Malli Nindu Jabili December 22 2023 Episode 527 : రేయ్ నా కూతుర్ని ఎందుకు తోసేసావు నువ్వు పోలీసువా రోడ్ సైడ్ రౌడీవా అని శరత్ అంటాడు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు మీరు స్టేషన్ చెప్పక్కర్లేదు అని ఎస్ఐ అంటాడు. నాన్న ఆయన నీ జైల్లో వేశారు ఎలాగైనా విడిపించాలి అని మల్లి అంటుంది. అందుకే అమ్మ లాయర్ గారిని తీసుకువచ్చాను అని శరత్ అంటాడు. సిఐ గారు ఐక్యూ న్యూస్ ఛానల్ గౌతమ్ నంద ని విడిపించడానికి బేల్ తీసుకువచ్చాను అని లాయర్ అంటాడు. సారీ సార్ బెల్ రాదు సార్ అని సిఐ అంటాడు. ఎందుకు అని శరత్ అంటాడు. మినిస్టర్ ధర్మారావు గారి మీద ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసినాడు కాబట్టి కోట్లు హాజరు పరిచాక అప్పుడు మీరు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోండి ఇక మీరు బయలుదేరండి అని అంటాడు
లాయర్ గారు ఏమంటారు అని శరత్ అంటాడు. కొన్ని విషయాల్లో మనం ఏమీ చేయలేం సార్ అని లాయర్ అంటాడు. గౌతమ్ అని శరత్ పిలుస్తాడు. నీ కూతురు నా మీద పగ తీర్చుకుంటుంది ఓదార్పు మాటలు చెప్పొద్దు ప్లీజ్ మామయ్య బయటకు వెళ్ళండి అని గౌతమ్ అంటాడు. లాయర్ గారు రిక్వెస్ట్ చేస్తాడు కానీ సి ఐ ఒప్పుకోడు. చేసేదేమీ లేక వాళ్ళు బయటికి వెళ్లిపోతారు. నాన్న ఆయన కోర్టుకు వెళ్లకుండా బయటికి రావాలి ని మల్లి అంటుంది. సీనియర్ లాయర్లతో మాట్లాడుతాను మినిస్టర్ గారి కేసు కదా ఇలాగే ఉంటుంది అని శరత్తు మల్లి ఓదారుస్తాడు.
నాన్న కావాలని నేనే ఆయన ఇరికించాను అనుకుంటున్నాడు అని మల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏం కాదులే అమ్మ నేను చూసుకుంటాను అని శరత్ అంటాడు. కట్ చేస్తే, నన్ను టార్చర్ చేసిన ఆ గౌతమ్ గాని వదిలిపెట్టను నలిని గారు అందుకే వాడికి చుక్కలు చూపిస్తున్నాను అని వసుంధర అంటుంది. ఇంతలో అరవింద్ మాలిని ఇంటికి వచ్చేస్తారు. మాలిని అత్తయ్య మిదే నాకు అనుమానం ఉంది మా పెళ్లి టాపిక్ బయట పెట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించింది ఇది కూడా అత్తయ్య చేసి ఉంటుంది అని అరవింద్ అంటాడు. నా జోలికి వచ్చిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టని వాళ్ళ అంతు చూస్తాను అని వసుంధర అంటూ ఉండగా అరవింద్ మాలిని వస్తారు. వాళ్లని గమనించిన వసుంధర మాట మార్చి మల్లి గౌతమ్ ఏ తప్పు చేయలేదని నాకు అని పిస్తుంది వాళ్లను కాపాడడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాను అని వసుంధర అంటుంది. అమ్మ అరవింద్ కి నీ మీద అనుమానం వచ్చింది అని మాలిని అంటుంది. ఇంతలో శరత్ మల్లి ని తీసుకొని ఇంటికి వస్తాడు. మావయ్య గౌతమ్ కి బెల్ వచ్చిందా అని అరవింద్ అడుగుతాడు. రాలేదు బాబు సిఐ గారు కుదరదు అన్నారు అని శరత్ అంటాడు. మల్లి నీకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయి అని మాలిని బాధపడుతుంది.
ఎందుకంటే నా కూతురు ఎంత కష్టమైనా ఓర్చుకుంటుంది కాబట్టి ఇలాంటి కష్టాలు ఇస్తున్నాడు దేవుడు అని మీరా అంటుంది. అక్క నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని మల్లి అంటుంది. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని మాలిని చెంప మీద ఒకటి ఇచ్చి ఎప్పుడూ ఏదైనా ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు ఇలా పిరికి దానిలా మాట్లాడతావా అంటుంది.నువ్వే నన్ను కావాలని ఇరికించావని మా ఆయన నన్ను అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని మల్లి బాధపడుతుంది. మల్లి నిన్ను సైన్ పెట్టమని నీ దగ్గరికి ఆర్టికల్ తీసుకొచ్చింది ఎవరు అని అరవింద్ అంటాడు. ప్రీతి అని మల్లి చెప్తుంది. అరవింద్ వెంటనే ప్రీతికి ఫోన్ చేస్తాడు. ప్రీతి ఫోన్ ఎత్తి చెప్పండి సార్ అని అంటుంది. పేపర్లో ప్రింట్ వేసేటప్పుడు నువ్వు చెక్ చేసుకోలేదా అని అరవింద్ అంటాడు.మల్లి మేడం సైన్ చేయడంతో నేనేమి చూసుకోకుండా చేసేసాను సార్ అని ప్రతి అంటుంది.ఇది ఎవరో కావాలని ప్లాన్ చేసి ఇలా చేశారు నీకు ఏదైనా ప్రూఫ్ దొరికితే నాకు వెంటనే ఇన్ఫామ్ చెయ్ అని అరవింద్ అంటాడు. అలాగే సార్ అని ప్రీతి అంటుంది. మీరా మల్లిని చూసి బాధపడుతుంది. ఒక్కటి మాత్రం తెలుసు గౌతమ్ బయటికి వచ్చాడు అంటే దీనికి కారణమైన వారిని కచ్చితంగా పట్టుకుంటాడు పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని శరత్ అంటాడు.
అలా జరగకపోతే నా కూతురు గౌతమ్ బాబు చేతిలో బలైపోతుంది బాబు గారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మీరా. కట్ చేస్తే గౌతమ్ ని పోలీసులు తాడు పెట్టి కట్టేసి కొట్టడానికి ప్రయత్నిస్తారు. అర్థమైంది నీకు మినిస్టర్ గారు ఎంత ఇచ్చారు అని గౌతమ్ అంటాడు. మాకు మాకు లెక్కలు చాలా ఉంటాయి సార్ మినిస్టర్ గారు మా వెనకాల ఉన్నప్పుడు మీలాంటి న్యూస్ ఛానల్ వాళ్ళు ఏమీ చేయలేరు అని సీఐ అంటాడు. మల్లి గౌతమ్ ఫోటో చూస్తూ బాధపడుతుంది. ఇంతలో మీరు ఆ వచ్చి మల్లి అన్నం తిందువు గాని రామ అని అంటుంది. గౌతమ్ బాబు బయటికి వచ్చాకే అన్నంమైన నీళ్లైనా అని మల్లి ఏడుస్తుంది. ఇంతలో మాలిని అన్నం పెట్టకు వచ్చి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటుంది.
మల్లి నువ్వు తింటేనే కదా పోరాటానికి శక్తి ఉండేది నువ్వు తినకపోతే మీ అమ్మ మీద ఒట్టు ప్లీజ్ కాదనకు మల్లి అని మాలిని అన్నం తినిపిస్తుంది మల్లి కి. అన్నం నోట్లోది ఊ0చి నాకు సహించట్లేదక్క నేను ఆయనకు అన్నం పెట్టించి వస్తాను అని మల్లి గౌతమ్ కోసం బాక్స్ పెట్టుకొని రా నాన్న మీ అల్లుడికి అన్నం పట్టుకెళ్దాం అని అంటుంది. అదే మన మీ అత్తవారిల్లు అనుకున్నావా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి అని వసుంధర అంటుంది. మల్లి నేను వస్తాను గౌతమ్ తో మాట్లాడుతాను అని అరవింద్ అంటాడు. ఇప్పుడు నిన్ను గౌతమ్ చూస్తే స్టేషన్లో పెద్ద గొడవ చేస్తాడు గౌతమ్ బయటికి వచ్చిన తర్వాత మాట్లాడుదువులే అని శరత్ మల్లి ని తీసుకొని వెళ్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?