ్చు కదా అని అంటుంది. నువ్వు మారవు అని అర్థమైంది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
దేవయాని విషయంలో జాగ్రత్తగా ఉండమని జగతికి చెప్పిన ధరణి :
సీన్ కట్ చేస్తే జగతి, మహేంద్ర ఇద్దరు రిషి గురించి బాధ పడుతూ ఉంటారు.మనం ఎంతో జాగ్రత్తపడి వాళ్ళిద్దర్నీ ఒకటి చేద్దాం అనుకుంటున్నా సమయంలో ఇలా జరిగింది ఏం చేద్దాం జగతి. రిషి ఇంకా ఇంటికి రాలేదు ఏం జరుగుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది అని అంటాడు మహేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి, రిషి ఈరోజు రానని అత్తయ్య గారికి ఫోన్ చేశాడు చిన్న మామయ్య అని చెప్తుంది. అత్తయ్య ఎందుకో చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో ఏమీ జరగలేనట్లుగా మాట్లాడుతున్నారు. ఆవిడ మనసులో ఏమి ఉందో అర్ధం కావట్లేదు అంటుంది ధరణి.మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు జగతి కూడా ఏదో జరగబోతోంది మహేంద్ర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది.
రిషిని ఇగో తగ్గించుకోమని సలహా ఇచ్చిన గౌతమ్:
వసు దగ్గర నుంచి కోపంగా వచ్చిన రిషి కాలేజీకి వస్తాడు.అక్కడ గౌతమ్ ని చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ఏం రాకూడదా అని అడుగుతాడు గౌతమ్. నీకు జీతం ఎంత అని అడుగుతాడు రిషి. అదేంట్రా అంత మాట అన్నావ్ అని అంటే అవును మరి నా దగ్గర డిటెక్టివ్ పని చేస్తున్నావు కదా అందుకే అలా అడిగాను అని అంటాడు రిషి. అయినా ఎందుకురా నీకు అంత ఇగో. ఒక అడుగు తగ్గి తనని పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా అంటాడు గౌతమ్. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అని సరే రారా మాట్లాడుకుందాం అని చెప్పి గ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి తన గురించి చెప్తాడు.ఏదో కాలేజీ నడుపుకుంటూ గతం మర్చిపోయి బతుకుతున్నాను. ముందు సాక్షి వచ్చి వెళ్ళిపోయింది, తరువాత అడ్మిషన్ అంటూ వసుధార వచ్చింది. తర్వాత జాబ్ అంటూ జగతి మేడం వచ్చారు. ఇవన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి కదా ఇందులో నా ఇగో ఎక్కడ కనిపించింది నీకు అని అడుగుతాడు రిషి.వసుధార తన మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్తాడు. కాలేజీలో క్లాసులు లేవు కదా అందుకే నాకు పీకుతున్నాడు క్లాసులు అని మనసులో అనుకుంటాడు గౌతమ్. ఇన్ని జరుగుతున్నప్పుడు నాకు ప్రశాంతత ఎక్కడ ఉంటుందో చెప్పు అని అంటాడు రిషి. అంతా విన్న గౌతమ్ ఒరేయ్ నన్ను వదిలేయ్ రా బాబు అని అంటాడు.
రిషికి కాల్ చేసిన వసు :
నేను వసుధారాని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. మారింది నేను కాదు నా పక్క వాళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటాడు రిషి. ఇంటికి వెళ్దాం రా అని గౌతమీ అంటే నేను రాను అంటాడు రిషి.వీడు మంచోడే కానీ కొంచెం ఈగో ఎక్కువ అని అనుకుంటాడు గౌతమ్.తన ఫోన్లో రిషి ఫోటో చూసుకుంటూ ఆలోచనలో పడుతుంది వసు.చెంప దెబ్బ తిన్నది నేను కానీ నాకన్నా మీరే ఎక్కువగా బాధపడ్డారు ప్రేమంటే ఇదేనేమో అనుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నారో అనుకుంటూ రిషికి ఫోన్ చేస్తుంది వసు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మెసేజ్ పెడుతుంది. మెసేజ్ కూడా రిప్లై ఇవ్వకపోవడంతో వసు కంగారు పడుతుంది.
వసు, రిషిని తలుచుకుని బాధపడుతున్న మహేంద్ర, జగతి :
పాపం మేడం నన్ను కొట్టి ఆవిడ ఎంత బాధ పడుతున్నారో అని అనుకుంటుంది.ఇంతలో జగతి, వసుని కొట్టి రిషిని బాధపెట్టాను అని బాధపడుతుంది. అంతలో వసు దగ్గరనుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తవచ్చు కదా అని అంటాడు మహేంద్ర. తను అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అందుకే నేను ఫోన్ ఎత్తడం లేదు అంటుంది జగతి. మేడం ఫోన్ ఎత్తడం లేదు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుంది వసు.అప్పుడు మహేంద్ర పర్వాలేదు మాట్లాడు అని చెప్పి ఫోన్ జగతికి ఇస్తాడు. ఫోన్ ఎత్తిన జగతి కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడదు, ఎందుకు మేడం మాట్లాడట్లేదు రిషి సార్ ఇంటికి వచ్చారా, భోజనం చేశారా అని అడిగితే రిషి ఇంటికి రానన్నాడు అని ఏడుస్తూ చెప్తుంది జగతి.
గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్నం హై లెట్స్వ….. వసు పంపిన భోజనంను రిషి కనిపెడతాడా..?
అప్పుడు మహేంద్ర ఫోన్ తీసుకుని రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసా అని వసుని అడుగుతాడు. తెలియదు సార్ అంటుంది.ఇక ఆఫీసులో కూర్చున్న రిషి దగ్గరికి క్యారియర్ తో వస్తాడు గౌతమ్. ఆకలి వేస్తుంది రారా భోంచేద్దామని అంటాడు. సరే వడ్డించు అని తింటాడు. అయితే ఆ బోజనం వసు వండిందని గుర్తుపడతాడు రిషి. ఎక్కడినుంచి తెచ్చావ్ రా అని అడుగుతాడు గౌతమ్ ని. భోజనం బావుంది కదా తినొచ్చు కదా ఎవరు వండితే ఏమి అని అంటాడు గౌతమ్. ఇక వసు బయట నుంచోడం గమనించిన రిషి నించొని కాళ్లు నొప్పుడతాయి లోపలికి రా అని అంటాడు రిషి. నేను కూర్చునే ఉన్నాను కదరా అని అంటాడు గౌతమ్. నాటకాలు చాలు, నిన్నే వసు లోపలికిరా అని గది బయట ఉన్న వసుని పిలుస్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!