Mahuranagarilo October 30 Episode 196: బ్రతికొచ్చానన్నా సంతోషం కంటే కన్న కొడుకు దృష్టిలో ఇంకా చనిపోయానని బాధ తట్టుకోలేక పోతున్నాను అని రుక్మిణి అంటుంది. నువ్వు అలా బాధపడకు రుక్మిణి ఇన్నాళ్లు నువ్వు లేవని నేను అనుకున్నాను కాని తిరిగి వచ్చావు కదా అలాగే పండు కూడా నిన్ను అమ్మ అని పిలిచే రోజు వస్తుంది అప్పటిదాకా ఆగమ్మా అని వాళ్ళ అమ్మ అంటుంది. పండు నిన్ను అమ్మా అని పిలిచేలా చేస్తాను సడన్ గా నేను తల్లిని కాదు నువ్వే తల్లి అని చెప్తే వాడు తట్టుకోలేడు తల్లి కొడుకుల్ని కలిపే బాధ్యత నాది నన్ను నమ్మక అని రాదా అంటుంది. థాంక్యూ రాధా థాంక్యూ సో మచ్ అని రుక్మిణి అంటుంది. అది సరే అక్క బావ ఎక్కడ ఉంటాడు అని రాదా అంటుంది.
ఇప్పుడు అతని గురించి ఎందుకులే మా తర్వాత తెలుసుకుందాం అని రాదా వాళ్ళ అమ్మ అంటుంది. లేదమ్మా అతని గురించి తెలుసుకోవడం నాకు చాలా అవసరం అని రాదా అంటుంది. కట్ చేస్తే శ్యామ్ ఇంట్లో సామాన్ల నీ కోపంతో పగలగొడుతూ ఉంటాడు. ఒరేయ్ శ్యామ్ నువ్వు రాదా కేసముద్రం వెళ్లగానే మాకు గుర్తొచ్చింది నీ మొదటి భార్య ఊరు కూడా అదే కదా అని మధుర అంటుంది. పేరు చెప్తేనే ఆ రాక్షసి గుర్తుకు వస్తుంది తనతో గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి ఇంకెప్పుడు అక్కడికి నేను వెళ్ళను అని శ్యామ్ అంటాడు. ఎంతో బాధ పెట్టిన ఆ అమ్మాయి ఊళ్లోనే నిన్ను ఎంతో సంతోషపెట్టే రాధ కూడా పుట్టింది కదా అంటే నీకు ఎంతో బాధనిచ్చిన కేసముద్రమే నిన్ను ఎంతో సంతోషపెట్టే రాదని కూడా ఇచ్చింది బాధపెట్టే వాళ్ల గురించి ఆలోచించకూడదు నిన్ను సంతోష పెట్టే వాళ్ల గురించి మాత్రమే ఆలోచించాలి అలా ఆలోచిస్తే నీకు ఆ ఊరి మీద కోపమే ఉండదు అని మధుర అంటుంది.
నువ్వు చెప్పింది నిజమే అమ్మ నన్ను బాధ పెట్టిన ఆ మనిషి గురించి అస్సలు ఆలోచించను ఐ యాం రియల్లీ వెరీ సారీ అమ్మ అని శ్యామ్ అంటాడు. ఊరుకో నాన్న వెళ్లి రిలాక్స్ అవ్వు అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే చెప్పక్క బావగారు ఎక్కడ ఉంటాడు అని రాదా అంటుంది. బావగారు అని అంత మర్యాదగా అడగక్కర్లేదు నా జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుడు వాడు తండ్రి లేని బిడ్డగా పండుని మార్చిన నీచుడు వాడు అలాంటి నీచుడికి బుద్ధి చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని రుక్మిణి అంటుంది. బావ గురించి తెలిస్తే గాని పండు ఆరోగ్యం కుదుట పడదని అక్కకు తెలిస్తే గాని అక్క బావ ఆచూకీ చెప్పదు ముందు ఈ విషయం చెప్పాలి అని రాదా మనసులో అనుకుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు వాడికి ఎలా బుద్ధి చెప్తానన్నా వాడు ఇంకొక ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేస్తాను అని రుక్మిణి అంటుంది.
అది కాదక్కా పండుని అని రాదా చెప్పబోతూ ఉండగా. పండు మీద ఆ దుర్మార్గుడు నీడ కూడా పడనివ్వను అని కోపంగా అంటుంది. రాధా ఇప్పుడు రుక్మిణికి మనశ్శాంతి కావాలి ఇప్పుడు అతని గురించి ఎందుకు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం లే అని రాదా వాళ్ళ అమ్మ అంటుంది. అక్క ఇప్పుడు పండు గురించి ఎందుకులే తర్వాత మాట్లాడుకుందాం పదా లోపలికి వెళ్దాం పండుని నిన్ను ఒకటి చేస్తాను అని రాదా అంటుంది. పండు గురించి ఎన్నో కలలు కంటూ వచ్చాను కానీ వాడు మాత్రం నన్ను దగ్గరికి రానివ్వట్లేదు అని రుక్మిణి అంటుంది. అక్క ఆ కలలే నిజమవుతాయి వాడికి ఈరోజు ఇష్టమైన సేమియా పాయసం చేసి వాడికి పెట్టు అని రాధా అంటుంది. నేను పాయసం చేస్తే మాత్రం లాభమేంటి వాడు నా చేత పెట్టనివ్వడు కదా అని రుక్మిణి బాధపడుతుంది. అక్క నువ్వు తినిపించకపోతేనే నువ్వైతే వండు నేను వాడికి పెడతాను అని రాదా అంటుంది.
పండు విషయంలో ఇంత సంతోషంగా ఉన్న మీరు భర్త విషయంలో ఇంత సంతోషంగా ఉండలేరు కదా రేపు ఆ విషయం బయటపడ్డాక ఎన్ని గొడవలు జరుగుతాయో అని వాళ్ళ అమ్మ తన మనసులో అనుకుంటుంది. రాధా పాయసం రెడీ వెళ్లి పండుకు తినిపించు అని రుక్మిణి అంటుది. అలాగే అక్క అని పాయసం తీసుకుని వచ్చి రాదా ఏంటి తాత మనవడు ఆడుకుంటున్నారా పండు నీకు ఇష్టమైన సేమియా పాయసం తెచ్చాను తిందువుగాని రా అని రాదా అంటుంది. సేమియా పాయసమా త్వరగా పెట్టు అని పండు అంటాడు.రాధా పండు కి పాయసం పెడుతూ ఉంటే ఇంతలో కరెంటు పోతుంది అక్క ఇదే మంచి సమయము ఇప్పుడు నువ్వు పండు కి పాయసం పెట్టు అని రాదా వాళ్ళ అక్కకి చెబుతుంది.
అలాగే అని రుక్మిణి పండుకి పాయసం పెడుతూ ఉండగా కరెంటు వస్తుంది. పాయసం నువ్వు పెడుతున్నావా అని పండు లేచి అమ్మమ్మ నాకు భయం వేస్తుంది లోపలికి వెళ్దాం పద అని వాళ్ళ అమ్మమ్మని తీసుకొని పండు లోపలికి వెళ్ళిపోతాడు. అక్క పండుకు పాయసం కొంచమైనా తినిపించావు కదా బాధపడకు వాడే ముందు ముందు తెలుసుకుంటాడు లే అని రాదా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!