Krishna Mukunda Murari: భవానీ దేవి తన అనుకున్న విధంగా మురారి కి ముకుందకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది మురారి ముకుంద లకు ఈరోజు, పసుపు రాసే కార్యక్రమాన్ని చేస్తారు. ఒకవైపు ముకుంద కి భవానీ దేవి పసుపు రాస్తూ ఉంటే మరోవైపు, మురారి కి వాళ్ళ అమ్మ రేవతి పసుపు రాస్తూ ఉంటుంది రేవతి చాలా బాధపడుతూ, మురారి కి పసుపు రాస్తూ ఉంటుంది జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ, మురారి కూడా బాధపడుతూ ఉంటాడు ఇక భవానీ దేవి దగ్గరికి కృష్ణ వాళ్ళ పిన్ని వచ్చి గొడవ చేస్తుంది కృష్ణ అని ఇలా జరుగుతుంటే మీరంతా కావాలని చేస్తున్నారని భవాని దేవితో అంటే భవానీ దేవి నీ భర్త హంతకుడు అని ఆవిడతో చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక భవానీ దేవి తో ముకుంద అత్తయ్య మీరు నా జీవితాన్ని నిలబెట్టాలి అనుకున్నారు మొదటగా మీరే నాకు నలుగు పెట్టాలి అని అంటుంది. ఆ మాటలకు కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఇక భవానీ దేవి కృష్ణని ముకుందకి గంధం రాయమని చెప్తుంది కృష్ణ నేను రాయను అని అనగానే నువ్వు పెద్ద దానివి కదా రాయకపోతే ఎలాగు రాయి అని అంటుంది ఇక ఏం చేసేది లేక బాధపడుతూ గంధం రాస్తూ ఉంటుంది కృష్ణ ముకుంద కి నీకు అప్పుడే భవానీ దేవి దగ్గరికి మురారి వస్తాడు.
అప్పటికే మురారి కి ఫోన్ వస్తుంది శ్రీధర్ని ముగ్గురు కలిసి చంపేశారు అందులో ఒకటి దొరికాడు అని పోలీసులు చెప్తారు మురారి కి, భవాని దేవి దగ్గరికి వచ్చి మురారి అదే మాట చెబుతాడు భవానీ దేవి ఇంట్లో అందరూ చాలా మురారి చెప్పిన మాటలకు, ఆచరిపోతారు ఇక వాడెవడో పట్టుకొని ఇక్కడికి తీసుకువచ్చి వాడి చేత నిజం చెప్పిస్తాను పెద్దమ్మ అని అంటాడు మురారి ఆ మాటలకు భవానీ దేవి నువ్వే వెళ్ళకూడదు ఈ టైంలో బయటికి నలుగు పెట్టిన తర్వాత పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పులి మీద దాటకూడదు అని అంటుంది ఇలాంటి కట్టుబాట్లు పెట్టుకుంటే అసలు దేశి తప్పించుకుంటాడు పెద్దమ్మ అని అంటే ఏం పర్లేదు నువ్వు మీ పోలీసులకి ఫోన్ చేసి చెప్పు వాళ్ళు ఇక్కడికి తీసుకు వస్తారు అని అంటుంది. ముకుందా ఒకవైపు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పోలీసులు చేతికి దేవి ఎక్కడ చెప్పే దొరికిపోతాడు ఆ నలుగురిలో ఒకటి దొరికేసాడు కాబట్టి వాడు ఎక్కడ దేవి పేరు చెప్పేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇక వెంటనే ముకుంద దేవ్ కి ఫోన్ చేసి నాకు చాలా కంగారుగా ఉంది. ఈ ముగ్గురిలో ఒకటి దొరికేశాడు ఇప్పుడు వాడి వల్ల నిజం బయటపడి మన పేరు బయటికి వస్తే ఏం చేయాలి అని అంటుంది నో టెన్షన్ పడిన టెన్షన్ పెట్టకు అని దేవ్ ముకుంద మీద అది చేసి ఫోన్ పెట్టేస్తాడు. ఈ దేవి ఏం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు మురారి తీగలాగితే మొత్తం బయటపడుతుంది ఇప్పుడేంటి పరిస్థితి అని ముకుంద బాగా టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటికే రెడీ అయిపోయి మురారి పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతాడు భవాని దేవి ఆపుతుంది ఏంటి పెద్దమ్మాయిలా ప్రతిదానికి అడ్డుపడితే నేనేం చేయలేను అని అంటాడు. కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నీ పోలీసులు నీకు అన్యాయం చేయరు కదా నీ డిపార్ట్మెంట్ నువ్వు నమ్మకపోతే ఎలాగో వాళ్లే వాడిని తీసుకొని వస్తారు అని అంటారు. అది కాదు పెద్దమ్మ నేను వెళ్ళాలి అని అంటే కృష్ణ నేను కూడా వస్తాను అని అంటుంది ఇద్దరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటుంది భవాని దేవి ఇక కృష్ణకు కోపం వచ్చి భవాని దేవి మీద రివర్స్ అవుతుంది.
ఇక భవానీ దేవికి ఎదురు తిరిగి కృష్ణ మాట్లాడుతూ మీరు ఎందుకు వద్దంటున్నారు నాకు అర్థమైంది మా బాబాయ్ ఏ హత్య చేయలేదు అని నిరూపిస్తే ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది మీ మాట మీ పెద్దరికం అయిపోతాయి అని మీరు భయపడుతున్నారు అందుకే ఇప్పుడు మమ్మల్ని వెళ్ళద్దంటున్నారు కదా అని అంటుంది ఆ మాటలకు భవాని దేవి కోపం వస్తుంది నేను భయపడుతున్నానని ఒక్కసారిగా లేచి అరుస్తుంది. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ పెళ్లి జరుగుతుంది మీ బాబాయ్ హత్య చేశాడు. ఆ విషయం అందరికీ తెలుసు ఎంతమంది హంతకులు వచ్చి నిజం చెప్పిన, అబద్ధం చెప్పిన అది ఏంటో తెలుసుకోలేనంత పిచ్చి దాన్ని కాదు నేను అని అంటుంది. మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నావు నేను ఎందుకు చేస్తాను మీ బాబాయ్ హత్య చేశాడన్న విషయం నీకు తెలియదా ఇంట్లో వాళ్ళని నమ్మించినంత తెలివి కాదు నన్ను నమ్మించడం అని అంటుంది. ఆ మాటలు పూర్తవ్వకుండానే, శ్రీధర్ ని చంపిన ముగ్గురిలో ఒకడిని పట్టుకొని పోలీసులు వస్తారు.
ఇక వాడిని చూసి మురారి చాలా కోపంతో వాని కొడతాడు నిజం చెప్పమని అడుగుతాడు ఇది అంతటికి కారణం ఎవరు ఎవరి ఇదంతా చేయిస్తున్నారు అని నిలదీస్తాడు మురారి ఆ వచ్చిన దొంగ నాకేం సంబంధం లేదు సార్ ఈ ఇంట్లో నుంచి ఒకళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయమన్నారు అని అంటాడు. ఈ ఇంట్లో వాళ్ళు నీకు ఎవరు డబ్బులు ఇచ్చారు నిజం చెప్పు అని మురారి అడగడంతో పెద్దపల్లి ప్రభాకర్ అని, కృష్ణ బాబాయ్ పేరు బయట పెడతాడు దొంగ వెంటనే అందరూ షాక్ అవుతారు. నిజం చెప్పు నువ్వు అబద్దం చెప్తున్నావని నాకు తెలుసు అని మురారి వాడిని బాగా కొడతాడు. అయినా కానీ వాడి నిజం చెప్తున్నాను సార్ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కచ్చితంగా నిజమే చెప్తున్నాను పెద్దపల్లి ప్రభాకర్ అనే వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించాడు. అని చెప్పు పోలీసులు వాన్ని తీసుకెళ్లిపోతారు భవానీ దేవి రెచ్చిపోతుంది చూసావుగా కృష్ణ నిజం బయటపడింది మీ బాబాయ్ చేశాడని సాక్ష్యం కూడా దొరికిపోయింది ఇప్పుడు నువ్వేం మాట్లాడలేవు ఇంకా జరగాల్సిందే జరుగుతుంది అని అనడంతో కృష్ణుని బాగా తిట్టి అక్కడి నుంచి పంపిచేస్తుంది భవానీ దేవి ముకుంద కొంచెం సంతోషపడిన కానీ దేవి ఎక్కడ దొరికిపోతాడు అని ఇంకా భయంగానే ఉంటుంది. మురారి చాలా బాధపడతాడు కృష్ణుని అందరి ముందు అవమానించి భవాని దేవి బయటికి వెళ్ళమంటుంది. ఇక కృష్ణ వెళ్లిపోయిన తర్వాత ముకుంద ఇంట్లోనికి వస్తు, ఎదురుగా వచ్చిన కానిస్టేబుల్ కి అబద్దం చెప్పిన దొంగకి ఇద్దరికీ డబ్బులు ఇచ్చి మీరు బాగా ఆడ్ చేశారు ఈ డబ్బులు తీసుకొని వెళ్ళండి అని అంటాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమీ తెలియనట్టు దేవుని లోపలికి వచ్చి మురారితో ఇప్పుడే నాకు ఎదురైన వాళ్ళని చూశాను వాడే దొంగ వాడి నిజం చెప్పాడా అని అంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు మురారి. ఇక భవాని దేవి జరిగింది చెప్తూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా కృష్ణ బాధపడుతూ ఉంటే దేవ్ కృష్ణ దగ్గరికి వెళ్లి నువ్వేం బాధపడకు మీ బాబాయిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చేతిలో చెయ్యేసి చెప్తాడు. అప్పుడే కృష్ణ దేవి చేతి ఉంగరాన్ని గుర్తుపడుతుంది వెంటనే అప్పుడు శ్రీధర్ ముఖం మీద ఎవరైతే ఉంగరం గుర్తు ఉన్నదో అదే ఉంగరం గుర్తు అదే ఉంగరాన్ని, దేవి చేతికి పెట్టుకోవడం చూసి కృష్ణ షాక్ అవుతుంది వెంటనే దేవ్ కాలర్ పట్టుకుని ఎంత మోసం చేశావు నువ్వే కదా ఇదంతా చేసింది అని అంటుంది. ఇంట్లో అందరూ ఒక సరిగా షాక్ అవుతారు మురారి అక్కడే ఉంటాడు మురారి ఏంటి కృష్ణ అని అనగానే శ్రీధర్ ని చంపింది. ఇదంతా చేసింది ఇదే అని అందరి ముందు చెబుతుంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!