Malli Nindu Jabili ఆగస్టు 9 ఎపిసోడ్ 419: నా సంగతి నీకు తెలియదు మల్లి అని గౌతమ్ బెదిరింపుతో మల్లి నిండు జాబిలి ఈ రోజు ఎపిసోడ్ మొదలవుతుంది…మంచితనంతో ఉంటే ప్రాణంఇస్తాను లేదంటే ఎవ్వరిని లెక్క చేయను, వాడు ఎంత పెద్దవాడైనా, ఆఫ్ట్రాల్ నువ్వెంత నీ ప్రవర్తన మార్చుకోకపోతే నా కళ్ళ ముందు ఉండొద్దు ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచకపోవడం నాదే తప్పు అని గౌతమ్ వెళ్లిపోతాడు. ఇదంతా డోర్ దగ్గర నిలబడి కౌసల్య నీలిమ చూస్తారు. మల్లి దగ్గరికి వెళ్లి ఓదార్చుదాం పదమ్మ అంటుంది నీలిమ.
మల్లి ని ఓదార్చడానికన్న ముందు గౌతమ్ తో మాట్లాడాలి పద. కౌసల్య గౌతమ్ దగ్గరికి వెళ్లి మల్లి ని తిట్టడం అయిపోయిందా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఫోన్ పగలగొట్టడం ఫోన్ కొనివ్వడం, ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు చెప్పటం, అంతా నీ ఇష్టమేనా అని అంటుంది. తను ఎవరితో మాట్లాడుకుంటే నీకెందుకు బ్రో అని అంటుంది నీలిమ. నీలిమా నీకేం తెలియదు ఊరుకో అని గౌతమ్ అంటాడు.
అవును మాకేం తెలియదు అంతా నీకే తెలుసు, నువ్వు చేస్తుంది ఏది కరెక్ట్ కాదు గౌతమ్ మల్లి మీ దగ్గర పనిచేస్తుంది కావచ్చు కానీ మల్లి నీ పనిమనిషి కాదు గౌతం, నిన్ను ఆక్సిడెంట్ నుంచి కాపాడిందని మనం మల్లికి ఆశ్రయమిచ్చాము,అంతా నీ ఇష్టప్రకారమే జరగాలనుకుంటే మల్లి ఏమి నీ భార్య కాదు, నీకు నచ్చినట్టు ఉండాలి అంటే మల్లి ని పెళ్లి చేసుకో. అమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది, నీ భార్య అయితే నీకు నచ్చినట్టు ఉంటుంది బయటి వాళ్లు అయితే ఉండరు అని నీలిమ అంటుంది. తిండి పడేస్తే ఉండడానికి ఇల్లు ఇచ్చినంత మాత్రాన ఎవరు మాట పడరు, మల్లి లాంటి అమ్మాయి తప్ప, మల్లి కాబట్టి భరిస్తుంది. మల్లిని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపేసేయ్ పంపించినప్పుడు యజమాన్యం చూపించకు ఎందుకంటే తను మనకు మేలు చేసిన అతిధి తనేమి భార్య కాదు. మల్లి గురించి బాగా ఆలోచించు తన చేత కంటతడి పెట్టించకు అని నీలిమ కౌసల్య వెళ్ళిపోతారు. పక్కకు వెళ్లి ఏకాదశికి ఇంకా నాలుగు రోజులే టైం ఉంది గౌతమ్ కి పెళ్లి ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని కౌసల్య అంటుంది. మల్లి ని స్వప్న స్థానంలో ఎలా ఊహించగలను మల్లి విషయంలో నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని గౌతమ్ అనుకుంటాడు.
కట్ చేస్తే, మల్లికి ఏ రకంగా న్యాయం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా అని మల్లి వాళ్ళ నాన్న అంటాడు తన మీద నాకు ఎలాంటి అధికారం లేకుండా అయిపోయింది అనిపిస్తుంది. బిడ్డ మీద సర్వ అధికారాలు తండ్రికి ఉంటాయి తన బంగారు భవిష్యత్తు కోసం నువ్వు ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు అంటుంది శరత్ వాళ్ళ అమ్మ.ఇంతలో మాలిని వచ్చి మామ్ అని పిలుస్తుంది, మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. పొద్దున్నే వచ్చావంటే పెద్ద కదే ఉంటుంది అని జగదాంబ అంటుంది. మల్లి చేసిన పనికి రాత్రి మాట్లాడాల్సింది.ఏం చేసింది మాలిని అంటుంది వసుంధర.
అరవింద్ ని నీకు త్యాగం చేశాను అక్క అని బయటకి బడాయి కబుర్లు చెప్పే మల్లి రాత్రి అరవింద్ కి మాటిమాటికి ఫోన్ చేసింది. అరవింద్ ని చూసి ఎంతో కాలమైనట్టు బాబు గారు బాగున్నారు కదా అని అడుగుతుంది అందుకే నాలుగు తిట్టి పెట్టేశాను అని మాలిని చెప్తుంది. మా మల్లి మీకోసం ఎంత చేసినా గుర్తుండదు తిట్టడానికైతే ముందుంటారు అని జగదాంబ అంటుంది. మల్లి ని ఆ గౌతమ్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుదాం అనుకుంటున్నారు పరాయి వాళ్ళింట్లో ఆడపిల్లని వదిలేసి మీరు ఎలా మనశ్శాంతిగా ఉంటున్నారు. పేపర్లో ఫోటో వేయించి నీడ లేకుండా చేశావు మరెక్కడుండమంటావ్. అంతా నేనే చేశాను అది వదిలేయండి అని మాలిని అంటుంది. మీరు ఏమి ఆశించి ఆ ఇంట్లో వదిలేసి వచ్చారు అని అడుగుతుంది మాలిని. మీ ఆలోచన ఏంటి.
ప్రస్తుతానికి మా మల్లి ఆ ఇంట్లో ఉండడమే మంచిది అనిపించింది అందుకే అక్కడే ఉంచాం అయినా నీకు వచ్చిన బాధ ఏంటి చేయాల్సింది అంతా చేసి ఏం తెలియని అమాయకురాలుగా అడుగుతున్నావ్ అని జగదాంబ అంటుంది.నా కూతురు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తుంది మాలిని స్థానంలో మరొకరు ఉండి ఉంటే వేరే లాగా ఉండేది అని వసుంధర అంటుంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మల్లి నిన్ను సొంత అక్క అనుకుంటుంది కానీ నువ్వు అలా అనుకోవడం లేదు అని శరత్ అంటాడు. మీకు దాని తెలివితేటలు అర్థం కావడం లేదేమో అది అక్క అక్క అనుకుంటూనే గుంతలు తోవ్వేస్తుంది నేను దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టానంటే అరపుట అనర్గళంగా చెప్తాను అని వసుంధర అంటుంది. చూడండి ఇప్పటికీ మల్లికి నా మనసులో మంచి స్థానం ఉంది అందుకే మల్లి మంచి గురించి ఒక విషయం చెప్తున్నాను అరవింద్ మల్లి కి ఈ జన్మలో దక్కడు అని మాలిని అంటుంది. దక్కనివ్వము కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అని వసుంధర అంటుంది.
మా మామ్ గాని నేను గాని మనశ్శాంతిగా లేము గొడవలతోనే సగం కాలం గడిచిపోయింది ముందున్న కాలం కూడా అలాగే గడిచిపోయేలా ఉంది మీ తరం అయిపోయినట్టే లెక్క మా తరం మొదలైంది నేను మల్లి కూడా ఆనందంగా ఉండకుండా జీవితాంతం బతికేయాల నేను చెప్పినట్టు విన్నారంటే మల్లి ని కూడా సొంత చెల్లెలు లాగా చూసుకుంటాను అని మాలిని అంటుంది.బుర్రలో ఏదో పెట్టుకొని వచ్చినట్టున్నావుగా అదేంటో చెప్పు అని జగదాంబ అంటుంది. మల్లి కి మరో పెళ్లి చేయండి మరో బంధంతో ముడి వేయకపోయారంటే గాలికి ఎగిరే విస్తరిలా ఎన్ని ఇళ్లకు చేరుతుందో ఏ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో ఎవరు చెప్పలేం అది మీకు సంతోషమేనా మల్లి తన బాస్ తో ఈమధ్య క్లోజ్ గానే ఉంటుంది కదా అలాగే మల్లి కోసం గౌతమ్ కూడా చాలానే చేస్తున్నాడు అందుకే గౌతమ్ కి ఇచ్చి పెళ్లి చేసేయండి అని మాలిని అంటుంది.
గౌతమ్ గురించి కౌసల్య గురించి చెప్పాను కదా మాలిని ఇలాంటి ప్రపోజల్ పెడుతుంది ఏంటి అని వసుంధర అనుకుంటుంది. మల్లి జీవితం బాగుపడాలని తండ్రిగా మీరు విలవిలలాడిపోతున్నారు కదా మీరు కూడా ఈ విషయం గురించి ఆలోచించండి. అందరూ కలిసి ఒక అమాయకురాలైన ఒక ఆడపిల్ల బతుకుతో ఆడుకుంటున్నారు అని జగదాంబ అంటుంది. నువ్వు నీ స్వార్థంతో అంటున్నావో గాని లేదా మల్లి నీ సొంత చెల్లెల్లాగా అనుకోని అంటున్నావో కానీ నేనైతే ఒకటే చెప్పగలను నాలాగా నా కూతురి జీవితం కాకూడదు నేనంటే 20 ఏళ్లు ఓపికతో పల్లెటూరిలో గడిపేసాను కానీ నా కూతురు చూడాల్సిన జీవితం ఇంకా ముందున్నది నా కూతురి బతుకు ఒంటరి అయిపోకూడదు మాలిని అక్కకి అరవింద్ బాబు గారు సొంతం కావాలి నేను వాళ్ల జీవితాల మధ్యలోకి వెళ్ళను అని నా కూతురు అదే మాట అంటుంది మరి అలాంటప్పుడు నా బిడ్డను ఎలా వదిలేయగలను నేను బాగా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటాను అని మీరా అంటుంది.
తొందరగా నిర్ణయం తీసుకోండి అందరికంటే ఎక్కువ మల్లి కి న్యాయం జరుగుతుంది, గౌతమ్ కి ఇచ్చి చేయడమే మంచిదని నా నిర్ణయం అని మాలిని అంటుంది. మాలిని నీతో కొంచెం మాట్లాడాలి అని వసుంధర తనని పక్కకి తీసుకెళ్తుంది. ఆరోజు మీరు మల్లి కోసం వచ్చినప్పుడు మల్లి గురించి నేను చెప్పలేదు నేను నా బిడ్డను మీతో పంపించి ఉంటే ఎలా ఉండేదో బాబు గారు మల్లి కి కొత్త జీవితం ఇవ్వడమే నాకు మంచిది అనిపిస్తుంది మీరే ముందుండి అన్ని చేయాలి బాబు గారు అని మీరా అంటుంది. ముందు మనం మల్లి తో మాట్లాడాలి మీరా మల్లి కి మంచి జరుగుతుంది అంటే నేను వెనకడుగు వేయను శరత్ అంటాడు. నువ్వు చేసింది కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు మాలిని అని వసుంధర అంటుంది. మళ్లీ కి అరవింద్ కి గొడవ జరుగుతుంది ఈ సమయంలో మల్లికి పెళ్లి చేసి పంపిస్తే చాలు అని మాలిని అంటుంది. మల్లి గౌతమ్ ని పెళ్లి చేసుకుంటే చాలా నష్టాలు ఉన్నాయి మాలిని.
రేపటి రోజున నీ భర్త దాని భర్త దగ్గర పని చేయాల్సి వస్తుంది, అది ఎంత నామూషిగా ఉంటుంది మన ప్రెస్టేజ్ కి ఎంత తక్కువగా ఉంటుంది, బాగా ఆలోచించు అని వసుంధర అంటుంది. నువ్వు పరువు గురించి ఆలోచిస్తున్నావ్ నేను నా ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు రేంజ్ ల గురించి ఆలోచిస్తున్నావ్ నేను నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు ఆ కోణంలో ఆలోచించకు నా లైఫ్ కుదుటపడుతుందా లేదా అది మాత్రమే ఆలోచించు అని మాలిని అంటుంది. గౌతం కి మల్లి కి పెళ్లి చేసి అరవింద్ శాశ్వతంగా దూరం చేయాలి. సరే మామ్ నేను వస్తాను అని వెళ్ళిపోతుంది మాలిని. గౌతమ్ మల్లి కోసం వెతుకుతాడు మల్లి గదిలో కనిపించదు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!