Nindu Noorella Saavasam November 24 2023 Episode 89: బయటికి నెట్టేసి పగటి వేషగాళ్లంతా మా ఇంటికి వస్తారు ఏంటో అనుకుంటూ రాథోడ్ గేటు వేసి లోపలికి వెళ్ళిపోతాడు. నాకు ఆత్మ కావాలి ఆత్మను బంధించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను అని ఆ మాంత్రికుడు అరుస్తూ ఉంటాడు. బాలికకు అదృష్టము బాగుండి ఈరోజు గండము తప్పినది లేకుంటే ఆ మాంత్రికుడు చేతిలో బందీ అయిపోయేది అనుకుంటూ గుప్తా గారు వెళ్ళిపోతాడు. మనోహరి అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా గారు ఏం ఆలోచిస్తున్నారు అని నీలా అడుగుతుంది. ఏమీ లేదే ఆ మాంత్రికుడు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను నిజంగానే ఈ ఇంట్లో ఆత్మ ఉందంటావా అని మనోహరి అంటుంది.ఊరుకోండి అమ్మగారు అలాంటి వాళ్లు అలాగే చెప్తూ ఉంటారు డబ్బుల కోసం ఇంట్లో ఆత్మ ఎక్కడ ఉంటుంది అని నీలా అంటుంది. ఎందుకు నాకు డౌట్ గా ఉందే అని మనోహరి అంటుంది.
ఇంకా నయం ఇతన్ని పిల్లలు చూస్తే భయపడే వాళ్ళు స్కూల్ నుంచి రాలేదు కాబట్టి సరిపోయింది, అయ్యో పైన అంజు భయపడి ఉందేమో అని భాగమతి పైకి వెళ్లి చూస్తుంది. అంజు డోర్ పెట్టుకొని రాసుకుంటూ ఉంటుంది. అంజు డోర్ పెట్టుకొని ఏం చేస్తున్నావ్ పడుకున్నావా చదువుకోమన్నాను కదా అని అంటుంది భాగమతి. డోర్ తీసి వచ్చి మళ్లీ రాసుకుంటూ ఉంటుంది. ఏంటంజు డోరెందుకు వేశావు అని భాగమతి అడుగుతుంది. వెయ్యాలి అనిపించింది అందుకే వేశాను అని అంజు అంటుంది. ఎందుకు నీకు డోర్ వెయ్యాలనిపించిందో నీకే తెలియదా అని భాగమతి అంటుంది. ఉరుములు మెరుపులు అంటే నాకు భయం చిన్నప్పుడు ఇలాగే ఉరుములు మెరుపులు వస్తే అమ్మ నన్ను పట్టుకొని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని నేను ఉన్నాను నాన్న బాధపడకు ఏడవకు నీ పక్కనే ఉన్నాను అనే ధైర్యం చెప్పేది కానీ ఇప్పుడు నాకు భయం వేయలేదు అమ్మకు భయం వేసినట్టు అనిపించి డోర్ వేశాను అని అంజ ఏడుస్తుంది. అంజు అమ్మ బాధపడుతున్నట్టు నీకు తెలిసిందా భయపడుతున్నట్టు నీకు అనిపించిందా అని అరుంధతి అంటుంది.
అంజు ఏడవ కమ్మ నేను ఉన్నాను కదా నీకు అని భాగమతి తన దగ్గరికి తీసుకొని ఊరుకోబడుతుంది. కట్ చేస్తే భాగమతి వాళ్ళ పిన్ని వాళ్ళ మామయ్య అరుంధతి అడ్రస్సు తెలుసుకుని వస్తారు. ఏంటి పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని భాగమతి వెళ్లి అడుగుతుంది. ఇంట్లో మిల్ట్రీ ఆయన భార్య చనిపోయిందట కదా నీకు తెలుసా అని వాళ్ళ పిన్ని అడుగుతుంది.పిన్ని నాకు తెలియదు అని భాగమతి అంటుంది. నిజంగా నీకేమీ తెలియదా మరి ఇంట్లోనే పని ఎందుకు చేస్తున్నావు అని వాళ్ళ పిన్ని అడుగుతుంది. ఈ మిల్ట్రీ ఆయన సంతకం పెడితే నాన్నని హాస్పటల్లో జాయిన్ చేయొచ్చు కదా పిన్ని అందుకే వచ్చి పని చేస్తున్నాను అంతే నాకేమీ తెలియదు అని భాగమతి అంటుంది. సరేలే ఇక మేము వెళ్తాము అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి మిస్సమ్మ ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్లతో మాట్లాడావు అని అడుగుతుంది మనోహరి. ఏదో అడ్రస్ అడుక్కుంటూ వచ్చారు ఇది కాదు అని చెప్పి పంపించాను అని భాగమతి అంటుంది. కట్ చేస్తే స్కూల్లో లంచ్ బ్రేక్ కొడతారు. తాతయ్య అన్నం తిందాం రా అని అమృత అంటుంది. నేను తర్వాత తింటాను మీరు తినండి అమ్మ అని వాచ్మెన్ అంటాడు.
