Madhuranagarilo September 27 ఎపిసోడ్ 168: అమ్మ నేను చెబుదామని అనుకున్నాను కానీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అని అంటాడు. అయినా నువ్వు మాకు ఎందుకు చెబుతావు రా అని మధుర ఏడుస్తుంది. అమ్మ మాకు ఏడేళ్ల క్రితం పెళ్లి అయ్యింది నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ ఆ పెళ్లి మూణాల ముచ్చటగానే మిగిలిపోయి మేము విడిపోయాము పట్టుమని ఒక నెలరోజులు కూడా కాపురం చేయలేదమ్మా పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకువచ్చి మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయామని మీకు చెప్పలేక ఉండిపోయాను అంతేకానీ మిమ్మల్ని బాధ పెట్టడనికి కాదు అని శ్యామ్ అంటాడు.
మరి ఇప్పుడు ఎందుకు చెప్పావురా ఆ రాదని పెళ్లి చేసుకోవాలని చెప్పావు కదూ ఆ రాధ మీద ఉన్నంత ప్రేమ తల్లిదండ్రుల మీద నీకు లేదు కదా అందుకే రాదని పెళ్లి చేసుకోవద్దు అని నేను చెప్పగానే నువ్వు రెండో పెళ్లి వాడివని నాకు చెప్పావు అంటే దాని అర్థం ఏంట్రా అమ్మానాన్న చచ్చారనే కదా అని పరిగెత్తుకెళ్ళి మధుర డోర్ వేసుకుంటుంది. అమ్మ నేను చెప్పేది అర్థం చేసుకో అమ్మ తలుపు తీయమ్మా అని అంటాడు. మధురై ఎంతకు డోర్ తీయదు. నాన్న నేను కావాలని చేయలేదు నాన్న మీకు చెబుదామని అనుకున్నాను నాన్న నన్ను అర్థం చేసుకోండి నాన్న అని శ్యామ్ అంటాడు.
అర్థం చేసుకున్నాను కాబట్టే కూల్ గా ఉన్నాను కానీ మీ అమ్మే అర్థం చేసుకోలేదు అందుకే బాధపడుతుంది అని ధనుంజయ్ అక్కడినుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాధ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటే అలా ఉన్నావు అని అంటుంది.ఏమీ లేదే మధుర ఆంటీకి శ్యామ్ పెళ్లయిందని చెప్పగానే పాపం తను ఎంత బాధ పడుతుందో అని రాదా అంటుంది. అది సరే కానీ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి పిల్లను చూసి వద్దామని అన్నావు మరి వెళ్దామా అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. అలాగే వెళ్దాము అని రాధా పండుని పిలిచి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆడుకో నాన్న అని పండుని అంటుంది అలాగే అమ్మ అని పండు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏంటమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని శైలు వాళ్ళ అమ్మ అంటుంది.
ఏమీ లేదమ్మా పెళ్లి వారు ఎవరో వస్తారని చెప్పావు కదా వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాను అని శైలు అంటుంది. ఇన్ని రోజులు పెళ్లి వద్దు అని అనే దానివి ఇప్పుడు ఏంటి పెళ్లి కొడుకు ఫోటోలు చూడడానికి అంతలా ఆరాటపడిపోతున్నావ్ అని వాళ్ళ అమ్మ అంటుంది. నేనంతె మమ్మీ ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాల్సిందే అని శైలు అంటుంది.ఇంతలో పెళ్లి వారు వచ్చేస్తారు రండి రండి మ అమ్మాయి శైలజ అని వాళ్ళ అమ్మ అంటుంది. తను నా ఫ్రెండ్ స్వప్న అని రాదా అంటుంది. మా అమ్మాయి ఎలా ఉంది అని శైలజ వాళ్ళ అమ్మ అంటుంది. మీ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది బంగారం లాంటి సంబంధం చూపిస్తాను అని రాదా అంటుంది. ఆగండి నేను స్విట్జర్లాండ్ లో ఉండాలని అనుకుంటున్నాను పెళ్లయ్యాక స్విట్జర్లాండ్ కి వచ్చే అబ్బాయిని చూపించండి అని శైలజ అంటుంది. అలాగే మేడం అని రాదా అంటుంది. నిన్ను ఎక్కడో చూసినట్టుందే అని శైలజ అంటుంది.
