Nuvvu Nenu Prema:పద్మావతి గుడిలో నుండి బయటకు వస్తూ ఉంటే విక్కీ చెల్లెలు దివ్య పద్మావతికి ఢీకొంటుంది. పద్మావతి విక్కి చెల్లిని చూస్తుంది. పద్మావతిపై ఆమె కోప్పడుతుంది పద్మావతిని కొట్టబోతుంది పద్మావతి నువ్వు పొగరుగా ఉన్నావు కాబట్టి నేను అలాంటి దాన్ని కాదు నీకు ఇలానే ఆవేశం ఉంటుంది నేను అలా ఆవేశపడను ఇది గుడి కాబట్టి నువ్వు ఆడపిల్లవి కాబట్టి నేను ఇక్కడితో తగ్గి వెళుతున్నాను మరోసారి ఇలా ఎదుటి పడిన వ్యక్తి మీద చేయి చేసుకునే ముందు ఆలోచించు అని చెప్పి పద్మావతి వెళ్ళిపోతుంది. పద్మావతి ఆమెకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆమె కోపంతో రగిలిపోతూ ఉంటుంది కానీ పద్మావతికి విక్కీ చెల్లెలు తను అని తెలియదు. ఆమె కూడా పద్మావతి వికీ భార్యా అన్న విషయం తెలియదు.
ఇక విక్కీ వీల్ చైర్ లో నుంచి మంచం మీదకి వెళ్లాలని చూస్తూ ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న ఆర్య వెంటనే వచ్చి విక్కీని పట్టుకొని జాగ్రత్తగా మంచం మీద కూర్చోబెడతాడు. విక్కీకి చాలా కోపం వస్తుంది. ఆర్య మీద కోపంగా చూస్తూ ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా విక్కీ అని అంటాడు వారి ఆ మాటలకు విక్కి ఎందుకు నా మీద జాలి చూపిస్తున్నావా ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తున్నావు కదా అని అంటాడు. ఆర్య కి ఏమీ అర్థం కాదు ఏమి మాట్లాడుతున్నావ్ విక్కీ అని అంటాడు. అవును నన్ను పర్మినెంట్గా మంచానికే పరిమితం చేసి ఈ ఆస్తి అంతా నువ్వు కొట్టేసి ఆఫీస్ లో నువ్వే మేనేజర్ ఐపోదాం అనుకుంటున్నావు కదా అని మాట్లాడుతాడు విక్కీ అవమానిస్తుంటే ఆర్య కు ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో చెప్పు అని అంటాడు లేదంటే ఇలా మాట్లాడక ఎలా మాట్లాడాలి ఆర్య నన్ను ఆక్సిడెంట్ చేసి నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన లారీ డ్రైవర్ ఎవరో ఇంత బడికి నువ్వు కనిపెట్టలేకపోయావు కనీసం ఇంత చిన్న విషయం దగ్గర నువ్వు ఇన్ని రోజులు నుంచి ప్రయత్నిస్తున్నావంటే నేను నమ్మాలా అని అంటాడు ఆ మాటలకు ఆర్య లేదు విక్కీ నేను గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను చేసిన వాళ్ళు చాలా పకడ్ బందీగా చేశారు నేను కచ్చితంగా కనిపెడతాను అని అంటాడు నువ్వు కనిపెట్టాలి కనిపెట్టకపోతే నేను నిన్ను అనుమానించాల్సి వస్తుంది అని అంటాడు. విక్కీ ఆర్య అలాంటిదేం లేదు ఇంకొద్ది రోజుల్లో నీ ముందు నిన్ను ఆశ్రయం చేసిన వ్యక్తి నిలబడతాను అని అంటాడు. ఈ మాటలన్నీ దూరంగా కృష్ణ వింటూ ఉంటాడు అంటే వీళ్ళు ఆక్సిడెంట్ చేసిన పర్సన్ ని కనుక్కోవాలని గట్టిగా అనుకుంటున్నారు అది నేనే అని తెలిస్తే ఇంకేం లేదు విక్కీ నన్ను చంపేస్తాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు కృష్ణ. ఇక విక్కి మాట్లాడి మాటలకు అర్య ఫీలయ్యి లేదు విక్కీ ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు నేను తర్వాత వస్తాను నేను మాటిస్తున్నాను కదా ఆ లారీ డ్రైవర్ ని నీ ముందు నిలబెడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఇక అప్పుడే అక్కడికి పద్మావతి వస్తుంది పద్మావతి ఏంటి సారు మీరు రెస్ట్ లేకుండా ఇలా ఉంటే ఎలాగూ మీకోసం గుడికి వెళ్లి నేను పూజ చేయించి ప్రసాదం తీసుకువచ్చాను. అని చెప్పి విక్కీకి ప్రసాదం ఇస్తుంది అంతలో అక్కడికి వచ్చిన అరవిందా మా తమ్ముడిని నువ్వు ఒక్కదానివే చూసుకోవాలా నాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని అంటుంది. ఇక వికీకి టాబ్లెట్స్ వేసే టైం అయిందని అనుకుంటూ ఉండగా పద్మావతి నేను రేపు ఉదయం గుళ్లో పూజ గురించి మాట్లాడి వచ్చాను ఈ పూజ చేస్తే ఖచ్చితంగా విక్కి సారు లేచి నిలబడతాడంట అని అరవిందతో చెప్తుంది దానికి అరవింద సంతోషించి తప్పకుండా వెళ్దాము అని అంటుంది. కానీ అందుకు విక్కీ ఒప్పుకోడు మందులు వాడుతున్నాం కదా అక్క ఇవాళ కాకపోతే రేపైనా క్యూర్ అవుతుంది అని అంటాడు. లేదు విక్కీ మన, ఆలోచనలతోపాటు దైవ బలం కూడా తోడవ్వాలి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాము మనం రేపు గుడికి వెళుతున్నాము అని అంటుంది అరవింద్ వికీసారే అంటాడు ఇక పద్మావతి రేపు పూజ కోసం ఏర్పాటు చేస్తాను అనుకుంటుంది. ఇక మరోవైపు చంద్రప్రసాద్ ఇంటికి ఫ్రెండ్ వస్తాడు. ఏంటి ప్రసాదు నువ్వు ఇండియా రావడం నీ కొడుకుని చూడడం అని అయిపోయాయా అని అంటే, నా కొడుకుతోపాటు నా కోడల్ని చూశాను అని అంటాడు నా కూతుర్ని కూడా చూశాను రా అని చంద్రప్రసాద్ అంటాడు అప్పుడే అక్కడికి వచ్చి, దివ్య, అంకుల్ వాళ్ళతో మా నాన్నని మాట్లాడొద్దని చెప్పండి అని అంటుంది. దివ్య అని చంద్రప్రసాద్ అనగానే దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చంద్ర ప్రసాద్, దివ్య కోపం గురించి నీకు తెలిసిందే కదా అని తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఇప్పుడు విక్కీని చూడాల్సిన అవసరం ఏముంది అని తన ఫ్రెండ్ అడిగితే నేను కొన్ని రోజులే బతికి ఉంటాను కాబట్టి దివ్యని వాళ్లతో కలపాలి ఈ లోపు అని అంటాడు. దివ్య ఒప్పుకుంటున వాళ్ళతో కలవడం అని తన ఫ్రెండ్ అనేసరికి, అక్కడికి వచ్చిన దివ్యా ఎప్పటికి కలవను అని అంటుంది. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని చంద్రప్రసాద్ అంటే నేను ఎప్పటికీ వాళ్లతో కలవను వాళ్లతో కలపాలని చూస్తే నేను చనిపోతాను కానీ వాళ్లతో ఎప్పటికీ కలవను అని అంటుంది ఆ మాటలకు చంద్రప్రసాద్ తన ఫ్రెండ్ దగ్గర బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తావురా అని అంటే తప్పు చేసింది నేనే కాబట్టి, వాళ్లని సరి చేసే బాధ్యత కూడా నాదే వాళ్ళందర్నీ కలపాల్సిన బాధ్యత నాకుంది. ఏదో ఒకటి చేసి దివ్యని వాళ్ళ అన్నయ్యని కలుపుతాను అని అంటాడు చంద్ర ప్రసాద్.
ఇక అందరూ గుడికి వస్తారు విక్కీ ఫ్యామిలీ మొత్తం, పద్మావతి పూజకి ఎన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతుంది. పూజిత పార్టీ హోమం కూడా చేయించాలి అనుకుంటున్నాను అని పద్మావతి అందరి ముందు చెబుతుంది. పద్మావతి కచ్చితంగా వికీ తగ్గించాలనుకుంటుంది ఆ కాన్ఫిడెన్స్ మీద నేను దెబ్బ కొట్టాలి అనుకుంటాడు కృష్ణ. విక్కీ వాళ్ళందరూ లోపలికి వస్తుంటే ఒక సాధువు కళ్ళు మూసుకొని వికీ వాళ్ల గురించి ఆలోచిస్తూ అలా జరగడానికి వీల్లేదు అని అనుకొని విక్కీ ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఇక పంతులుగారు వచ్చి మీరు త్వరగా కోలుకోవాలని మీ భార్య అత్యంత కఠినమైనటువంటి ఈ పూజకి హోమానికి ఒప్పుకున్నారు. ఈ హోమం పూర్తయి మీరు ఇరువురు పూర్ణాహుతి సమర్పిస్తే, మీ భర్త త్వరగా కోలుకొని మామూలు మనిషి అవుతాడు అని అంటే పద్మావతి తన కోల్పోవడం కంటే నాకు కావాల్సిందేం లేదు అని అంటుంది. ఇంతమంది ఉన్నా మాకు ఇలాంటి పూజ చేయించాలన్న ఆలోచన రాలేదు భర్త కోసం నువ్వు పడే తాపత్రయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని అంటాడు నారాయణ. నీవల్లే అయినా మా విక్కి త్వరగా కోరుకుంటూ అంతే చాలు అని అంటుంది అరవింద. తప్పకుండా వదినా నేను మళ్ళీ మామూలు మనిషిని చేసి తీరుతాను అని అంటుంది పద్మావతి అమ్మ మీరు తలపెట్టిన ఈ దీక్ష మృత్యుంజయ హోమం అమ్మవారికి అభిషేకం చేయాలి అమ్మవారి అభిషేకంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదు అలా జరిగితే జరిగేది అనర్ధాలు ఆటంకం లేకుండా పూజ పూర్తి చేయాలి అని పంతులుగారు చెప్తూ ఉంటాడు పద్మావతి ఫ్యామిలీతో, అప్పుడే అక్కడికి ఒకసారి వచ్చి సాదువు అలా జరగడానికి వీల్లేదు అని అంటాడు. ఎవరు సార్ మీరు హోమం వద్దంటున్నారు అని అంటుంది పద్మావతి. వెంటనే సాధువు ఈ హోమం నీ భర్తని ఆయుష్షుని చేయడం కాదు నిన్ను బలి కోరుకుంటుంది అని అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో నారాయణ అంటే నిజం మాట్లాడుతున్నాను అంటాడు సాధువు. ఏ భర్త క్షేమం కోసం అయితే నువ్వు ఈ హోమం తలపెట్టావో ఆ హోమం పూర్తయ్యేసరికి నువ్వు శాశ్వతంగా నీ భర్తకు దూరం అవుతావు అని అంటాడు సాధువు. నేను చెప్పేది విని మానుకోండి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు నీ ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు అని అంటాడు సాధువు పద్మావతి తో, లేదు సమస్య లేదు నా భర్త కోసం నేను చేస్తున్న ఈ దీక్ష హోమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపను, చేసి