Poonam Kaur: హీరోయిన్ పూనమ్ కౌర్ అందరికీ సుపరిచితురాలే. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే వివాదాలలో వార్తల్లో నిలిచి చాలా హైలెట్ అయిన హీరోయిన్. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా స్టోరీ త్రివిక్రమ్ ఒరిజినల్ గా రాసుకోలేదని.. ఓ నవల ఆధారంగా కాపీ కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను ఆధారం చేసుకుని ఈ సినిమా స్టోరీ త్రివిక్రమ్ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై పూనమ్ కౌర్ స్పందించడం జరిగింది.
ఈ క్రమంలో ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా జాగ్రత్త పడే నైపుణ్యం కలిగిన వాడు. కొంతమంది గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం..ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు మరి” అని సెటైర్లు వేయడం జరిగింది. ఈ ట్వీట్ కి గురూజీ థింగ్స్ అనే హ్యష్ ట్యాగ్ జత చేయడం జరిగింది. గతంలో చాలా సందర్భాలలో కూడా త్రివిక్రమ్ పై పరోక్షంగా పూనమ్ కౌర్ కామెంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి చేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన “గుంటూరు కారం” ఈ నెల 12వ తారీకు విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా స్లోగా జరుగుతున్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు .. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పక్క మాస్ లుక్ లో మహేష్ కనిపిస్తూ ఉండటంతో.. సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.