లంచ్ బ్రేక్ కొట్టింది తినడానికే తాతయ్య రండి అని అమృత తీసుకువెళ్లి అన్నం పెడుతుంది. తాతయ్య పప్పు టమాట లో ఈ పచ్చడి వేసుకోండి బాగుంటుంది అని ఆకాష్ అంటాడు.మీరు చూపించే ప్రేమకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా అని రామ్మూర్తి అంటాడు. ఇంతకుముందే మాకు ఏదైనా ఇచ్చి ఉంటారు తాతయ్య అని అమృత అంటుంది.అన్నం తింటున్నా రామ్మూర్తికి పోరా పోతుంది. తాతయ్య మంచినీళ్లు తాగు అని ఆకాష్ అంటాడు. చూసుకోవాలి కదా తాతయ్యతా అని అమృత అంటుంది. నా కూతురు కూడా అచ్చం నీలాగే అంటుందమ్మా అని రామ్మూర్తి అంటాడు.తయ్య అన్నం తిన్న తర్వాత ఈ పెరుగు వేసుకోవాలి లేదంటే మా మిస్సమ్మ ఊరుకోదు అని అమృత అంటుంది.మా అమ్మాయి కూడా నాకు ఇలాగే టిఫిన్ పెట్టి పంపించేది అమ్మ అని రామ్మూర్తి అంటాడు. ఇవన్నీ తినకపోతే మా మిస్సమ్మ ఇంటికి వెళ్ళగానే పెద్ద గొడవ చేస్తుంది తాతయ్య మా మిస్సమ్మ చాలా మొండిది మేము పెట్టే టార్చర్ తట్టుకొని ఇంకా ఇంట్లోనే ఉంది అదే వేరే వాళ్ళైతే వెళ్ళిపోయేవారు అని ఆనంద్ అంటాడు.
నా కూతురు కూడా అంతే బాబు ఏదైనా పని చేయాలి అనుకుంటే మొండిగా చేసేస్తుంది ఆ పని అయ్యేదాకా వదిలిపెట్టదు అని రామ్మూర్తి అంటాడు. మీ అమ్మాయికి మా మిస్సమ్మకి ఒకే పోలికలు ఉన్నా ఏంటి తాతయ్య అని ఆనంద్ అంటాడు. మిమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్న ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పాలని ఉందయ్యా అని రామ్మూర్తి అంటాడు తాతయ్య మా మిస్సమ్మ తో మాట్లాడుతారా అని అమృత అంటుంది. ఇప్పుడు వద్దులే అమ్మ ఇంకెప్పుడైనా మాట్లాడుతాను స్కూల్ కి టైం అవుతుంది అని రామ్మూర్తి అంటాడు. పర్వాలేదు తాతయ్య రండి అని అమృత తీసుకువెళ్లి మిస్సమ్మ కి ఫోన్ చేస్తుంది. హలో మిస్సమ్మ నేను స్కూల్లో తాతయ్య అని చెప్పాను కదా నీతో మాట్లాడుతాడఅంట మాట్లాడు అని అంటుంది అమృత.ఇప్పుడు నాకు పని ఉందమ్మా తర్వాత మాట్లాడతాను అని భాగమతి అంటుంది.
ఒక్కసారి మాట్లాడు మిస్సమ్మ అని అమృత అంటుంది. అలాగే మాట్లాడతాను ఫోన్ ఇవ్వు అని భాగమతి అంటుంది. ఇంతలో రామ్మూర్తి దగ్గుతాడు. ఆ దగ్గు ను విన్నా భాగమతి ఎవరు అతను అలా తగ్గుతున్నాడు ఎందుకు అని అడుగుతుంది. పోరా పోయినట్టుంది మిస్సమ్మ ఇందాక అన్నం తినేటప్పుడు కూడా అలాగే దగ్గాడు అని అమృత అంటుంది. అవునా అయితే నేను తర్వాత మాట్లాడుతాను నాకు పని ఉందమ్మా అని మిస్సమ్మ ఫోన్ కట్ చేస్తుంది. తాతయ్య మిస్సమ్మ ఫోన్ కట్ చేసింది తర్వాత మాట్లాడతానంటుంది అని అమృత అంటుoది. తనతో మాట్లాడే అదృష్టం లేదేమో లే మా తర్వాతే మాట్లాడతాను అని రామ్మూర్తి అంటాడు. ఎవరు అతను అని మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?