Kirshnamma Kalipindi Iddarini; ఈశ్వర్ గదిలో కూర్చుంటాడు. గౌరీ నీళ్లు తీసుకొని వస్తుంది, నీళ్లు తీసుకోండి అంటుంది. ఏంటండీ అలా ఉన్నారు ఏమైంది అని అడుగుతుంది గౌరీ. నీతో కొంచెం మాట్లాడాలి గౌరీ. నాతో ఏం మాట్లాడాలి అంటుంది గౌరీ. ఇందాక అమ్మ నన్ను ఎక్కడికి వెళ్లావు అని అడిగినప్పుడు, అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా ఎందుకని అంటుంది గౌరీ. నిజం చెప్తే అమ్మ బాధపడుతుంది కాబట్టి అంటాడు ఈశ్వర్. ఆ నిజమేంటండి అంటుంది గౌరీ.
నేను వెళ్ళింది ఒక పోలీస్ కానిస్టేబుల్ ని కలవడానికి అని అంటాడు ఈశ్వర్. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు, అసలు పోలీస్ కానిస్టేబుల్ని కలవడానికి మీరెందుకు వెళ్లారు ఏం జరిగింది అని అడుగుతుంది గౌరీ. అతను నీ నెంబర్ కి కాల్ చేశాడు, నీకు ఫోన్ వచ్చిందని నేను చెప్పినప్పుడు నీ చేతిలో గార పిండి ఉందని నన్ను మాట్లాడమని చెప్పావు కదా ఆ కానిస్టేబుల్ ఫోన్లో ఏం మాట్లాడాడో తెలుసా అఖిలని ఏదో కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తే నువ్వు 25 లక్షలు కట్టి తనని విడిపించావు అని చెప్పారు అర్జెంటుగా ఇంకో లక్ష ఇవ్వాలని లేదంటే పాత కేసుని మళ్లీ బయటకి ఇస్తాను అని ఫోన్లో బెదిరించాడు అందుకే ఆ కానిస్టేబుల్ ఎవరు అఖిల అరెస్టు అవ్వడమేంటి నువ్వు 25 లక్షలు కట్టి విడిపించడం ఏంటి, ఆ విషయాలుతెలుసుకుందామనే కానిస్టేబుల్ ని కలవడానికి వెళ్లాను అందుకే నేనెక్కడికి వెళ్తున్నాను నీకు కూడా చెప్పకుండా వెళ్లాను అని చెప్తాడు ఈశ్వర్.
గౌరీ టెన్షన్ పడుతూ అఖిలని ఏ విషయంలో అరెస్ట్ చేశారు కానిస్టేబుల్ చెప్పే ఉంటాడు అనుకుంటుంది, కనకదుర్గమ్మ ఏంటమ్మా నాకు ఈ పరిస్థితిఅనుకుంటుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఉన్నాను అంటాడు ఒక వ్యక్తి. గౌరీ వస్తే అందరూ తన మీద డౌట్ వస్తుందా నీతో పంపించిందన్నమాట, చూడ్డానికి అమాయకంగా ఉంటుంది కానీ భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి అని అర్థం అవుతుంది. నా భార్య గురించి తప్పుగా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు నిన్ను చంపేస్తాను. కానిస్టేబుల్ ని కొడతావ్ రా అని మీదికి వస్తాడు. ఈశ్వర్ వాడి గొంతు పట్టుకొని,ఏరానా మరదలు గురించి తప్పుగా మాట్లాడి డబ్బులు ఇవ్వమని నా భార్యని బెదిరిస్తావా అని చెంప పగలగొడతాడు. వాడు ఈశ్వర్ ని నెట్టేసి పారిపోతాడు. ఈ విషయం అంత ఈశ్వర్ గౌరీ కి చెప్తాడు. మేము మంచితనంతో నేను పశ్చాతాపంతో కాలిపోతున్నానండి అని అనుకుంటుంది గౌరీ తన మనసులో. గౌరీ ని తప్పు లేకపోయినా ఎవడో ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతావ్ అని నాకు తెలుసు అందుకే నీకు ఈ విషయం చెప్పకుండా ఉండాలని అనుకున్నాను కానీ నా మనసు చెప్పకుండా ఉండలేకపోయింది అని ఈశ్వర్ అంటాడు.
మనిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు రహస్యాలు ఉండకూడదు అని మనం ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకున్నాము ఇప్పుడు ఈ విషయం నేను నీకు చెప్పకుండా దాస్తే మనం చేసుకున్న ప్రామిస్ ని నేను తప్పినట్టు అవుతుంది అని అంటాడు ఈశ్వర్. అది విన్న గౌరీ కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. గౌరి నీ కంట్లో కన్నీరు వచ్చాక తుడిచి ఓదార్చడం కాదు అసలు కన్నీళ్లే రాకుండా నిన్ను చూసుకుంటాను అని మన పెళ్లికి ముందు నీకు చెప్పాను మరి అలాంటిది నా కారణంగా నీ కంట్లో కన్నీరు వస్తే భర్తగా నేను ఓడిపోయినట్టే కదా ప్రాణం పోయినా సరే నా కారణంగా నీకు బాధ పడే పరిస్థితిని భర్తగా నేను ఓడిపోయే పరిస్థితిని రానివ్వను ఈశ్వర్ అంటాడు.గౌరీ ఏడుస్తూ ఆపుకుంటుంది.
గౌరీ ఆ కానిస్టేబుల్ మాటలని నేను నమ్మలేదు నువ్వు కూడా పట్టించుకోకు. కిటికీలో నుంచి ఈశ్వర్ వాళ్ళ అత్తయ్య అంతా చూస్తుంది, భార్య మీద నీకు ఇంత నమ్మకం ఏంట్రా అని అనుకుంటుంది. నాకు ఈ పశ్చాత్తాపాన్ని మోసే శక్తి లేదండి అందుకే మీకు నిజం చెప్పేస్తాను. ఇంతలో సునంద వచ్చి గౌరీ, మిమ్మల్ని త్వరగా ఫ్రెష్ అవ్వమని చెప్తే ఇలానే ఉన్నారు ఏంటి అని అడుగుతుంది. ఈశ్వర్ నువ్వు రా తొందరగా రెడీ అవుదువు గాని. గౌరీ వెళ్ళొస్తాను అని ఈశ్వరి వెళ్ళిపోతాడు. సునంద ఈశ్వరుని ఆదిత్య రెడీ చేస్తుంది. అక్కడ గౌరీ ఇంకా అఖిలను రెడీ అవుతారు. గౌరీ మాత్రం ఈశ్వర్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తప్పు ఒప్పు అఖిలను పోలీస్ స్టేషన్ నుండి విడిపించడానికి అత్తయ్య దగ్గర 25 లక్షలు తీసుకున్న విషయం ఆదిత్య అఖిల పెళ్లి శరతు గురించి ఈశ్వర్ కి చెప్పాలనుకున్నాను అత్తయ్య గారు రావడం వల్ల చెప్పలేకపోయాను గౌరీ అనుకుంటుంది.
ఇద్దరం కలిసి పరిపూర్ణంగా జీవితం పంచుకునే ఈ రోజు ఆయనకు అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలి అంటే నేను కూడా ఆయనతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలి, పంచుకుంటాను అని గౌరీ తన మనసులో అనుకుంటుంది. ఈశ్వర్ గదిలో ఉంటాడు గౌరీ పాలు తీసుకొని వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!