Janhvi Kapoor: దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అందరికీ సుపరిచితురాలే. తల్లికి తగ్గ తనయురాలుగా ఉత్తరాదిలో జాహ్నవి కపూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. దివంగత శ్రీదేవికి బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో దాదాపు చాలామంది టాప్ హీరోలతో నటించింది. ఎన్టీఆర్ తరంతో పాటు చిరంజీవి తరం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇంకా పలు హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. అనంతరం బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్నాక దక్షిణాది సినిమాలకు దూరమైంది.
ఇదిలా ఉంటే ఆమె వారసురాలుగా జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతూ ఉంది. ఇదే సమయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వటానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాహుబలి, RRR లతో తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయి. ఈ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోయిన్స్ తెలుగు సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఇటువంటి తరుణంలో జాహ్నవి కపూర్ తెలుగు ఎంట్రీ గురించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ ఇష్టమే. అయితే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇటీవలే “RRR” చూడటం జరిగింది. అందులో తారక్ మరియు చరణ్ నటన చాలా అద్భుతంగా ఉందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా గతంలో విజయ్ దేవరుకోండ సినిమాలో నటించాలని ఉందని తెలిపింది. ఈ సారి తారక్ సినిమాలో నటించాలని జాన్వీ కపూర్ చెప్పడం గమనార్హం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!