Trinayani December 20 2023 Episode 1115: ఆ విషయం నన్ను అడగాలి కానీ వాళ్ళని అడిగితే ఏం చెప్తారు అని విక్రాంత్ అంటాడు.నాగులపురం నుంచి పెట్టే తేవడానికి కూడా ఉలోచి సహాయం చేసింది కాబట్టి అందుకే గవ్వకి ఉలోచికి సంబంధం ఉంది అన్నాను అని విక్రాంత్ అంటాడు.మీరు అలా అంటే నా పాప అని టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి అని సుమన అంటుంది.పాపని మెచ్చుకున్నందుకు సంతోషించాలి కానీ గొడవ పడతావ్ ఏంటి చిట్టి అని హాసిని అంటుంది. అనాధ పిల్లా అయినా గాయత్రి మీద నింద పడుతుందని మా అక్క చూస్తుంటే అది నా పాప మీదకి తీసుకొస్తారు ఏంటి అని సుమన వెళ్ళిపోతుంది. వేరొక పాప చేస్తే నీ బిడ్డ మీదకెందుకు వస్తుంది సుమన అని హాసిని అంటుంది. ఏ పాప చేసింది అక్క అని నైని అడుగుతుంది.పాప కాదు చెల్లి పాపం పండి అత్తయ్యకి అలా జరిగింది అని హాసిని అంటుంది.ఏంటి అక్క నువ్వు అప్పుడప్పుడు అర్థం కాకుండా మాట్లాడతావు అని సుమన వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, కళ్ళు మూసుకోవడం కాదు స్వామి మా అమ్మకి గండం ఎలా వచ్చిందో చెప్పండి అని అంటాడు వల్లభ.
నేను మీ అమ్మకు గండం ఉందని చెప్పాను మీరే అర్థం చేసుకోలేదు అని స్వామి అంటాడు. అర్థమయ్యేలా చెప్పండి స్వామి గాయత్రి అక్కకు గండం వస్తే మరి నా ప్రాణాల మీదికి ఎందుకు వచ్చింది అని తిలోత్తమ అంటుంది. నేను నీకు ముందే చెప్పాను తిలోత్తమ గండం గాయత్రీ దేవికి వచ్చింది కానీ అది మారి నీ వైపే తిరిగింది అని పరోక్షంగా చెప్పాను మీరే అర్థం చేసుకోలేదు అని అఖండ స్వామి అంటాడు. అలా ఇన్ డైరెక్ట్ గా చెప్తే మాకు ఎక్కడ అర్థం అవుతుంది స్వామి ఇప్పుడేం చేయాలో చెప్పండి అని తిలతమ అంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న గాయత్రి పాపకి విషప్రయోగం చేయండి అది నైనీ కనపడితే గాయత్రీ దేవి కాదు అని అఖండ స్వామి అంటాడు.ఒకవేళ కనిపెట్టకపోతే ఎలా స్వామి అని వల్లభ అంటాడు. మీ అమ్మను చంపడానికి వచ్చిన మృత్యుదేవత ఆ గాయత్రీ దేవిని నమ్మండి అని అఖండ స్వామి అంటాడు. అలాగే స్వామి అని వెళ్ళిపోతుంది తిలోత్తమ. కట్ చేస్తే, హాసిని గాయత్రీ కి పాలు తీసుకు వెళుతుంది.
ఈ పాలలో బెల్లం కలిపావా చెక్ర కలిపావా అని పాలు తీసుకుని అందులో విషయం కలుపుతుంది తిలోత్తమా. అత్తయ్య ఆ పాలు నీకోసం కాదు గాయత్రీ కోసం అని తీసుకొని వెళ్ళిపోతుంది హాసిని. కట్ చేస్తే, పిల్లని ఆడి ఇస్తున్నావా ఈ పాలు తాగించు అని హాసిని అంటుంది. నైని తాగిస్తుంది కదమ్మా మనకెందుకు అని పావని మూర్తి అంటాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మే తాగించాలా మనం తాగించి మచ్చిక చేసుకుందాము అని దురంధర అంటుంది. ఓ ఇప్పుడు ప్రాక్టీస్ చేసి కేర్ గా జాబ్ చేస్తావా అని పావని మూర్తి అంటాడు. మామయ్య అత్తయ్యకి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అని విశాల్ అంటాడు. ఊరికే తిని కూర్చుంటే ఒళ్ళు పెరిగిపోతుందిగా అల్లుడు అని పావన మూర్తి అంటాడు. త్రిలోత్తమ కిచెన్ లో ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉండగా హాసినికి డౌట్ వస్తుంది వెంటనే నైని కి మెసేజ్ పెడుతుంది. కట్ చేస్తే, వల్లభ తిలోత్తమతో మాట్లాడుతూ ఉంటాడు.అమ్మ పెద్ద మరదలు కి ఇంకా ఏ డౌటు రాలేదు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో నైని మెసేజ్ చూసుకుంటుంది.
