Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప నటుడే కాదు అంతకంటే గొప్ప అందగాడు కూడా. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ హీరోల్లో మహేష్ బాబుదే మొదటి స్థానం అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాలుగు పదుల వయసులో కూడా ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ మిస్మరైజ్ చేసే మహేష్ బాబు.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని స్టైలిస్ట్ ను పిక్స్ ను పోస్ట్ చేశారు. ఈ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.
ఒట్టో క్లాతింగ్ బ్రాండ్ కి మహేష్ బాబు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ కొన్ని ఫోటోషూట్స్ చేశారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఒట్టో కోసం స్పెషల్ ఫోటోషూట్ చేశారు. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ లో సూపర్ కూల్ గా ఫోటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నే మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో మహేష్ బాబు కొత్త లుక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేశాయి. దీంతో నెటిజన్లు ఆయన తాజాగా ఫోటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఏజ్ పెరుగుతున్నా మహేష్ బాబు అందం మాత్రం తరగడం లేదని కొందరు, 40లో కూడా ఏమున్నాడండీ బాబు అని మరికొందరు కామెంట్ల మోత మోగిస్తున్నారు. అలాగే తాజా పిక్స్ లో మహేష్ బాబు కొత్త లుక్ చూసి.. రాజమౌళితో చేయబోయే సినిమా కోసమే అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా మహేష్ బాబు లేటెస్ట్ పిక్స్ మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
కాగా, గత కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా మహేష్ బాబు సూపర్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న మహేష్ బాబు.. ఇటీవల గుంటూరు కారం మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి పండుగ కానుగా జనవరిలో విడుదలైన గుంటూరు కారం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. గుంటూరు కారం అనంతరం మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.
మహేష్ బాబుకు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో.. SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్టోరీ అందిస్తున్నారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో భారీ అడ్వెంజర్ థ్రిల్లర్ గా మహేష్ బాబు, రాజమౌళి సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయి. సమ్మర్ అనంతరం రాజమౌళి-మహేష్ బాబు సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఓ హాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.