Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా కూడా తనదైన గ్లామర్ మరియు టాలెంట్ తో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హోదాను అందుకుంది. అగ్ర హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా సత్తా చాటుతోంది. గత ఏడాది ఈ అమ్మడు అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీ తో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. తొలి ప్రయత్నం లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని అక్కడి సినీ ప్రియలకు చేరువయ్యింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్ లో కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తోంది.
2022లో తన ప్రియ సఖుడు మరియు కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ ను నాయనతార వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు సహజీవనం చేసిన ఈ జంట.. ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో వీరి వివాహం అత్యంత వైభవం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు కూడా వీరి పెళ్లిలో సందడి చేశారు. అయితే జూన్ లో వీరి వివాహం జరగకగా… అక్టోబర్ లో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. సరోగసి ద్వారా కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. వివాహం జరిగిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పిల్లలను కనడం అప్పట్లో పెద్ద ఇష్యూ అయింది. కొన్ని లీగల్ సమస్యలు కూడా నయనతార దంపతులు ఎదుర్కొన్నారు.
పైగా సరోగసి ద్వారా పిల్లలను కనడం పట్ల నయనతారను చాలా మంది ట్రోల్ చేశారు. పిల్లలు కంటే బాడీ షేప్ అవుట్ అవుతుందని, అందం తగ్గిపోతుందని భావించే నయనతార సరోగసి ఎంచుకుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై కొందరు అప్పట్లో నయనతారును దారుణంగా విమర్శించారు. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నయనతార మరియు విఘ్నేష్ శివన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. హ్యాపీగా తమ పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి తరుణంలో నయనతారపై ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. నయనతారకు అసలు సంతాన యోగమే లేదని.. అందుకే ఆమె సరోగసిని ఆశ్రయించిందని వేణు స్వామి బాంబ్ పేల్చారు. చాలా మంది హీరోయిన్లు పిల్లలు కన్నా కూడా మళ్లీ ఫిట్ గా మారుతున్నారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో నయనతార అందం కోసం, ఫిజిక్ కోసం పిల్లల్ని కనలేదనేది ఒట్టి అబద్ధమని.. ఆమెకు సమస్య ఉందని.. ఆ కారణంగానే సరోగసి ద్వారా తల్లి అయిందని వేణు స్వామి కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.