గాయత్రీ కోసం తీసుకువచ్చిన పాలు అత్తయ్య తన కోసమని తీసుకుంది తన ప్రవర్తన మీద నాకెందుకు డౌట్ గా ఉంది అని హాసిని మెసేజ్ పెడుతుంది. అది చూసిన నైని వెంటనే బయటికి వస్తుంది గుమ్మం దగ్గర వల్లభ కనిపిస్తాడు ఇదేంటి బావగారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మ తప్ప బావకి ఏ మేడం తెలియదు కదా అని నైని డౌట్ పడుతుంది. కట్ చేస్తే, సుమన ఉలోచి కోసం పాలు తీసుకొని ఉలిచి ఎక్కడున్నావు వచ్చి పాలు తాగమ్మా అంటుంది. చెల్లి ఈరోజు నువ్వు తెచ్చిన పాలు గాయత్రి పాపకు పడదాము అని నైని అంటుంది. ఎందుకమ్మా హాసిని తెచ్చింది అని పావన మూర్తి అంటాడు. ఏంటి బాబాయ్ రోజు పెద్దమ్మ తేవాలా ఒక్కరోజు కూడా పిన్ని తెచ్చి పాలు తాపీయదా నేను ఉలోచిని కన్నబిడ్డ లాగే చూసుకుంటున్నాను సుమన కూడా నా గాయత్రి ని అలాగే చూసుకుంటుంది సుమన ఆ పాలు గాయత్రికి ఇవ్వు అని నైని అంటుంది. అయినా సరే నాకు ఇష్టం లేదు అక్క అని ఉలోచిని పిలుస్తుంది సుమన. నువ్వు పిలిస్తే రాదు సుమన నేను పిలిస్తే వస్తుంది అని నైని అంటుంది. ఆ మాట అనకు వదిన నువ్వు కన్నావా బిడ్డని అని అంటుంది సుమన అని విక్రాంత్ అంటాడు. అదే మాట అడుగుతున్నాను చెప్పు అక్క అని సుమన అంటుంది.
నైనీ ఇప్పుడు గొడవంతా ఎందుకు ఎవరికి తెచ్చిన పాలు వాళ్లకు తాగించండి అని విశాల్ అంటాడు. అలా కాదు అక్క తెచ్చిన పాలు సుమన తెచ్చిన పాలు అక్కడ పెడదాము ఆ పాలలో ఏ పాలు తాగుతుందో చూద్దాము అని నైని అంటుంది. ఏంటి అక్క చెల్లెలు పోటీ పడుతున్నారా అని పావను మూర్తి అంటాడు. అక్క చెల్లెలు కాదు బాబాయ్ పాపలు ఇద్దరు పోటీ పడతారు అని హాసిని అంటుంది. అమ్మ నైని కనిపెట్టేసినట్టుంది విష ప్రయోగం జరిగిందని వల్లభ అంటాడు. వదిన నువ్వు కూడా నైని నీకే సపోర్ట్ చేస్తావ్ ఏంటి అని విశాల్ అంటాడు. నా ప్రాణం ఉన్నంతవరకు చలికే సపోర్ట్ చేస్తాను విశాల్ అని హాసిని అంటుంది. చిన్న కోడలా ఇప్పుడు పోటీలు ఎందుకు కానీ ఎవరి పిల్లలకు వాళ్ళు పాలు తాగించుకోండి అని తిలోతమ అంటుంది.
ఏంటి భయపడుతున్నావా సుమన ఓడిపోతానని అని విక్రాంత్ అంటాడు. అమ్మ నా భార్య ఒక్కతే కాదు ఆ విక్రాంత్ గాడు అందరూ నైని కే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు విష ప్రయోగం జరిగిందని ఇంట్లో వాళ్ళందరికీ తెలియాల అని వల్లభ అంటాడు. రేయ్ నువ్వు గమ్మునుండరా అని తిలోత్తమ అంటుంది. సరే ఇంతలా అంటున్నారు కాబట్టి నేను తెచ్చిన పాలు అక్కడ పెడుతున్నాను అని పాలు అక్కడ పెట్టి సుమన ఉలోచి ఎక్కడ ఉన్నావ్ వచ్చి పాలు తాగమ్మా అని సుమన అంటుంది.తను ఎంత పిలిచిన రాదు వదిన తను పిలిస్తే రాదు కానీ నువ్వు పిలువు అని విక్రాంత్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది