Chiranjeevi: సంక్రాంతి సెలబ్రేషన్స్ మెగా కుటుంబం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు అల్లు ఫ్యామిలీ అంతా ఒకే చోట జాయిన్ అయ్యారు. మెగా సంక్రాంతి కార్యక్రమాలకు సంబంధించి ఫ్యామిలీ ఫోటోలతో పాటు రకరకాల వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. త్వరగా సినిమాల్లోకి అకీరా వస్తే బాగుంటుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీలో నాగబాబు మరియు వరుణ్ తేజ్ కంటే హైట్ గా అకీరా ఉండటం జరిగింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ పరిమితమై… అకీరాని సినిమాల్లోకి దింపాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇదిలా ఉంటే చిరంజీవి కొత్త సినిమా “విశ్వాంభర” టైటిల్ ఇటీవల వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో సినిమా కాన్సెప్ట్ కి సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేశారు. “బింబీసార” దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సోషియో ఫాంటసీ కథతో తీస్తున్న ఈ సినిమా మూడు నాలుగు లోకాల మధ్య ఉండనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ కి సంబంధించి సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. “విశ్వంభర” సినిమాలో చిరంజీవి సరసన త్రిష, నయనతార, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుందట. చిరంజీవి కెరియర్ లో “జగదేకవీరుడు అతిలోకసుందరి” అతిపెద్ద విజయం సాధించింది.
అదే తరహాలో “విశ్వంభర” ఉండనుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బెంగళూరులో సంక్రాంతి సంబరాలు కంప్లీట్ చేసుకున్న చిరంజీవి ఇటీవల.. హైదరాబాద్ కి చేరుకోవడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి.. మళ్లీ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ రాజమహేంద్రవరం మారేడుమల్లి అడవుల్లో చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. చిరంజీవి కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమాగా “విశ్వంభర” నిర్మితమవుతోంది.