తీరుతాను అని అంటుంది పద్మావతి. అమ్మవారి ఉపాసన తపోశక్తి సంపన్నులమైన మేము చెప్పే మాటనే నువ్వు ధిక్కరిస్తున్నావా అని అంటాడు సాధువు. నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు అని అంటాడు. వెంటనే అరవిందా స్వామి మంచి మనసుతో నా మరదల్ని ఆశీర్వదించండి నా తమ్ముడి కోసం ఇదంతా చేస్తుంది. అన్నీ తెలిసిన వారు లాగా ఉన్నారు మీరు అడ్డుపడుతున్నారు ఏమిటి అని అంటే అడ్డుపడకపోతే తన ఆయుష్షు ఇంతటితో సమాప్తం అవుతుంది. మీరు ఆమె చేసే పూజలు చేస్తుంటే నేను అనృత్యుని చూస్తున్నాను అని అంటాడు సాధువు. అందుకే నేను చెప్పింది విని ఈ పూజ ఆపేయండి అని అంటాడు. నా చేతికి మట్టి అంటకుండా పూజ ఆపిస్తున్నాడు అని కృష్ణ మనసులో అనుకుంటాడు. లేదు నా ప్రాణం పోయినా నేను దీక్ష ఆపాను, నా మెయిల్ కోసమే మీరు ఇదంతా చెబుతున్నారు నాకు అర్థమైంది కానీ నా భర్త కన్నా నా ప్రాణమేం గొప్పది కాదు అని అంటుంది పద్మావతి. ఏది ఏమైనా నేను దీక్ష చేసి తీరతాను అని అంటుంది పద్మావతి. జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అంటాడు సాధువు. ఎంత కష్టమైనా తట్టుకుంటాను, ఈ దీక్షను మాత్రం విరమించను. నువ్వు తలపెట్టినంత సులువు కాదు ఈ దీక్షను చేయడం విధి రాతను కానని నీ తలరాతని నువ్వే మార్చుకోబోతున్న వ్, ఇక నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాధువు. ఇక విక్కీ మనం వెళ్ళిపోదాము నీకేమైనా అయితే ఎట్లా పద్మావతి అని అంటాడు. సరే మీరు నా కోసం టెన్షన్ పడకండి ఈ హోమం జరగాలి మీరు బాగుండాలి మీరు మామూలు మనిషి అవ్వాలి అంతే, పద్మావతి నీ ప్రాణానికి ప్రమాదం అంటున్నారు కదా అంటుంది అరవింద అయ్యో వదిన దీక్ష మొదలు పెట్టకుండా ఇలాంటి మాటలు ఎందుకు, ఆ సాధువు ఏదో చెప్పాడని మీరంతా ఇలా మాట్లాడితే ఎలాగూ, హోమానికి అన్ని ఏర్పాట్లు చేద్దాము అని అంటుంది పద్మావతి.
రేపటి ఎపిసోడ్ లో పద్మావతి దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది. కొనేట్లో ఉన్న నీటిని తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం మీద పోస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ ఎట్లాగైనా పద్మావతి అనుకున్నది చేసేలా ఉంది ఇప్పుడు పద్మావతికి ఏదో ఒక ఆటంకం ఏర్పాటు చేయాలి అనుకుని గాజు పెంకులు పద్మావతి కాల దగ్గర వేస్తాడు అది చూసుకోక పద్మావతి గాజు పెంకు మీద కాలేసి పెద్దగా అరుస్తుంది ఇంట్లో వాళ్ళందరూ పద్మావతి వైపు చూస్తారు. పద్మావతి అనుకున్న విధంగా పూజ పూర్తి చేసిందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!