Malli Nindu Jabili April 22 2024 Episode 628: నన్ను చంపేసిన చోటు దగ్గరికి వెళ్ళాము దారిలో గౌతమ్ కనిపిస్తే తనను కూడా తీసుకువెళ్లాం చాలా రోజులు అయింది కదా అని అరవింద్ అంటాడు. అరవింద్ ని చంపిన వాడికి ఉరిశిక్ష పడాలి అదే నేను కోరుకుంటున్నాను అని మాలిని అంటుంది. తన అభిప్రాయం అది నేనైతే వదిలేద్దాం అంటున్నాను అని అరవింద్ అంటాడు. మల్లి ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అందరికీ భోజనం వడ్డించు గౌతమ్ కి పాయసం అంటే ఇష్టం అన్నావు కదా పాయసం వడ్డించు అని అరవింద్ అంటాడు. మల్లి ఒక బౌల్లో పాయసం వేసి గౌతమ్ కి ఇస్తుంది. అరవింద్ అందులో విషయం కలిపాడు అనుకున్నా గౌతమ్ పాయసం వద్దంటాడు. అదేంటి గౌతమ్ నికు పాయసం అంటే ఇష్టం కదా తిను అని అరవింద్ పాయసం తీసుకొని ఇస్తాడు. తిను గౌతమ్ అని ఫోర్స్ చేస్తూ ఉండగా గౌతమ్ నాకొద్దు అని చేయని నెట్టేస్తాడు.
ఆ పాయసం అరవింద్ మీద పడిపోతుంది. గౌతమ్ ఎందుకిలా చేసావ్ చేయిని ఎందుకలా నెట్ వేశావు పిలవకుండా వచ్చామని చులకన అయిపోయామా అని మాలిని అంటుంది. బాబు గారు మీకు ఏం కాలేదు కదా ఎందుకండి ఇలా చేశారు అని మల్లి అంటుంది. ఏదో ఆవేశంలో జరిగిపోయి ఉంటుందిలే మల్లి అని అరవింద్ అంటాడు. అరవింద్ ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ ఉండడం అవసరమంటావా వెళ్దాం పద అని మాలిని అంటుంది. అక్క ఎంతో ఇష్టపడి మీకోసం వండాను తినేసి వెళ్ళండి అని మల్లి బ్రతిమిలాడుతుంది. గౌతమ్ కి మేము రావడం ఇష్టం లేదేమో మల్లి అని అరవింద్ అంటాడు.అయినా వినిపించుకోకుండా మాలిని అరవింద్ ని తీసుకొని వెళ్ళిపోతుంది.
ఎందుకు అన్నయ్య అలా చేసావ్ వదిన ఎంతో కష్టపడి చేసింది అని నీలిమ అంటుంది. ఇంతలో మల్లి వచ్చి ఎందుకండి పిచ్చి పట్టిన వాడిలా చేశారు వాళ్లు ఎంత బాధపడి ఉంటారు ఈ వంటలన్నీ మీరే తినండి అంటూ మల్లి వెళుతూ ఉండగా అరవింద్ పాయసంలో విషం కలిపాడు నేను చూశాను అందుకే ఫోర్స్ చేశాడు అని గౌతమ్ అంటాడు. ఈ పాయసంలో విషం ఉందా అని మల్లి పాయసం వేసుకొని తింటుంది ఇందులో విషం ఉంటే నాకు ఏదైనా కావాలి కదా ఎందుకండీ ఇంటికి వచ్చిన వాళ్ల మీద నిందలు వేస్తారు తెలిస్తే బాధపడతారు వాళ్లు రావడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా అంటూ మల్లి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, వాళ్లు పిలవకుండా వెళ్లడం తప్పు మనదే అరవింద్ అని మాలిని అంటుంది. గౌతమ్ నావల్లే అలా ప్రవర్తిస్తున్నాడు మాలిని అని అరవింద్ అనుకుంటాడు.సరదాగా కలుద్దాం అనుకున్నాం అని అరవింద్ అంటాడు.దూరం ఉంటేనే ప్రేమలు ఉంటాయి అరవింద్ రసుకొని పూసుకొని తిరిగితే అనర్ధాలు వస్తాయి అని మాలిని అంటుంది. ఇది రొమాన్స్ టైం అని మాలినిని ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు అరవింద్. లైట్ బంద్ చేసి డోర్ పెట్టి బెడ్ మీద పడుకొని తనను ప్రేమగా చూస్తూ ఇలా ఎత్తుకొని రావడం పల్లకిలో మోసుకొచ్చినట్టు అనిపించిందా అని అంటాడు అరవింద్.
నీ నవ్వు మల్లెపువ్వు నీ చెక్కిళ్ళు తామర పువ్వు నీ పెదాలు గులాబీ పూలు మొత్తం పూల తోటే ఉంది అని మాలిని పొగుడుతాడు అరవింద్.శ్రీవారికి ఏదో కావాలనుకుంట అని మాలిని అంటుంది. రేపు డాక్టర్ నీ కలిసి మనం మళ్లీ పిల్లలకు ప్లాన్ చేద్దాం అని అరవింద్ అంటాడు. అలాగే అని మాలిని అంటుంది. కట్ చేస్తే, వసుంధర కౌసల్య ఒక దగ్గర మీట్ అవుతారు. నన్ను ఎందుకు రమ్మన్నావు వసుంధర అని కౌసల్య అడుగుతుంది. ఏమీ లేదు వదిన నా అల్లుడు నా కూతురు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను వాళ్ళిద్దరి మధ్యలోకి నీ కోడల్ని రాకుండా నువ్వే హద్దుల్లో పెట్టుకో అని వసుంధర అంటుంది. నా కొడుకు కోడలు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటాను వాళ్ళిద్దరి మధ్యలోకి నీ అల్లుని రాకుండా చూడు వసుంధర వాళ్ళిద్దరి మధ్యలోకి అరవింద్ రావడంతో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అని కౌసల్య అంటుంది.
అయితే ఇప్పుడు ఏమంటావు వదిన అని వసుంధర అంటుంది. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమొ మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అందరి ముందు మల్లి నీ తిడతాను కానీ తన మంచితనం ముందు మనం ఎవరు సరిపోరు అని కౌసల్య అంటుంది. కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావే అనే వసుంధర అంటుంది. మంచిని మంచిని చెప్పడం కూడా తప్పేనా నీ అల్లుని నువ్వు హద్దులో పెట్టుకో నా కోడల్ని నేను హద్దులో పెడతాను అంటూ కౌసల్య వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే, మల్లి కాఫీ అని గౌతమ్ అంటాడు. మల్లి కాఫీ తీసుకొచ్చి నిలబడుతుంది. గౌతమ్ కాఫీ తీసుకోబోతూ ఉండగా ఎందుకు మీరు అదోలా ఉంటున్నారు పాత గౌతమ్ సార్ మిస్ అవుతున్నారు మీ మొహం లో సంతోషం లేదు అసలేమైంది మీకు అని మల్లి అంటుంది. కాఫీ ఇవ్వు మల్లి అని గౌతమ్ అంటాడు. ఫోన్ తన చేతిలో పెట్టి అరవింద్ బాబు కి ఫోన్ చేయమని అంటుంది మల్లి .. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది