Nindu Noorella Saavasam April 29 2024 Episode 223: ఆరు పిల్లలు నా కుటుంబం అనుకున్నాను మిస్సమ్మ మిమ్మల్ని ప్రేమగా చూసి దూరం చేసేది మీ డాడీని మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే మీకు మీ డాడీని అంత దూరం చేస్తుంది మీ అమ్మ పేరుని మరిచిపోయేలా చేస్తుంది అందరూ మిస్సమ్మ అని పిలిచేలా చేసుకుంటుంది ఇక ఈ ఇంట్లో ఆరు పేరు వినిపించదు మీ అమ్మ ప్రేమ మీకు దూరమైపోతుంది అని ఏడుస్తూ పరిగెత్తుకెళ్తుంది మనోహరి. ఆ మాటలన్నీ విన్న పిల్లలు ఆలోచనలో పడతారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అమ్మ స్థానాన్ని దక్కించుకోనివ్వకూడదు అ మనోహరి ఆంటీ అన్న మనల్ని బెదిరించో భయపెట్టో డాడీని పెళ్లి చేసుకోవాలని చూసింది కానీ మిస్సమ్మ మనకు చెప్పకుండా చేసింది తన మోసాన్ని మనం ఎప్పటికీ క్షమించకూడదు అని అంజలి అంటుంది.
అమ్మ ప్రేమ చూపిస్తుంది మిస్సమ్మ ని అమ్మ ప్రేమని తనలో వెతికాం కానీ ఇకమీదట మనం అమ్మ ప్రేమని వెతకడం మానేయాలి లేదంటే అందరూ మనల్ని ఇలాగే మోసం చేస్తారు అని అమృత అంటుంది. అసలు మిస్సమ్మ ఇలా చేస్తుందని అనుకోలేదు అని ఆకాష్ అంటాడు. అందుకే మిస్సమ్మ ఇంట్లోకి వచ్చినా కానీ మనం ఎవరు మాట్లాడకూడదు తనని క్షమించకూడదు మన రివేంజ్ ఎలా ఉంటుందో చూపించాలి ప్రామిస్ చేయండి అందరూ అని అంజలి అంటుంది. అందరూ మిస్సమ్మ తో మాట్లాడకూడదని ప్రామిస్ చేస్తారు. కట్ చేస్తే, గుప్తా గారు అరుంధతి అమరేంద్ర మిస్సమ్మ వస్తున్నారా లేదా అని గేటు వంక తొంగి తొంగి చూస్తూ ఉంటారు. ఏమై ఉంటుందంటారు గుప్తా గారు అని అరుంధతి అంటుంది. నీ పని దేవుడు వచ్చుచున్నాడు చూడుము అని గుప్తా అంటాడు.అమరేంద్ర ఇంటికి వస్తాడు. అమరేంద్ర కోపంగా ఇంట్లోకి వెళుతూ ఉంటాడు. రండి గుప్తా గారు వెళ్లి చూద్దాం అని అరుంధతి అంటుంది.
అమర్ అలా లోపలికి వెళ్ళకురా ఆగు మీ ఇద్దరికీ దిష్టి తీయాలి అని నిర్మల అంటుంది. అమ్మ మోసని భరించలేని నేను అబద్ధాన్ని బంధంగా ఫీల్ అయ్యి తనతో కలిసి దిష్టి తీయించుకోవాలా అని అమరేంద్ర అంటాడు.ఇంతలో భాగమతి కూడా వస్తుంది. భాగమతి పిల్లల్ని చూసి హాయ్ చెబుతుంది. పిల్లలు తన వంకా కోపంగా చూస్తారు. ఏంటే పిల్లలు అలా చూస్తున్నారు అని భాగమతి అంటుంది. పెళ్లి ఆపేస్తానని చెప్పి వాళ్ళ అమ్మ ల ఇంటికి వస్తే పిల్లలకి కోపం రాక సంతోషం ఎలా ఉంటుంది కొన్నాళ్లు భరించాల్సిందే ఆగు అని కరుణ అంటుంది. భాగమతి లోపలికి రావడానికి సంకోచిస్తుంది. భాగీ లోపలికి రా తాళి కట్టించుకునే ముందు తెలియదా నీకు ఇవన్నీ ఇప్పుడు ఎందుకే భయపడుతున్నావ్ రా అని మంగళ అంటుంది. చూసితివా నువ్వు చేసిన తప్పిదము వలన ఆ బాలిక అందరి ముందు తప్పు చేసిన దానిలా మిగిలిపోయింది అని గుప్తా అంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని భగవంతుడు రాసి పెట్టాడు గుప్తా గారు అని అరుంధతి అంటుంది. మా ఆయన మరీ అంత మొండివాడేమీ కాదు ముందు ముందు తనే మారి తనని ప్రేమగా చూసుకుంటాడు అని అరుంధతి అంటుంది. ఈ దృశ్యం చూడవలెననే కదా మనం ఇక్కడ ఉన్నది అని గుప్తా అంటాడు.
