Nindu Noorella Saavasam April 232024 Episode 218: నీ కూతురు ఇక్కడే ఉందని చెప్పాను కదా ఇంకా ఎందుకు కంగారు పడుతున్నారు అని గుప్తా అంటాడు. తన కూతురు ఇక్కడ ఉన్నందుకు కాదు కంగారు పడడం తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అని కంగారు పడుతున్నాడు అని మంగళ అంటుంది. పంతులుగారు చెప్పిన గడియలు రానే వస్తున్నాయి ఈరోజు బాగీ పెళ్లి జరిగిపోతుంది నేను ఆపాలి అంటూ రామ్మూర్తి లోపలికి వెళ్ళిపోతాడు. చూశారా గుప్తా గారు ఈ పెళ్లి ఆ భగవంతుడు జరిపిస్తున్నాడు అందుకే ఆయన కూడా ఈరోజు భాగి పెళ్లి అవుతుందని పంతులుగారు చెప్పారని చెప్పాడు ఇది దైవ సంకల్పం గుప్తా గారు అని అరుంధతి అంటుంది. బాలిక ఒకసారి అటు చూడుము అని గుప్తా గీతవంక చూపెడతాడు. రామ్మూర్తి వెళ్ళిపోయేటప్పుడు గీత చెదిరిపోతుంది.
గుప్తా గారు ఆ భగవంతుడు నాకు సహాయం చేస్తున్నాడు నేను మా ఆయనకి భాగీ కి పెళ్లి చేస్తాను అంటూ అరుంధతి లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఎందుకే మను ఇలా చేస్తున్నావ్ ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకొని మారిపో నీకు మా ఆయనకి పెళ్లి జరగనివ్వను అని అరుంధతి అంటుంది. మనోహరి కి తన కనిపించక పోయిన అరుంధతి ఏదో మాట్లాడినట్టు వినిపించి భయపడుతుంది. మను నీకోసం నేను పోరాడుతానని నీకు మాట ఇచ్చాను కానీ నువ్వు ఇలా చెయ్యకే నా కుటుంబాన్ని నా పిల్లలే నాశనం చేయకు నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే గెలుస్తావేమో కానీ నేను ఓడిపోతాను ఎందుకే ఈ పగలు పంతాలు ఆయన నిన్ను కాదని నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారనే కదా నీ పగ పెళ్లి ఆపితే నేను గెలుస్తాను కానీ నువ్వు నేను ఇద్దరం ఓడిపోతామే ఎందుకంటే మనిద్దరం అనాధలం కదా చిన్నప్పటినుంచి నువ్వు నేను వేరు కాదు ఇద్దరం ఒకటే కాబట్టి నువ్వు ఓడిపోయిన నేను ఓడిపోయిన ఒకటే అని బాధపడుతుంది అరుంధతి.
కట్ చేస్తే, ఎందుకయ్యా అంత కంగారుపడుతూ వెళ్తున్నావ్ వచ్చాం కదా బాగీ ఎక్కడ ఉందో చూడు అని మంగళ అంటుంది. ఈ పెళ్లి ఆపడానికి రాలేదే ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాను అని రామ్మూర్తి అంటాడు. అరుంధతి సడన్గా భాగమతి చూస్తుంది. భాగమతి అరుంధతిని చూస్తుంది. అక్క నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని భాగమతి అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మిస్సమ్మ ఈ పెళ్లికి ఎందుకు వచ్చావు అని అరుంధతి అడుగుతుంది. ఆ మనోహరి మంచిది కాదని తెలుసుకుని ఈ పెళ్లి ఆపడానికి వచ్చాను ఆ పిల్లల్ని అ కుటుంబాన్ని కాపాడుతాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి ని ఎలా ఆపాలి అని భాగమతి అంటుంది. నీకు ఈ కుటుంబానికి ఏంటి సంబంధం మిస్సమ్మ నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావ్ అని అరుంధతి అంటుంది. అదేంటక్క అలా అంటావ్ నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు తోడుగా ఉన్నారు మా నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోతే సొంత మనిషిలా చూసుకున్నారు నాకు పెళ్లంటే వాళ్ళ ఇంట్లో మనిషి లాగా నన్ను పెళ్లి పీటలు దాకా తీసుకెళ్లారు అలాంటి కుటుంబం కష్టంలో ఉంటే చూస్తూ సహాయం చేయకుండా ఉంటానా అని భాగమతి అంటుంది.