ఎప్పుడైనా మ్యారేజి బీరు కి వచ్చి చూసుంటారు అని రాదా అంటుంది. నీ మ్యారేజ్ బ్యూరో పేరేంటి అని శైలు అంటుంది. రుక్మి మ్యారేజ్ బ్యూరో మేడం అని రాదా అంటుంది. రుక్మిణి అంటే మీ అక్క పేరు కాదు నిన్ను మీ అక్క ఫోన్లో చూశాను అందుకే గుర్తుండి పోయావు అని శైలు అంటుంది. అయితే మా బావని మీరు చూసే ఉంటారు కదా మా బావ ఎలా ఉంటాడో నీకు తెలుసా అని రాదా అంటుంది. తెలుసు ఒకసారి ఫోటోలో చూశాను అది నా ల్యాప్టాప్ లో ఉంది కానీ అది పాడైపోవడం వల్ల దాన్ని రిపేర్ కి ఇచ్చాను అని శైలు అంటుంది.అది బాగా అయ్యాక నాకు ఒకసారి ఆ ఫోటో చూపించండి మేడం అని రాధా అంటుంది. అలాగే చూపెడతాను ఎంతైనా నా ఫ్రెండ్ కదా తనకి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా అని శైలు అంటుంది. థాంక్స్ మేడం మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అని రాదా అంటుంది. దానిదేముందమ్మా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయి సరిపోతుంది అని శైలు వాళ్ళ అమ్మ అంటుంది.
థాంక్యూ స్వప్న నీవల్లే నేను ఇక్కడికి వచ్చాను అని రాదా అంటుంది. కట్ చేస్తే మధురా డ్యూటీ షామీ ఇక్కడ లేడు అని ధనుంజయ్ అంటాడు. మధుర డోరు తీస్తుంది. మధుర వాడు ఎలాంటి పరిస్థితులు ఆ తప్పు చేశాడో నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని ధనుంజయ్ అంటాడు.మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి కామ్ గా ఉన్నారు నేను అర్థం చేసుకోలేదు కాబట్టి ఆవేశపడుతున్నాను అని మధుర అంటుంది. ఇంతలో సంయుక్త అక్కడికి వచ్చి అత్తయ్య ఏ పరిస్థితుల్లో శ్యామ్ అలా చేశాడు అర్థం చేసుకోండి మీరంటే తనకి చాలా ఇష్టం మీకోసం తన ప్రాణాలైనా ఇచ్చేస్తాడు అని సంయుక్త అంటుంది. కానీ వాడు మమ్మల్ని అర్థం చేసుకున్నాడా నేను మాత్రం ఎందుకు అర్థం చేసుకోవాలి అని మధుర అంటుంది. ఒక్కోసారి అలా జరుగుతాయి అత్తయ్య నేను మీ ఇంటి కోడల్ని అవుతానని నేను మాత్రం అనుకున్నానా అలాగే శ్యామ్ విషయంలో జరిగి ఉంటుంది అని సంయుక్త అంటుంది. మధుర ఏమి మాట్లాడకుండా అలాగే నిలబడి చూస్తుంది.
ఏంటి అత్తయ్య అలాగే చూస్తున్నారు ఈ అమ్మాయి పెళ్లి అయిన వాడిని చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా ఎవరు ఏమనుకున్నా నేను మీ ఇంటి కోడల్ని కావాల్సిందే అని సంయుక్త అంటుంది. నువ్వు ఎంత మంచి దానివి సంయుక్త నీలాంటి దాన్ని నేను కోడలుగా చేసుకుంటాను అని మధుర అంటుంది. అయితే పదండి మీరు అన్నం తిందురు గాని అని సంయుక్త అంటుంది. నేను తినను శ్యామ్ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేంతవరకు నేను అన్నం తినను అని మధుర వెళ్లి డోర్ వేసుకుంటుంది. మావయ్య గారు మీరైనా తిందురు గాని రండి అని సంయుక్త అంటుంది. కడుపు నిండిపోయింది అమ్మ ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత నువ్వు వెళ్లి బాగా తిను అని ధనుంజయ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?