Mamagaru: ఈరోజు ఆన్లైన్ క్లాస్ చెప్పి నేను టీచర్ ను కాబోతున్నాను అని శ్రీలక్ష్మి సంతోష పడిపోతూ ఉంటుంది. శ్రీలక్ష్మి డెమో క్లాసు చెప్పుదామని లాప్టాప్ ఓపెన్ చేయగానే, చంగయ్య వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. పిల్లలు మనం తర్వాత క్లాసు కంటిన్యూ చేద్దాం అని లాప్టాప్ మూసేసి శ్రీలక్ష్మి డోర్ తీస్తుంది. ఏంటి శ్రీలక్ష్మి డోర్ కొట్టాను పిలిచాను ఏం చేస్తున్నావ్ పడుకున్నావా అమ్మ కానీ పడుకున్నట్టు కనిపించట్లేదేంటి నీ మొఖంలో చెమటలు ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చoగయ్య అంటాడు. ఉక్కపోస్తుంది మామయ్య గారు నిద్రపోయాను కదా అని శ్రీలక్ష్మి అంటుంది. సరేలే అమ్మ కొన్ని లెక్కలు ఉన్నాయి చూద్దాం రా కూర్చో అని అంటాడు చoగయ్య.నాకన్నా లెక్కలు నీకే బాగా వస్తాయి కదా మామయ్య గారు మీరే చేసుకోండి అని శ్రీలక్ష్మి అంటుంది. నా కళ్ళద్దాలు రిపేర్ కి ఇచ్చానమ్మ అయినా నువ్వు టీచర్వి కదా లెక్కలు బాగానే చేస్తావురా వచ్చి కూర్చో అని చoగయ్య లెక్కలు చేయమని చెప్తాడు. లెక్కలు చూస్తూ శ్రీ లక్ష్మీ కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తుంది.
ఇంతలో వసంత అక్కడికి వచ్చి అక్క నువ్వు వెళ్ళు నేను చూస్తాను అని పంపించేస్తుంది. అదేంటమ్మా కళ్ళు తిరిగితే టాబ్లెట్ వేసుకోవాలి కానీ డోర్ వేసుకుంది ఎందుకు అని చoగయ్య అంటాడు. మామయ్య గారు మనం లెక్కలు చూద్దామా అని వసంత అంటుంది. నువ్వు చదువుకున్నది లా చదివావు కదా అమ్మ మరి లెక్కలు ఎలా చేస్తావు అని చంగయ్య అంటాడు. లెక్కలు చేయడానికి ఏముంది మామయ్య చేసేస్తాను అని లెక్కలు చేస్తుంది వసంత. శ్రీలక్ష్మి ఆన్లైన్ క్లాసు చెప్పి అప్లికేషన్ పెడుతుంది. ఆ సంగతి వసంత దగ్గరికి వచ్చి చెప్తుంది. అక్క నువ్వు ఇందాక వచ్చి నన్ను కాపాడావు థాంక్స్ అక్క నువ్వు కూడా ఇంటర్వ్యూ తీసుకు నేను వెళ్లి వంట పని చూస్తాను అని అంటుంది శ్రీలక్ష్మి. దానిదేముంది అక్క ఒకరికి ఒకరం సహాయం చేసుకుని ఇలాగే ఆన్లైన్ జాబ్స్ చేద్దాము మామయ్యని కంట కనిపెట్టుకుంటూ ఉండాలి లేదంటే కొంపలు మునుగుతాయి అని వసంత అంటుంది. ఆల్ ద బెస్ట్ అక్క ఇంటర్వ్యూ తీసుకో అని శ్రీ లక్ష్మీ వెళ్ళిపోతుంది. భగవంతుడా ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి నాకు ఆన్లైన్ జాబ్ వచ్చేలా చేయి అని వసంత నమస్కారం పెట్టుకుంటుంది. కట్ చేస్తే,
నాకు పనుంది నువ్వేంటి ఊరంతా తిప్పుతున్నావు నేను వెళ్తాను అని గంగాధర్ అంటాడు. మీరు ముందు బండి ముందుకు పోనివ్వండి అని గంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకు వెళుతుంది. ఇదేంటి గంగా సర్టిఫికెట్ కోసం అని పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చావు అని గంగాధర్ అంటాడు. ఏమీ లేదండి మీ సర్టిఫికెట్ పోయింది కదా మనం కంప్లైంట్ ఇచ్చి చలానా కడితే నీకు డూప్లికేట్ సర్టిఫికెట్ వస్తుంది అప్పుడు లోన్ తెచ్చుకోవచ్చు అని గంగా అంటుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే నాతో ఫ్రీగా సర్వీస్ చేయించుకుంటారు గంగా నేను రాను అని గంగాధర్ అంటాడు. నేనున్నాను కాదండి అయిదు నిమిషాల్లో పని అయిపోతుంది ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అని గంగా అంటుంది. ఈ మహేష్ గాడు ఎక్కడ చచ్చాడు అని గంగాధర్ మహేష్ కి ఫోన్ చేసి హలో సార్ ఏంటి సార్ కరెంట్ పేలి మంటలు వస్తున్నాయా నేను ఇప్పుడే వస్తున్నాను సార్ ఎక్కడ సార్ జరిగింది అని గంగాధర్ అంటాడు.