అది సరే మనోహరి తో పెళ్లి ఆపుతావ్ కానీ అతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అరుంధతి అంటుంది. అంత మంచివాడు భర్తగా వస్తానంటే ఎవరు వద్దంటారు అక్క అని భాగమతి అంటుంది. ఆయన అంత మంచి వాడా అని అరుంధతి అంటుంది. శ్రీరాముడు ఎంతటి వాడు శివుడు ఎంత మంచి గుణముల కలవాడు పాండవులకు సహాయం చేసిన శ్రీకృష్ణుడు లాంటి వాడు అక్క ఆయన అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని భాగమతి అంటుంది. కానీ ఇప్పుడు పెళ్లిని ఎలా ఆపాలి ఆ కుటుంబాన్ని ఎలా రక్షించాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది భాగమతి. అన్ని మాటలు విన్న అరుంధతి బాగా ఆలోచించి నన్ను క్షమించు మిస్సమ్మ అని భాగమతి ఒంట్లో ప్రవేశిస్తుంది అరుంధతి.కట్ చేస్తే,ఎందుకమ్మా గారు టెన్షన్ పడుతున్నారు నీలా అడుగుతుంది. పెళ్లి దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ మొదలైంది అని మనోహరి అంటుంది. పెళ్లికూతుర్ని తీసుకురమ్మని పంతులుగారు చెబుతారు. రండమ్మా అని నీలా మనోహర్ని తీసుకువస్తుంది.
పెళ్లి పీటల మీదికి వస్తున్న మనోహరి రౌడీలని చూస్తుంది. వాళ్లు మనోహర్ని చూస్తే ప్రాబ్లమ్ అని మనోహరీ పీటల మీద కూర్చోకుండా తన గదిలోకి పరిగెత్తుకెళ్ళి కూర్చుంటుంది. ఏమైంది నీలా మనోహరి ఎందుకు అలా వెళ్ళిపోయింది పీటల మీద ఎందుకు కూర్చోలేదు అని నిర్మల అడుగుతుంది. ఏమోనమ్మా నాకేం తెలుసు అని నీలా అంటుంది.కట్ చేస్తే,వాళ్లు అక్కడే ఉన్నారు అమర్ తో నా పెళ్లి ఎలా జరుగుతుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది.మనోహరి ఎందుకు పీటల మీద కూర్చోకుండా రూమ్ లో వచ్చి కూర్చున్నావు పంతులుగారు పిలుస్తున్నారు అని నిర్మల అంటుంది.
అత్తయ్య అమర్ తో నా పెళ్లి అయితే మూసుకు వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటానని అమ్మవారికి మొక్కుకున్నాను అందుకే ముసుగు లేదని ఇక్కడ కూర్చున్నాను అని మనోహరి అంటుంది. అదే మొక్క ఇలాంటి ముక్కు నేనెప్పుడూ వినలేదు అని నిర్మల అంటుంది. నా పెళ్లి తొందరగా కావాలని అంతకుముందు ఎప్పుడో మొక్కుకున్నాను ఆంటీ అని మనోహరి చెప్పడంతో త్వరగా మూసుకు వేసుకొని రా అమ్మ అని నిర్మల వెళ్ళిపోతుంది. ఒసేయ్ వాళ్ళు ఉన్నారా లేదా అని చూసి రమ్మంటే వాళ్ళు వెళ్ళిపోయారు అన్నావు కదా అని మనోహరి నీలా గొంతు పడుతుంది. నేను చూసినప్పుడు వాళ్ళు లేరమ్మ అని నీలా అంటుంది. వెంటనే వెళ్లి మూసుకు ఒకటి తీసుకురా అని మనోహరి నీలాని బయటికి పంపిస్తుంది. ఏమైందమ్మా పెళ్లికూతురు ఇంకా రాలేదు అని పంతులుగారు అడుగుతారు. పెళ్లికూతురు ముసుగు వేసుకోవడం ఆచారం అంట పంతులుగారు వచ్చేస్తుంది అని నిర్మల చెబుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది