Malli Nindu Jabili Episode 509: అమ్మ ఆడపిల్లలు లోపలికి వెళ్ళి దీపం పెట్టండి అని పంతులుగారు అంటాడు. మల్లి మాలిని ఇద్దరూ దీపం పెడతారు. కట్ చేస్తే,భద్రా నేను చెప్పినవన్నీ తెచ్చావా అని వసుంధర అడుగుతుంది. తెచ్చాను మేడం అని భద్ర అంటాడు. నేను గౌతమ్ క్యాబిన్లో మల్లి అరవింద్ పేరు మీద ఉన్నారు రిజిస్ట్రేషన్ పేపర్ పెడతాను నువ్వు మల్లి అరవింద్ ల మ్యారేజ్ సర్టిఫికెట్ మల్లి క్యాబిన్లో పెట్టు అని అంటుంది వసుంధర. ఎందుకు మేడం గౌతమ్ సార్ క్యాబిన్లో పెడితే సరిపోతుంది కదా అని భద్ర అంటాడు. నేను చెప్పింది మాత్రం చెయ్యి నాకు సలహాలు ఇవ్వకు అని అంటుంది వసుంధర. వసుంధర గౌతమ్ రూంలో పెడుతుంది. భద్ర మల్లి క్యాబ్ ఎక్కడ అని వెతికి మరి అక్కడ మ్యారేజ్ సర్టిఫికెట్ పెడతాడు. ఓకే మేడం సక్సెస్ ఇక నేను వెళ్తాను అని భద్ర వెళ్ళిపోతాడు. వసుంధర ఏమి తెలియనట్టు మళ్ళీ వచ్చి అందరిలో నిలబడుతుంది. కట్ చేస్తే, ఏంటి మామ్ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు అని మాలిని అంటుంది. ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడదామని బయటికి వెళ్లాను నేను ఎక్కడికి వెళ్తాను అని వసుంధర అంటుంది.
గౌతమ్ ఇక ఆగలేకపోతున్నాం సర్ప్రైజ్ ఏంటో చూపించు అని శరత్ అంటాడు. అవున్రా గౌతమ్ ఇంకా లేట్ అయితే అందరికీ టెన్షన్ వచ్చేస్తుంది చూపించు అని కౌసల్య అంటుంది. కీర్తి లోపట లాప్టాప్ ఉంటుంది తీసుకురా అని అంటాడు గౌతమ్. కీర్తి లాప్టాప్ తీసుకొచ్చి ఇస్తుంది. లాప్టాప్ ఓపెన్ చేసి గౌతమ్ చూపెడతాడు చూడు మల్లి నీ పేరు మీద మ్యాగజైన్ని రిలీజ్ చేశాను అని గౌతమ్ మల్లి విజయాలు అనే బోర్డు చూపెడతాడు. అది చూసి అందరూ సంతోష పడిపోయి చప్పట్లు కొడతారు. ఇదే మల్లి నీకు నేను ఇవ్వాలనుకున్న మూడో గిఫ్ట్ నేను మన పెళ్లి కాకముందే ఒక మ్యాగజైన్ ని ఓపెన్ చేయాలనుకున్నాను కానీ దానికి ఏం పేరు పెట్టాలో అప్పుడు నాకు అర్థం కాలేదు మన పెళ్లయిన తర్వాత నీ పేరు పెడితే బాగుంటుంది అనిపించింది అందుకే అమ్మ పేరు చెల్లెలి పేరు పెట్టకుండా నీ పేరు పెట్టాను అని గౌతమ్ అంటాడు.
మల్లి కి నోట మాటలు రాక ఆనంద భాష్పాలు కురిపిస్తుంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని దాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిస్తున్నావు గౌతమ్ కాసేపట్లో కిందపడి మంటల్లో కాలిపోతుంది చూడు అని మనసులో అనుకుంటుంది.మల్లి పేరు మీద మ్యాగజైన్ ఓపెన్ చేశావు కానీ దాంట్లో మల్లి జీవిత కథలు రాస్తావా వాళ్ళ అమ్మ మీరా గురించి రాస్తావా వాళ్లు నేలకొండపల్లి నుంచి సిటీకి వచ్చి ఎలాంటి అడ్డమైన పనులు చేశారో రాస్తావా అని వసుంధర వెటకారంగా అంటుంది.
కాసేపు ఊరుకోవచ్చు కదా అని మాలిని అంటుంది. నేను అన్న దాంట్లో తప్పేముంది మాలిని అని వసుంధర అంటుంది. మల్లి జీవితంలో కొన్ని ఘట్టాలు రాస్తే తప్పేముంది తను నేలకొండపల్లి నుంచి సిటీకి వచ్చి స్టేట్ సెకండ్ ర్యాంకర్ గా నిలిచింది అక్కడితో ఆగకుండా మ్యాగజైన్ సీఈఓ దాకా ఎదిగింది, అలాగే మీరా అత్తయ్య గారి గురించి కూడా రాయొచ్చు ఎందుకు అంటే మల్లి కలలన్నీ నిజమైన చేసింది ఆ తల్లి కల నెరవేరినందుకు ఎంతో ఆనందంతో పొంగిపోతుంది మీరెందుకు అంత ఈర్ష పడిపోతూ అంటున్నారు అని అరవింద్ అంటాడు.నా కూతురు నాలాగా కష్టాలు పడుతూ బ్రతకాలని నేను కోరుకోలేదు డబ్బు లేకపోయినా ఆనందంగా ఉండి చక్కగా చదువుకొని బాగా ఎదగాలనుకున్నాను నేను అనుకున్న దానికంటే గొప్పగా నా కూతురు జీవితాన్ని మలిచినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను గౌతమ్ బాబు అని మీరా ఆనందంతో కన్నీళ్లు కారుస్తుంది. తల్లి చెల్లిని కాదని నీ పేరు పెట్టాడు అంటే మా వాడికి నువ్వంటే ఎంత ప్రేమ తెలిసిందా అని కౌసల్య అంటుంది. నువ్వు సూపర్ గిఫ్ట్ ఇచ్చావు బ్రో జీవితాంతం వదిన మరిచిపోలేదు అని నీలిమ అంటుంది.
గౌతమ్ నువ్వు చిన్నవాడివి అయినా నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నువ్వు చేసిన పనికి మల్లి కి తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను అని శరత్ అంటాడు. మల్లి అందరికీ స్వీట్లు పంచు అని గౌతమ్ అంటాడు. మల్లి అందరికీ స్వీట్లు ఇస్తుంది. గౌతమ్ మల్లి కి స్వీట్ నోట్లో పెట్టి కంగ్రాట్స్ చెప్తాడు. థాంక్స్ అండి అని మల్లి అంటుంది. మల్లి మాలినీకి స్వీట్ నోట్లో పెట్టబోతే అలాగే చూస్తుంది మాలిని. అక్కకు ఇష్టం లేదేమో అని మల్లి తలవంచుకొని నిలబడుతుంది. తన చేయి పట్టుకొని స్వీట్ నోట్లో పెట్టుకుని తింటుంది మాలిని.
మాలిని కూడా మల్లి కి స్వీట్ తినిపిస్తుంది. మల్లి ఇప్పుడు సంతోషమేనా ఇద్దరు అక్క చెల్లెలు సీఈఓ అండ్ మేనేజర్ అని కౌసల్య అంటుంది. మల్లి మాలిని ఒకరికి ఒకరు కంగ్రాట్స్ చెప్పుకుంటారు. ఈ ఆనంద సమయంలో ఒక సెల్ఫీ దిగుదాం అని నీలిమ సెల్ఫీ దించుతుంది. సంబరపడండి కొద్దిసేపట్లో అనుభబ్ పేలబోతుంది ఇదే మల్లి కి ఆనంగావుడే చివరి రోజు ఈ వసుంధర కొట్టిన దెబ్బకి జీవితంలో మళ్లీ కోలుకోదు అని అనుకుంటుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు సేమ్ చీరలు కట్టుకొని వచ్చారు కాబట్టి ఈ ఆనంద సమయంలో డాన్స్ వేయాలి అని నీలిమ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?