ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బిల్లులోని అయిదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ వివరణ కోరగా, గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై సర్కార్ వివరణ ఇచ్చింది. అంతకు ముందు గవర్నర్ తీరును నిరసిస్తూ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటల పాటు బస్సులను బంద్ చేశారు. కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి చేరుకున్న నేపథ్యంలో కార్మికల నేతలను చర్చలకు రాజ్ భవన్ అధికారులు అహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నేతలతో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళి సై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్ తో గంట పాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని సంఘ నేత థామస్ రెడ్డి తెలిపారు. అయితే మొత్తం 11 యూనియన్ ల నేతలు ఉంటే కొందరు నేతలను మాత్రమే రాజ్ భవన్ లోకి అహ్వానించడంపై మరి కొందరు నేతలు రాజ్ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
సీఎం వైఎస్ జగన్ విశాఖ మకాం మార్పునకు మూహూర్తం ఫిక్స్ ..? ఎప్పుడంటే..?