రేయ్ గంగాధర్ ఏంట్రా ఏవేవో మాట్లాడుతున్నావు నేను రా మహేష్ రా ఈ యాక్టింగ్ చేసే వాడికి ఇంతసేపు ట్రైనింగ్ ఇచ్చాను రా నువ్వేంటి రా మమ్మల్ని తప్పించుకొని ఎటో వెళ్లిపోయి ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్ నీకేమైంది రా అని మహేష్ అంటాడు. ఏంటి మహేష్ సార్ 30 మంది పిల్లలు ఉన్నారా నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను సార్ అని గంగాధర్ అంటాడు. రేయ్ గంగ సార్ ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ రా అని మహేష్ జుట్టు పీక్కుంటూ ఉంటాడు. గంగ అర్జెంటుగా నేను వెళ్ళాలి అక్కడ పిల్లల్ని కాపాడాలి అని గంగాధర్ అంటాడు. అక్కడ కరెంటు వల్ల ప్రమాదం జరిగితే మీరు వెళ్లి ఏం చేస్తారండి ఫైర్ ఇంజన్ కదా ఫోన్ చేయాలి అని గంగా అంటుంది. అయినా ఐదు నిమిషాలలో పని అయిపోతుందండి ఆ తర్వాత వెల్దురు గాని అని గంగ అంటుంది. గంగ ఐదు నిమిషాలు ఆగితే ఎన్ని ప్రాణాలు పోతాయి ఏమో నేనైతే వెళ్తున్నాను అని గంగాధర్ వెళ్ళిపోతాడు. ఈయన ఏంటి సర్టిఫికెట్ తీసుకుందాం అనుకున్నప్పుడల్లా కంగారు పడిపోయి టెన్షన్ పడుతున్నాడు అసలు సర్టిఫికెట్ తీసుకుంటాడా లేదా అని గంగ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే,
చంగయ్య వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని భోజనం చేద్దామని అనుకుంటారు. నాయనమ్మ ఇలా బయట కూర్చుని ఎందుకు అందరం కలిసి తినాలి అని వాళ్ళ మనవరాలు అడుగుతుంది.ఈరోజు అన్నపూర్ణ దేవి పుట్టినరోజు అమ్మ అందుకే ఇలా అందరం ఒకచోట కూర్చొని తింటే ఆ అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది అని దేవమ్మ చెప్తుంది. అంతే కాదు పిల్లలు ఈరోజు అక్షయ తృతీయ కూడా అందుకే ఇటు అన్నపూర్ణాదేవిని ఇటు సరస్వతి దేవిని పూజించి ఆరాధిస్తారు,అత్తయ్య మా ఇంట్లో కూడా ఇలాగే బయట కూర్చుని తినే వాళ్ళము అని గంగా చెప్తుంది. అందరూ వచ్చారు మీ నాన్నగారు రాలేదేంట్రా అని దేవమ్మ అడుగుతుంది. తాతయ్య రాడు కానీ మాకు పెట్టు నాయనమ్మ అని వాళ్ళ మనవరాలు అంటుంది. సరే పిల్లలకు పెడదామని దేవమ్మ గోరుముద్దలు చేసి పిల్లలకు పెడుతుంది. ఇంతలో చoగయ్య వస్తాడు.
రండి నాన్న మీ కోసమే అందరం ఎదురు చూస్తున్నాం అని సుధాకర్ అంటాడు. రండి వచ్చి కూర్చోండి అని దేవమ్మ అంటుంది. అందరినీ పరిశీలిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు చoగయ్య. దేవమ్మ అందరికీ చేతుల్లో అన్నం పెడుతుంది. చంగయ్య కు కూడా చేతిలో అన్నం పెడుతుంది. చంగయ్య మాత్రం తినకుండా అలా అందరిని చూస్తూ ఉంటాడు .ఏంటండీ తినకుండా అలాగే చూస్తున్నారు అని దేవమ్మ అడుగుతుంది. ఏమీ లేదు దేవమ్మ వీళ్ళ అందరి మొహాలలో సంతోషం కనబడుతుంది కానీ నాకు ముద్ద పెట్టేటప్పుడు మాత్రమే మొహంలో సంతోషం కనబడలేదు ఎందుకు దేవమ్మా అని చంగయ్య అంటాడు..
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?