క్షమించండి బాబు అని రామ్మూర్తి అంటాడు. బావగారు ఇంకా క్షమాపణలు ఏంటి బంధువులు అయిపోయారు కదా అని శివరామ్ అంటాడు. మీ కూతురు చేసిన తప్పుని వెనకేసుకు రకండి తను చేసింది తప్పు కాదు మోసం ఆ మోసాన్ని నా పక్కన భార్యగా ఎప్పటికీ నిలబెట్టుకోలేను అని అమరేంద్ర అంటాడు.నీలా తొందరగా దిష్టి తీయాలి ఎర్రటి నీళ్లు కర్పూరం తీసుకురా అని నిర్మల అంటుంది. మిస్సమ్మ అమర్ పక్కన వచ్చి నిలబడు అని నిర్మల అంటుంది. భాగమతి ఎనక ముందు ఆలోచిస్తుంది. కరుణ ఎనక నుండి తోయడంతో వచ్చి అమరేంద్రకు టచ్ అవుతుంది. క్షమించండి చూసుకోలేదు అని భాగమతి అంటుంది. అమరేంద్ర కోపంగా తన వంక చూస్తాడు. మనోహరి ఆ దృశ్యాన్ని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. మిస్సమ్మ సరిగ్గా నిలబడు అని శివరామ్ అంటాడు. నీలా కర్పూరం ఎర్రటి నీళ్లు తెచ్చి వాళ్ళిద్దరికీ దిష్టితీస్తుంది.
ఇద్దరూ కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని నిర్మల చెబుతుంది. ఆగండి ఇద్దరు అలా వెళ్ళిపోతే ఎలా మి పేర్లు చెప్పి వెళ్లాలి అని కరుణ అంటుంది. ఇప్పుడు కొత్తగా పేర్లు చెప్పుకోవడమేంటి వాళ్ళ పేర్లు వాళ్లకి తెలియవా అని పిల్లలు అంటారు.పేర్లు తెలుసు కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా సాంప్రదాయంలోభార్యాభర్తలు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలి అని కరుణ అంటుంది. అవును మిస్సమ్మ అని నిర్మల అంటుంది.ముఖ్యమైనవి మాత్రమే చేయించండి ఇలాంటివేవి వద్దు అని భాగమతి భయపడుతూ అంటుంది.సరే కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి అని నిర్మల అంటుంది.కట్ చేస్తే, అమరేంద్ర భాగమతి కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు.అమర్ అలా వెళ్ళిపోకు మీ ఇద్దరూ కలిసి దేవుడికి దీపం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి మీ బంధం బలపడాలని అని నిర్మల చెబుతుంది. అమ్మ ఈ బంధమే అబద్ధం అనుకుంటుంటే ఇంకా బంధం బలంగా ఉండాలని దేవుడికి దండం ఎలా పెట్టుకుంటాను నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ నువ్వు వెళ్లి దీపం పెట్టు అని నిర్మల సైగ చేస్తుంది. భాగమతి భయపడుకుంటూ వెళ్లి దేవుడికి దీపారాధన చేసి హారతి ఇచ్చి అమరేంద్ర దగ్గరికి వచ్చి నిలబడుతుంది.
అమర్ హారతి తీసుకొని మిస్సమ్మని అక్షంతలు వేసి ఆశీర్వదించు అని నిర్మల అంటుంది. భాగమతి అమరేంద్ర కి హారతి ఇస్తుంది. నిర్మల హారతి ప్లేట్ ని తీసుకొని అమరేంద్ర కాళ్లు మొక్కు ఆశీర్వదిస్తాడు అని చెబుతుంది. భాగమతి అమరేంద్ర కాళ్ళకి నమస్కారం పెడుతుంది. కోపంతో పిడికిలి బిగించిన అమరేంద్ర అక్షంతలు తనమీద తెలియకుండానే వేసేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది