Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” నేడు రిలీజ్ అయింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ పనితనం సినిమాలో సరిగ్గా లేదని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలో పెద్దగా స్టోరీ లేదని చిన్న లైన్..నీ సాగదీయడం జరిగిందని థియేటర్ నుండి వస్తున్న జనాలు విమర్శలు చేస్తున్నారు. త్రివిక్రమ్ తీసిన సినిమా మాదిరిగా లేదని అంటున్నారు. అనవసరంగా ఈ సినిమా కోసం ఏడాదిన్నర టైం మహేష్ కి వేస్ట్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నెక్స్ట్ రాజమౌళి సినిమాకి ఇంకా ఏడాదిన్నర నుండి రెండు సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉందని దీంతో మధ్యలో మహేష్ ని చూడలేము అన్న బాధలో ఫ్యాన్స్ ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ “గుంటూరు కారం” చాలా నిరాశ పరచడం జరిగింది. సినిమా మొత్తానికి మహేష్ బాబు డాన్స్ మినహా చెప్పుకోవడానికి ఏం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కుటుంబ సమేతంగా సుదర్శన్ థియేటర్ లో సినిమా తిలకించడం జరిగింది. మహేష్ కి సుదర్శన్ థియేటర్ చాలా సెంటిమెంట్. ఈ క్రమంలో కుటుంబంతో సహా థియేటర్ లో మహేష్ సందడి చేయడం జరిగింది.
ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సినిమాగా “గుంటూరు కారం” విడుదల అయింది. ఈ సినిమాకి అత్యధికమైన థియేటర్ లు కేటాయించడం జరిగింది. కానీ ఫస్ట్ డే మిక్స్ డ్ టాక్ రావటం ఫ్యాన్స్ ని కలవరపరుస్తుంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ నీ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని సమాచారం. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి మూడో వారం లేదా చివరి వారంలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావటంతో సినిమా కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ వీకెండ్ తర్వాత మాత్రం.. ప్రజెంట్ టాక్ బట్టి కష్టమే అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!